Shivaji: పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయడానికి అదే ప్రధాన కారణం.. శివాజీ కామెంట్స్ వైరల్!

Shivaji: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్లు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారిలో శివాజీ పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ కూడా ఒకే టీం గా ఉండి గేమ్ ఆడటమే కాకుండా చివరి వరకు కూడా శివాజీ పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తూ వచ్చారు.

ఇక శివాజీ ఏది చెబితే పల్లవి ప్రశాంత్ శిరసా వహించేవారు ఇలా తన శిష్యుడిగా పల్లవి ప్రశాంత్ కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడంతో శివాజీ తనకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తాను ప్రశాంత్ ను సపోర్ట్ చేయడానికి గల కారణాలను తెలియజేశారు. పల్లవి ప్రశాంత్ చాలా అమాయకుడు తనకు మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న డబ్బులు ఎలా సంపాదించాలి అనే విషయాలను కూడా తనకు తెలియదని తెలిపారు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేనే నా ఇంట్లో తన సోషల్ మీడియాలను మానిటైజ్ చేసి ఇచ్చానని తెలిపారు.

లక్షలు సంపాదించేవాడు…

ఇక అందరూ కూడా పల్లవి ప్రశాంత్ కు రెండు ఫేస్ లు ఉన్నాయని ఒక్కరి దగ్గర ఒక్కోలా ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాడికి అన్ని తెలివితేటలే ఉంటే తన ఫాలోవర్స్ తో లక్షలు సంపాదించుకునే వాడు. కానీ వాడు ఆ పని చేయలేదు. అసలైన కామన్‌మెన్ అంటే వాడేనని తనని చూస్తే చాలా నిజాయితీపరుడు అనిపించింది అందుకే తనని సపోర్ట్ చేశాను అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.