Samyuktha Menon: విరూపాక్ష నిర్మాతలపై మండిపడిన సంయుక్త… క్షమాపణలు చెప్పిన మేకర్స్!

Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడిగా నటించిన ఈ అమ్మడు ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత బింబిసారా సినిమా ద్వారా మంచి హిట్ అందుకుంది. ఇక ఇటీవల ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమా ద్వారా హీరోయిన్గా మారి టాలీవుడ్లో ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉంది.

ఈ క్రమంలో టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ మీద సంయుక్త నిప్పులు చెరిగింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో సంయుక్త మీనన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఈ మేరకు సంయుక్త ట్వీట్ చేస్తూ..” నా నిరాశను తెలిపే ముందు ఒక విషయం చెప్పాలి. విరూపాక్ష టీమ్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని అద్భుతమైన నటీనటులతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరితో కలిసి చేసిన ఈ ప్రయాణం నాకు ఎప్పటికీ మధుర క్షణాలుగా మిగిలిపోతాయి. కానీ ఎస్వీసీసీ నిర్మాణ సంస్థ వారు .నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఈ ఉగాదికి నా పోస్టర్ రిలీజ్ చేస్తామని మాట ఇచ్చారు. నా పోస్టర్ ఎక్కడ? ఇచ్చిన మాట ఎందుకు తప్పారు అంటూ నిలదీసింది.

Samyuktha Menon: క్షమాపణలు చెప్పిన నిర్మాతలు…

ఇలా సోషల్ మీడియా వేదికగా సదరు నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ తనకు జరిగిన అన్యాయం గురించి నిలదీసింది. దీంతో సంయుక్త చేసిన ట్వీట్ పై సదరు నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ మేరకు ఆమెను క్షమాపణలు కోరింది. అంతే కాకుండా వారి తప్పును సరిదిద్దుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని సంయుక్తని కోరింది. దీంతో కొంచం శాంతించిన సంయుక్త సరే ఎదురుచూస్తుంటాను అంటూ సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా సదరు నిర్మాణ సంస్థ మీద సంయుక్త మీనన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.