Balakrishna: ‘సమరసింహారెడ్డి వెల్ కమ్స్ అర్జున్ రెడ్డి’.. టాక్ షోలో సందడే సందడి..!

Balakrishna: నందమూరి బాలకృష్ణ వెండితెరపైనే కాకుండా స్మాల్ స్క్రీన్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఈ షోకు వచ్చిన విషయం తెలిసిందే.

షోలకు, సినిమాలకు రేటింగ్ ఇచ్చే.. ఐఎండీబీ వెబ్ సైట్ లో ఈ షో టాప్ 10 లో స్థానం సంపాదించడం విశేషం. మొదటి షోలో మోహన్ బాబు, మంచు లక్ష్మి సందడి చేశారు. తర్వాత నానీ, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, పుష్ప టీం, అఖండ టీం, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా వచ్చి అలరించారు.

Balakrishna: అర్జున్ రెడ్డికి సమరసింహారెడ్డి వెల్ కమ్..! టాక్ షోలో సందడే సందడి..!

తాజాగా మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండలతో కూడిన లైగర్ మూవీ యూనిట్ నందమూరి బాలయ్యతో అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్‌లుగా వచ్చారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ మొత్తాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న స్ట్రీమింగ్ కానుంది.

నటుడిగానే కాకుండా ఇలా టక్ షోలో..

ఈ షోకి సంబంధించిన స్పెషల్ ప్రోమోను షో మేకర్స్ రివీల్ చేశారు. వీడియోలో, లైగర్ చిత్ర యూనిట్ తమ సినిమా అనుభవాలను పంచుకోవడం అందులో కనిపించింది. షో ప్రోమోలో విజయ్ దేవరకొండ తన బాక్సింగ్ నైపుణ్యాలను కూడా ప్రదర్శించాడు. అర్జున్ రెడ్డికి వెల్ కమ్ చెబుతున్న సమరసింహారెడ్డి అంటూ బాలయ్య అలరించాడు. షోకి రావడమే.. బాక్సింగ్ చేస్తూ బాలయ్య, విజయ్ దేవరకొండ కాసేపు ప్రేక్షకులను నవ్వులతో పూయించాడు. నటుడిగానే కాకుండా ఇలా టక్ షోలో అతడు హోస్ట్ గా మారిన బాలకృష్ణతో అతని కార్యకలాపాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే.. ఇది పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.