Sri Reddy: వాడొక విషపురుగు.. చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి !

Sri Reddy: వివాదాస్పద నటి శ్రీరెడ్డి తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలా ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున తన అభిప్రాయాలను తెలియజేస్తూ వివాదాలను సృష్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో శ్రీ రెడ్డి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె పవన్ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చిరంజీవి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఈయన ముఖ్యఅతిథిగా పాల్గొనడమే కాకుండా రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.రాజకీయాలలో కొనసాగాలంటే ఎంతో కటువుగా ఉండాలని ఎలాంటి మాటలు అన్నా పడాల్సి ఉంటుందని ఈయన తెలిపారు.

ఇంకోసారి విషపురుగును పక్కకు రానివ్వకు..

అందుకే తాను రాజకీయాలకు దూరమయ్యానని పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరినైనా అంటారు ఎవరితోనైనా పడతారు. ఎప్పటికైనా తనని సీఎంగా చూడాలన్నదే నా కోరిక అంటూ ఈయన మనసులో మాట బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ జగన్ తో కలిసి చిరంజీవి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… ఈ పక్కన ఉన్నాడే దొంగ బాడ్కవని ఎప్పుడో చెప్పాను విన్నారా జగనన్న.. వీడు తొందరపడి ముందే కూశాడు.. ఫ్యూచర్ తెలియక శృతి కూడా మార్చాడు. ఈ ఎదవ పీకే గాడు సీఎం అవుతాడట. ఇంకోసారి ఈ విషపు పురుగును నీ పక్కన రానీయకు ఇట్స్ మై ఆర్డర్ అనే అర్హత నాకు లేదు కానీ ఇది ఆర్డర్ అంటూ రాసుకొచ్చారు.ప్రస్తుతం శ్రీరెడ్డి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.