Movie News

Chiranjeevi: నాకు క్యాన్సర్ రాలేదు తప్పుగా అర్థం చేసుకున్నారు… క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్యాన్సర్ బారిన పడ్డారా అంటూ పలు వెబ్ సైట్లలో ఓ వార్త సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే. ఇలా చిరంజీవి క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారంటూ వార్త వైరల్ గా మారింది. అయితేఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ వార్తలను ఖండించారు.

హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడాలోని స్టార్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్యాన్సర్‌ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి గతంలో తాను చేయించుకున్న ముందస్తు పరీక్షల వల్ల క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు. అయితే కొందరు ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఈయన క్యాన్సర్ బారిన పడ్డారంటూ వార్తలు రాశారు.

చిరంజీవి ఆరోగ్యం గురించి ఈ విధమైనటువంటి వార్తలు వచ్చిన తరుణంలో ఈయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.నేను కేవలం క్యాన్సర్ పట్ల అవగాహన ఉండాలని తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉండవని చెప్పాను. గతంలో నేను కొలనోస్కోపీ టెస్ట్‌ చేయించుకున్నాను. అందులో క్యాన్సర్‌ రహిత పాలిప్స్‌ని గుర్తించి తొలగించారు. ఒకవేళ ముందుగా పరీక్ష చేయించుకోకుండా ఉంటే అది క్యాన్సర్‌ కింద మారేదేమో అని చెప్పాను.

Chiranjeevi: అర్థం లేని వార్తలు రాయకండి…


ఈ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకొని తాను క్యాన్సర్ బారిన పడ్డానని చికిత్స చేయించుకొని కోలుకున్నాను అంటూ వార్తలు రాయడంతో తన శ్రేయోభిలాషులు సన్నిహితులు తన ఆరోగ్యం గురించి ప్రశ్నిస్తూ తనకు మెసేజ్ చేస్తున్నారని చిరంజీవి వెల్లడించారు. దయచేసి ఇలాంటి వార్తలను రాయకండి ఇలాంటి వార్తల వల్ల ఇతరులను బాధపెట్టిన వారు అవుతారు అంటూ ఈ సందర్భంగా చిరంజీవి వార్తలను పూర్తిగా ఖండించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

5 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

5 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

5 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

5 hours ago

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…

6 hours ago

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…

7 hours ago