Anupama Parameswaran: ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. భావోద్వేగాలను వ్యక్తపరిచే సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయనే ప్రశ్న తనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు అనుపమ సమాధానం చెబుతూ.. భావోద్వేగాలను వ్యక్తపరిచే విషయంలో తాను చాలా నిజాయితీగా ఉంటానని తెలిపారు.
ఏ విషయంలో అయినా నాకు నచ్చకపోతే ఆ విషయాన్ని మొహం మీదే చెప్పేస్తాను. ఇక ఆ విషయాన్ని తన మైండ్లో ఉంచుకోనని అక్కడితో ఆ విషయాన్ని కూడా వదిలేస్తానని తెలిపారు.మనం గడుపుతున్న ఈ జీవితం చాలా చిన్నది కొద్దిరోజులు ఇక్కడకు వచ్చి మనకు నచ్చిన విధంగా ప్రవర్తించి తిరిగి వెళ్ళిపోతాము కాని ఆరోజు ఎప్పుడు వస్తుందనేది మాత్రం ఎవరికీ తెలియదని తెలిపారు.
మనం బ్రతికున్న ఈ కొద్ది రోజులైనా ఆ ఒత్తిడిని దాచుకోవడానికి ఎందుకు అనవసరంగా శక్తిని వృధా చేయడం అంటూ తిరిగి ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ లో నెల తర్వాత అందులో రికార్డు అయినటువంటి విషయాలన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. అలాగే నా మైండ్ లో కూడా చెత్తను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా అనుపమ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…