Senior Journalist Imandhi Ramarao : లోకేష్, చంద్రబాబు, పవన్ కష్టం అంత నేలపాలు… జగన్ వ్యూహనికి బలైన ముగ్గురు….: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : ఏపీ రాజకీయాల్లో ప్రతి పక్ష నేతలు ఏమి విమర్శించిన తన మంత్రులు, నేతల చేత రివర్స్ కౌంటర్ వేయిస్తున్న జగన్ ప్రతిపక్షాల యాత్రలను సక్సెస్ కాకుండా జాగ్రతగా ప్లాన్ చేశారంటు ఇమంది అభిప్రాయపడ్డారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ యువగళం పేరుతో యాత్ర చేపట్టగా వైసీపీ నేతలు కావాలనే ఆ యాత్ర మీద సైలెంట్ అయి పబ్లిసిటీ రాకుండా చేసారు. ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లో రెచ్చగొట్టి సక్సెస్ అయ్యారు. ఇక చంద్రబాబు యాత్రలో దాడి చేయించి ఫోకస్ అంత మార్చేశారు. ఇలా తన వ్యూహలతో ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేసారు జగన్.

జగన్ ను తిడితే సానుభూతి ఆయనకే….

ఇక ఈ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ చంద్రబాబు లాంటి నాయకుడు జగన్ ను తిట్టడం మాని ఆయన ఉండుంటే రాష్ట్రం ఇపుడు ఎలా ఉండేది వంటి విషయాలను ప్రజలలోకి తీసుకెళ్తే బాగుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ తనకు అవకాశం ఇస్తే ఎం చేస్తాను వంటి విషయాలను చెప్పకుండా జగన్ మీద ఎదురు దాడికి దిగడం వల్ల జగన్ మీద జనాలకు సానుభూతి వస్తుంది అంటూ ఇమంది గారు అభిప్రాయా పడ్డారు.

ఇక లోకేష్ తనని తాను నాయకుడిగా ప్రజలకు పరిచయం చేసుకోడానికి యాత్ర ఉపయోగపడింది. కాని ఈ ముగ్గురు వారి యాత్రలలో జగన్ ను ఎక్కువగా విమర్శిస్తే జనాలలో జగన్ చేస్తున్న తప్పుల కంటే అందరూ జగన్ ను టార్గెట్ చేశారనే భావన ఏర్పడి సానుభూతి వస్తుంది అది చూసుకోవాలి అంటూ అభిప్రాయాపడ్డారు.