Fida Movie: జయంత్ సి పరాన్జీ ప్రేమించుకుందాం రా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈయన తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్ మార్ సినిమాకి చివరిగా దర్శకత్వం వహించారు.
ఈ సినిమా తర్వాత చాలా కాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు.శేఖర్ కమ్ముల ఫిదా స్టోరీ మహేష్ బాబు ని దృష్టిలో పెట్టుకొని రాసారని అయితే ఈ స్టోరీ నాకు చెప్పగా చాలా నచ్చడంతో ఈ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేయగా దీపికా పదుకొనేని హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావించాము. ఈ కథ విన్నటువంటి మహేష్ బాబు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారని వెంటనే సినిమా చేయాలని కూడా భావించాము. కానీ మహేష్ వంటి స్టార్ హీరో నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి.
ఈ క్రమంలోనే ఫిదా సినిమా ద్వారా ఆ అంచనాలను చేరుకోలేమన్న ఉద్దేశంతో ఈ ఆలోచనని విరమించుకున్నామని తెలిపారు. ఇలా మహేష్ బాబు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో వరుణ్ తేజ్ సాయి పల్లవి ఇద్దరు కూడా ఫిదా సినిమాలో నటించారని ఈ సందర్భంగా డైరెక్టర్ జయంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…