బాలయ్యతో వద్దు బాబోయ్.. షాకిచ్చిన శృతిహాసన్!

బాలయ్య బాబు సినిమా అంటే నటించడానికి చాలామంది హీరోయిన్స్ ధైర్యం చేసి ముందుకు రారు. ఈ క్రమంలోని బాలయ్య సినిమాలలో హీరోయిన్స్ వెతకాలంటే దర్శకనిర్మాతలకు కత్తిమీద సాము వంటిదని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన నటించడం కోసం శృతి హాసన్ ని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. బాలయ్య సరసన అనగానే శృతిహాసన్ మొదట్లో నో చెప్పినట్లు తెలుస్తోంది. కానీ బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో శృతి హాసన్ నటించబోతోందని తాజా సమాచారం.

గోపీచంద్ దర్శకత్వంలో శృతిహాసన్, రవితేజ హీరోగా తెరకెక్కిన “బలుపు” సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే దర్శకుడు శృతి హాసన్ ని సంప్రదించడంతో ఈ సినిమాలో నటించడం కోసం ఒప్పుకోక తప్పలేదు. అయితే ఈసినిమాలో లీడ్ పెయిర్ గా కాకుండా, మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ సీనియర్ హీరో కావడం చేత ఆయన పక్కన నటించడానికి ఈ తరం హీరోయిన్లు కాస్త వెనుకడుగు వేస్తారు. అది కాకుండా శృతి హాసన్ ప్రస్తుతం “సలార్” సినిమాతో బిజీగా ఉండటం చేత ఈ సినిమాకి మొదట్లో నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో గోపిచంద్ బాలకృష్ణ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న “అఖండ” సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ గోపీచంద్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.