Subba Raju: ఆ కేసు వల్ల అందరూ నా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టారు… షాకింగ్ కామెంట్స్ చేసిన సుబ్బరాజు!

Subba Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి గుర్తింపు పొందారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన వారిలో నటుడు సుబ్బరాజు కూడా ఒకరు. ఖడ్గం సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుబ్బరాజు ఆ తర్వాత పోకిరి, ఖలేజా, దేశముదురు, మిర్చి వంటి ఎన్నో సినిమాలలో పాజిటివ్ నెగిటివ్ పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందాడు.

ఇలా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన సుబ్బరాజు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుబ్బరాజు తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నా మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని యాంకర్ ప్రశ్నించగా…సుబ్బరాజు మాట్లాడుతూ..” తనకి పెళ్లి చేసుకోవలసిన అవసరం రాలేదని అందువల్ల ఇప్పటికే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానని చెప్పుకొచ్చాడు.

ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ తన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని సైకిల్ స్పీడ్ గా తొక్కినా కూడా ఎందుకు అంత స్పీడ్ గా తొక్కావని ప్రశ్నించేవాడని, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అని అడిగేవాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకి మొహమాటం ఎక్కువని, అందుకే అవకాశాల కోసం డైరెక్టర్స్ ని అడగలేను అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తన వల్ల తన తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ కేసులో పలుమార్లు విచారణకు హాజరైన సంగతి అందరికీ తెలిసిందే.

Subba Raju: డ్రగ్స్ కేసు వల్ల ఇబ్బందులు పడ్డాను…

ఈ కేసు గురించి మాట్లాడుతూ… డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పుడు తాను ఇబ్బందులకు గురయ్యానని తెలిపాడు. సమాజంలో నా పరువు పోతుందన్న బాధ కన్నా ఈ విషయం వల్ల తన తల్లితండ్రులు చాలా ఇబ్బంది పడతారనే బాధ తనకు ఎక్కువగా ఉండేదని తెలిపారు.ఈ కేసు విషయం తెలిసిన తర్వాత చాలామంది మా ఇంటికి వచ్చి మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఉన్నారట కదా అంటూ తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వారిని సుబ్బరాజు వెల్లడించాడు.