Sri Reddy: హీరో అభిరామ్ ను పచ్చి బూతులు తిడుతూ ఫైర్ అయిన శ్రీ రెడ్డి?

Sri Reddy: కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటూ మీటు ఉద్యమం ద్వారా సెన్సేషనల్ గా మారినటువంటి వారిలో నటి శ్రీరెడ్డి ఒకరు. ఇలా ఈమె అప్పట్లో సంచలనంగా మారిపోయారు. ఈ గొడవ కారణంగా తనని తెలుగు చిత్ర పరిశ్రమ బ్యాన్ చేయడంతో ప్రస్తుతం ఈమె చెన్నైలో ఉంటున్నారు. అయితే తాజాగా ఈమె హీరో అభిరామ్ నటించిన అహింస సినిమాపై ఫైర్ అయ్యారు.

దగ్గుబాటి వారసుడు అభిరామ్ గతంలో శ్రీ రెడ్డి ఇద్దరు ప్రేమలు మునిగితేలారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అభిరామ్ తన జీవితాన్ని నాశనం చేశారు అంటూ శ్రీరెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన జీవితాన్ని అభిరామ్ నాశనం చేయడంతో తనపై ఎంతో కోపంతో ఉన్నటువంటి శ్రీ రెడ్డి తాజాగా అహింస సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఫైర్ అయ్యారు.

అహింస సినిమాలో శ్రీ రెడ్డి పేరును కూడా ప్రస్తావనకు తీసుకు రావడంతో ఈ విషయంపై ఈమె డైరెక్టర్ తేజ పై కూడా మండిపడ్డారు.చెప్పడానికి కూడా వీలు లేనటువంటి పచ్చి బూతులతో వీరిద్దరిని తిట్టారు. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ పై కూడా ఈమె విమర్శలు చేశారు. డైరెక్టర్ తేజని ఉద్దేశిస్తూ ఈమె ఫైర్ అయ్యారు.

Sri Reddy: చెప్పుతో కొట్టాల్సింది పోయి సినిమా చేస్తావా….

నా జీవితాన్ని నాశనం చేసిన వాడిని చెప్పుతో కొట్టకుండా వాడితోనే సినిమా చేస్తావా అంటూ తేజ అని కూడా విమర్శించారు. శ్రీ రెడ్డి తేజని తిట్టడం ఇది మొదటిసారి కాదు గతంలో సీత సినిమా సమయంలో కూడా శ్రీ రెడ్డి తేజ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అయితే తాజాగా మరోసారి అభిరామ్ గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా తనపై తీవ్రస్థాయిలో మండిపడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.