రన్నర్ గా శ్రీరామచంద్ర..! విన్నర్ గా సన్నీ..? వార్తలో నిజమెంత..?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. 19 మంది ఎన్నో ఆశలతో బిగ్బాస్ లోకి అడుగుపెట్టగా.. చివరకు 5గురు మిగిలారు. దీనిలో నుంచి ఇప్పటికే సిరి, మానస్ బయటకు వచ్చారనే సమాచారం తెలుస్తోంది. ఇక మిగిలిన ముగ్గురు సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర మధ్య టైటిల్ పోరు నడవనుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా షణ్ముఖ్ టైటిల్ ఫేవరేట్ గా పేరు తెచ్చుకున్నాడు. నాలుగు వారాల తర్వాత .. సమీకరణాలు అన్నీ తారుమారు అయ్యాయి. ఒక్కసారిగా సన్నీ మొదటి స్థానంలోకి దూసుకొచ్చాడు. ఎవరి అంచనాలకు అందకుండా.. ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. ఈ సీజన్ విన్నర్ సన్నీ అనేది కూడా మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది.

ఇక హౌస్ లో ఉన్న శ్రీరామచంద్ర విషయానికి వస్తే.. తెలుగులో తన పాపులారిటీని పెంచుకోవాడానికి హౌస్ లోకి అడుగుపెట్టారు. అతడు అనుకున్నట్లుగానే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. విన్నర్ గా సన్నీని అనౌన్స్ చేయగా.. రన్నర్ గా శ్రీరామచంద్ర ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఈ సారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు రూ.50 లక్షల ప్రూజ్ మనీ తో పాటు ఒక బైక్ ను మరియు రూ.25 లక్షలు విలువచేసే ఓ ప్లాట్ ను కూడా ఇవ్వనున్నట్లు తెలిసిందే. ఫైనల్ లో మిగిలిన వీళ్ల ముగ్గరికి మనీ ఆఫర్ చేస్తాడనేది కూడా వార్తలు వస్తున్నాయి.