Tag Archives: acharya

ఆచార్య నుంచి అదిరిపోయే అప్డేట్.. నవంబర్ 5 న రానున్న నీలాంబరి సాంగ్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ఆచార్య .దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. దసరాకి అయినా విడుదల అవుతుంది అనుకుంటే సంక్రాంతికి వాయిదా వేశారు.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలు లేకపోవడంతో చిత్ర యూనిట్‌ ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్స్ కు భారీగానే స్పందన వచ్చింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను పూర్తిచేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించారు.

ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ ను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నీలాంబరి అనే పాటను నవంబర్‌ 5 వ తేదీన ఉదయం 11.07 నిముషాలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ఇక ఈ అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ మూవీ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

అచార్య సినిమాకు ఊహించని ధర.. రికార్డ్ ధరకు డబ్బింగ్ రైట్స్!

తెలుగు స్టార్ హీరోల సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. పాన్ ఇండియా సినిమాలే రేట్‌లో రైట్స్ దక్కించుకుంటున్నాయి. డబ్బింగ్ రైట్స్ కోసం ఉత్తరాది నిర్మాతలు భారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ సినిమా అచార్య కోసం ఏకంగా రూ.26 కోట్లు చెల్లించి డబ్బింగ్ హక్కులు దక్కించుకున్నారు. తెలుగులో డబ్బింగ్ రైట్స్ ధరలలో ఆచార్య సినిమానే టాప్ లో నిలిచింది.

అచార్య పినిమా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ – పూజ హెగ్డే కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా దక్షణాది బాషలలోనే కాకుండా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా హింది డబ్బింగ్ రైట్స్‌ను రూ.26 కోట్లకు పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ దక్కించుకున్నారు.

ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఆ పని తప్పనిసరి.. కాజల్ అగర్వాల్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చాలా మంది సెలబ్రెటీలు ఇళ్లకే పరిమితమయ్యారు.ఇలాంటి సమయంలోనే ఇంట్లో ఉంటూ మన పై కలిగే అధిక ఒత్తిడి మానసిక ఆందోళనలను ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియజేస్తూ నటి కాజల్ అగర్వాల్ ఓ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటూ,సృజనాత్మకంగా అనుభూతి చెందడం ఈ సమయంలో ఎంతో అవసరమని కాజల్ అగర్వాల్ ఈ పోస్టు ద్వారా తెలియజేశారు. కరోనా సమయంలోనే గత ఏడాది వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే తను కమిట్ అయిన సినిమాల షూటింగ్లో పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్న తరుణంలోనే కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది.

కరోనా వ్యాప్తి అధికమవడంతో చాలా మంది సెలబ్రిటీల షూటింగ్ లు వాయిదా పడి ఇంటికి పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉంటూ తను ఏవిధంగా కాలక్షేపం చేస్తుందనే విషయం పై కాజల్ అగర్వాల్ తెలియజేశారు.ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇంట్లో ఉంటూ ఏదో ఒక పని చేయడం ద్వారా మన పై కలిగే ఒత్తిడి ఆందోళనలు దూరమవుతాయని ఆమె తెలిపారు.

“నేను ఇటీవల అల్లికలు చేస్తున్నా. ఇది నాకు విశ్రాంతిని కలిగించడంతో పాటు మానసిక క్షేమాన్ని అందిస్తోంది. ఇతరుల కోసం ఏదైనా సృష్టించడం గొప్ప అనుభూతి”. మరి ఈ విరామ సమయంలో మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? అంటూ కాజల్ అగర్వాల్ తన అల్లికలకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘ఆచార్య’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా..??

కరోనా సెకండ్ వేవ్ వచ్చి మరోసారి సినిమా ఇండస్ట్రీని కోలుకోకుండా చేస్తోంది.తాజాగా కరోనా ఎఫెక్ట్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీపై కూడా పడింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు..చిరూ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది..

