Shakeela: సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఓ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నటువంటి వారిలో నటి షకీలా ఒకరు.షకీలా ఏ సినిమాలో అయినా నటించింది అంటే కేవలం ఆమెను చూడటం కోసమే ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వెళ్లేవారు. ఇక షకీలా ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా వేసుకునేవారు.
ఈ విధంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతల సంపాదించుకొని అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ ఇండస్ట్రీలో వెలుగు వెలిగినటువంటి షకీలాకు ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఏదో బుల్లితెర కార్యక్రమాలలోను రియాలిటీ షో లలోను నటిస్తూ సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పూటగడపకోవడం కోసం ఈమె ఎన్నో కష్టాలు పడుతున్నారు.
ఇకపోతే చాలామంది ఈమె గురించి మాట్లాడుతూ షకీల చాలా లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని ఆమె బిఎండబ్ల్యూ కార్లలో తిరుగుతూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు అంటూ వార్తలు సృష్టించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఈ వార్తలపై స్పందించి వీటిని ఖండించారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ…
తాను బీఎండబ్ల్యూ కార్లలో తిరుగుతున్నానని చాలామంది భావిస్తున్నారు. నిజానికి తాను ఉండటానికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో అద్దె ఇంట్లో నివసిస్తున్నానని తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో తాను ఒకప్పుడు రోజుకు నాలుగు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుని బాగా సంపాదించాను. అయితే ఇన్కమ్ టాక్స్ రైడ్ జరుగుతుందన్న ఉద్దేశంతో తన సోదరి ఆస్తులన్నీ తన పేరు మీదట రాయించుకొని తనని దారుణంగా మోసం చేసిందని అందుకే ఇప్పుడు తాను అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…
ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నప్పటికీ, Tuberculosis ఇంకా ప్రధాన ప్రజారోగ్య సమస్యగానే కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు,…
హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…