Anupama Parameswaran: ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. భావోద్వేగాలను వ్యక్తపరిచే సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయనే ప్రశ్న తనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు అనుపమ సమాధానం చెబుతూ.. భావోద్వేగాలను వ్యక్తపరిచే విషయంలో తాను చాలా నిజాయితీగా ఉంటానని తెలిపారు.
ఏ విషయంలో అయినా నాకు నచ్చకపోతే ఆ విషయాన్ని మొహం మీదే చెప్పేస్తాను. ఇక ఆ విషయాన్ని తన మైండ్లో ఉంచుకోనని అక్కడితో ఆ విషయాన్ని కూడా వదిలేస్తానని తెలిపారు.మనం గడుపుతున్న ఈ జీవితం చాలా చిన్నది కొద్దిరోజులు ఇక్కడకు వచ్చి మనకు నచ్చిన విధంగా ప్రవర్తించి తిరిగి వెళ్ళిపోతాము కాని ఆరోజు ఎప్పుడు వస్తుందనేది మాత్రం ఎవరికీ తెలియదని తెలిపారు.
మనం బ్రతికున్న ఈ కొద్ది రోజులైనా ఆ ఒత్తిడిని దాచుకోవడానికి ఎందుకు అనవసరంగా శక్తిని వృధా చేయడం అంటూ తిరిగి ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ లో నెల తర్వాత అందులో రికార్డు అయినటువంటి విషయాలన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. అలాగే నా మైండ్ లో కూడా చెత్తను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా అనుపమ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…