Samantha: సద్గురు ఇషా సెంటర్లో ధ్యానం చేస్తున్న సమంత… ఆధ్యాత్మిక బాటలో నటి!

Samantha: నటి సమంత తన ఆరోగ్యం పై దృష్టి పెట్టి ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఈమె సినిమాలపై ఫోకస్ చేస్తూ వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి తరుణంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. ఇలా ఈ వ్యాధి బారిన పడిన ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి చికిత్స తీసుకున్నారు.

ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోని సమంత సినిమాలకు ఏడాది పాటు విరామం ఇచ్చేసి పూర్తిగా తన ఆరోగ్యం పైనే దృష్టి పెట్టారు.ఈ విధంగా సినిమాలకు దూరమైనటువంటి ఈమె ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సినిమాలకు దూరమైనటువంటి సమంత సద్గురు ఇషా సెంటర్లో ప్రత్యక్షమయ్యారు.

ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈమె మెడిటేషన్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే సమంత ఈ ఫోటోలను షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Samantha: చాలా ప్రశాంతంగా మారింది..


కొంతసేపటి వరకు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ కదలికలు లేకుండా కూర్చోవడం చాలా కష్టం అనుకున్నాను. కానీ అయితే ఈరోజు ధ్యానస్థితి నాలో శక్తికి అత్యంత శక్తివంతమైన మూలంగా ప్రశాంతంగా మారిందని ఈ ప్రక్రియ ఇలా సింపుల్గా శక్తివంతంగా ఉంటుందని తాను అనుకోలేదు అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.