Samantha: రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేశాను.. కష్టాలను తలుచుకొని ఎమోషనల్ అయిన సమంత?

Samantha: ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో నేడు పాన్ ఇండియా లెవెల్ లో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి సమంత.ఈమె అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ లో ఎంతో ముందుకు వెళ్తున్నారు. అయితే విడాకుల తర్వాత సమంత పబ్లిక్ ప్లేస్ లో అయినా లేదా సోషల్ మీడియా వేదికగా అయినా తాను చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా సమంత చెన్నైలోనే సత్యభామ యూనివర్సిటీకి వెళ్లి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సమంత విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. నేను చదువుకునే రోజుల్లో మా అమ్మ నాన్న నన్ను ఎంతో కష్టపడి చదివించారు.తనని ఒక గొప్ప స్థాయిలో చూడాలని అమ్మ నాన్నలు కలలు కన్నారు. నేను కూడా వారి కళలను నెరవేర్చే దిశగా పది 12 తరగతులలో టాపర్ గా నిలిచాను.

ఇక ఉన్నత చదువులు చదవడం కోసం మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తాను కన్న కలలను కలలుగానే మిగిలిపోయాయని ఈమె తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఆశించే మార్గంలో నడవడమే కాకుండా మీకంటూ ఓ గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించేవరకు ప్రయత్నాలు చేయాలని ఈమె విద్యార్థులకు మోటివేట్ చేశారు.

Samantha: ఎన్నో చిన్నచిన్న ఉద్యోగాలు చేశాను..

ఈ క్రమంలోనే తాను కూడా కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి సమంత వెల్లడించారు. కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో డబ్బు కోసం తాను ఎన్నో చిన్నచిన్న ఉద్యోగాలు చేశానని సమంత వెల్లడించారు.ఇక రెండు నెలల పాటు కేవలం ఒక్క పూట భోజనం చేసే బ్రతకానని అలాంటి కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాను కనుక ఈ స్థాయిలో ఉన్నానంటూ సమంత ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.