ప్రస్తుతం ఆచార్య మూవీ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ను నిరవధికంగా వాయిదా వేసినట్టు సమాచారం.. దేవాదాయ శాఖలోని అక్రమాలపై సంధించిన ఈ సినిమా విడుదల కరోనా కల్లోలంతో బ్రేక్ పడింది.కరోనా సెకండ్ వేవ్ దేశంలో రావడం.. వేల కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షలు విధించాయి.

దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.మొదటి ‘ఆచార్య’ మూవీని మే 14న రిలీజ్ చేయాలని చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ మధ్య కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. విలన్ గా నటిస్తున్న సోనూ సూద్ సైతం కరోనా బారినపడ్డారు. దీంతో సినిమా షూటింగ్ వాయిదా వేశారు.తాజాగా ఈ సినిమాను చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జూలై మధ్యలోనే విడుదల చేస్తారని కూడా తెలుస్తోంది.

మొత్తం మీద ఆచార్య మూవీ విడుదల కరోనా వేవ్ తగ్గడం మీదనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.కొణిదెల ప్రొడక్షన్.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లలో నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు..అందుకే ఏకంగా ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్..ఈఇక ఈ సినిమా తర్వాత మలయాళ మూవీ లూసిఫార్ రిమేక్ లో నటించనున్నాడు చిరు.. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రిమేక్ ని డైరెక్ట్ చేయనున్నాడు…!!

ముద్దులు, హగ్గులతో గాల్లో తేలిపోతున్న బుట్టబొమ్మ.. కారణం ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో పూజ హెగ్డే ఒకరు. పూజా హెగ్డే నటించిన సినిమాలు విజయవంతం కావడంతో ఈమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బుట్టబొమ్మ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది.హీరోయిన్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పూజాహెగ్డే రోజురోజుకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది.

పూజా హెగ్డే తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే ఈమెకు మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. కేవలం సోషల్ మీడియా పరంగా, సినిమాల పరంగా ఎవరి జోలికి వెళ్ళకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ గతంలో ఒకసారి హీరోయిన్ సమంత విషయంలో పూజా హెగ్డే చేసిన కామెంట్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

సమంత ఏమీ అంత క్యూట్ గా కనిపించడం లేదంటూ ఈమె కామెంట్ చేశారు. తరువాత తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిపారు. మొత్తానికి ఈ బుట్ట బొమ్మ చేసిన కామెంట్ సమంత అభిమానుల మధ్య పూజ అభిమానుల మధ్య చిన్న యుద్ధంలా మొదలైంది. అప్పటి నుంచి అభిమానులు సమంతకు, పూజా హెగ్డే కు మధ్య పోలికలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ విషయంలో కూడా ఇద్దరు ఒకే స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు.

తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 13 మిలియన్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే కూడా 13 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకోవడంతో ఆమె గాల్లో తేలిపోతున్నారు. తన అభిమానులకు, ఫాలోవర్ లకు ముద్దులు, హగ్గులు ఎమోజీ లను షేర్ చేస్తున్నారు. అదేవిధంగా అందరికీ థ్యాంక్స్ లవ్లీస్.. అంటూ ఓ క్యూట్ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే పూజా హెగ్డే అఖిల్” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, ప్రభాస్ “రాధేశ్యామ్”,”ఆచార్య”చిత్రాలలో చేస్తున్నారు.

మెగా అభిమానులకు శుభవార్త.. “ఆచార్య” బిగ్ అనౌన్స్మెంట్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల చిత్ర నిర్మాణం వాయిదా పడుతూ వస్తుంది.అయితే ప్రస్తుతం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న చిత్రబృందం ఈ సినిమాకి సంబంధించిన తాజా సమాచారం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం చిత్రబృందం ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేసింది.

ఆచార్య సినిమాకు సంబంధించిన టీజర్ జనవరి 29న సాయంత్రం విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియోని బుధవారం విడుదల చేశారు. ఈ విధంగా ఆచార్య టీజర్ విడుదల తేదీని ప్రకటించడంతో మెగా అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. తొందరలోనే చిత్ర నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేసింది.

దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఇక పోతే ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించనున్నాడు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, భారీ ఆలయ సెట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.