సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు సింగర్ చిన్మయి. మహిళలపై జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే వ్యాఖ్యలు పలు వివాదాలకు కారణమవుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు దారుణంగా ట్రోలింగ్ కి గురవుతుంది. ఇండస్ట్రీలో మహిళలపై జరిగే కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం ఏ స్థాయిలో వివాదం సృష్టించిందో మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సింగర్ లక్నో గర్ల్ ఘటన మీద స్పందించారు.
గత మూడు రోజుల నుంచి నడిరోడ్లో ఒక అమ్మాయి క్యాబ్ డ్రైవర్ ని పట్టుకొని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే నడిరోడ్డు పై జరుగుతున్న ఈ ఘటనను అక్కడ ఉన్నటువంటి వారు, ట్రాఫిక్ పోలీస్ చూసి చూడనట్టు వదిలేశారు.ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సదరు యువతి ధైర్యసాహసాలను ప్రశంసిస్తుంటే మరి కొందరు ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇకపై ఈ వీడియోపై సింగర్ చిన్మయి స్పందించారు. అలా ఎవరి మీద ఎవరు దాడి చేసిన అది తప్పేనని.. ప్రస్తుతం ఆ అమ్మాయి కూడా తప్పు చేసిందని చిన్మయి చెప్పడంతో ఆమె చేసిన పోస్ట్ పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ తో తనని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయికి అబ్బాయికి వస్తున్న మద్దతు గురించి కూడా వివరించారు. గతంలో జొమాటో డెలివరీ బాయ్ కేసులో అందరూ అమ్మాయి నిందించారు. కానీ ఇప్పుడు అబ్బాయి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు.
అదేవిధంగా మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినటువంటి ఫన్ బకెట్ భార్గవ్ అరెస్టయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం అతను ఎంతో దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఇక ఈ లక్నో ఘటనలో కూడా ఎక్కువగా అబ్బాయికి మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో ఆ అబ్బాయి తన ఉద్యోగాన్ని కోల్పోలేదు కదా.. అంటూ చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేయడంతో.. కొందరు ఆమె కామెంట్స్ పై అసభ్యకర పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…