Rajamouli: మరో అరుదైన గౌరవం అందుకున్న రాజమౌళి దంపతులు.. ఆస్కార్ నుంచి ఆహ్వానం!

Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్ గా సక్సెస్ అయినటువంటి ఈయన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం.

ఇలా ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇలా ఇప్పటివరకు ఆస్కార్ అవార్డు కోసం ఎంతో కష్టపడినా రాజమౌళి ఇకపై ఆస్కార్ ఇవ్వడాన్ని కూడా డిసైడ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో ఎంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయనకు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. ఆస్కార్ అకాడమీలో మెంబర్ గా ఈయనకు చోటు కల్పించింది అయితే రాజమౌళికి మాత్రమే కాకుండా ఆయన సతీమణి రమ రాజమౌళికి సైతం ఆస్కార్ మెంబర్ గా అవకాశం ఇవ్వటం గవనార్హం.

ఆస్కార్ అకాడమీ మెంబర్..
2025లో ప్రకటించబోయే ఆస్కార్ అవార్డులలో భాగంగా వీరు కూడా తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. ఇలా ఆస్కార్ అకాడమీ నుంచి రాజమౌళి దంపతులకు ఈ విధమైనటువంటి అవకాశం రావడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.