Surrogacy : అద్దె గర్భంతో పిల్లల్ని కన్న సినీ సెలబ్రిటీలు ఎవరో తెలుసా..!

Surrogacy : మాతృత్వం ఒక వరం, అలాంటి మాతృత్వం కోసం పరితపించే వారు ఎందరో. అలాంటి వారు ఇప్పుడున్న అడ్వాన్స్‌డ్ వైద్యంతో పిల్లలిని కంటున్నారు. కానీ అలా కూడా కనలేని వారికోసం వచ్చిందే అద్దెగర్భం లేదా సరోగసీ. వయసు ఎక్కువవడం, ఆరోగ్య కారణాలు, తదితర కారణాల రీత్యా చాలా మంది సరోగసీ ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఇక ఆరోగ్య సమస్యలు పక్కన పెడితే చాలా మంది సెలబ్రిటీలు వాళ్ల కెరీర్ రీత్యా, ఇతర కారణాల చేత సరోగసీ వైపు మొగ్గుచూపుతున్నారు ఇలాంటి వారిలో బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది.

ఇక బాలీవుడ్ బడా డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సింగిల్ ఫాదర్ గా 2017లో సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. రూహి జోహార్, యష్ జోహార్ ల ఆలనపాలన కరణ్ జోహార్ తల్లి చూసుకుంటున్నారు. ఇక ప్రీతీజింటా కూడా తన అమెరికన్ బాయ్ ఫ్రెండ్ని వివాహం చేసుకుని సరోగసీ ద్వారా జై, గియా అనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ఇక శిల్ప శెట్టి కూడా తన రెండవ బిడ్డ సమీష కు సరోగసీ ద్వారా జన్మనిచ్చింది. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన మూడో సంతానం కోసం సరోగసీ ఆశ్రయించారు. గౌరి ఖాన్ కు 40 ఏళ్ళు పై బడటంతో ఆరోగ్య రీత్యా గర్భందాల్చడం మంచిది కాదని సరోగసీ ద్వారా అబ్రహం ఖాన్ కు జన్మనిచ్చారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా తన రెండవ భార్య కిరణ్ రావు కు గర్భాశయములో సమస్యల వల్ల సరోగసీ ద్వారా మగబిడ్డ అజాద్ కు జన్మనిచ్చారు.

బాలీవుడ్ బడా సీరియల్ ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ తన IUI, IVF వంటి సంతానానికి సంబంధించిన ట్రీట్‌మెంట్స్ విఫలమయ్యాక సరోగసీ ద్వారా మగబిడ్డకు తల్లయింది. ఇక శృంగార తార సన్నీ లియోన్ కూడా తన కవల పిల్లలను సరోగసీ ద్వారా జన్మనిచ్చారు.

ఇక హాలీవుడ్ లో సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లు తమ బిడ్డను సరోగసీ ద్వారా కన్నారు. ఈ విషయాన్ని ఇటీవలే ప్రియాంక ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పింది. ఇక టాలీవుడ్ లోనూ మంచు లక్ష్మి సరోగసీ ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది. గుజరాత్ కు చెందిన మహిళలు ద్వారా అద్దె గర్భంలో తన బిడ్డకు తల్లయింది.