Tag Archives: Amitabh

RGV : అమితాబ్ బచ్చన్ అమ్మ చనిపోతే నేను వెళ్లి అందరి ముందు జోక్స్ చెప్పి నవ్వాను.. అప్పుడు అమితాబ్ రియాక్షన్ ఏంటంటే..?!

RGV : బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఎక్కడైనా ఆర్జీవి అనగానే వివాదాలతో బ్రతికే వాడని అంటారు. తనకంటే పబ్లిసిటీ గురు మరొకరు ఉండరని చెబుతారు. తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో ఆర్జీవి కి ఉన్న టాలెంట్ ఇంకెవరికీ లేదు. ఇక ఆయన తీసిన చాలా చిత్రాలు సాంకేతికంగా, కథ పరంగా, టేకింగ్ పరంగా సూపర్ గా ఉంటాయి. చాలా మంది దర్శకులకు సినిమాలు తీయడంలో గురువు. ఇక ఆయన ఏ విషయం చెప్పినా వింతగాను కొత్తగాను ఉంటాయి. చాలా మందికి నచ్చని విషయాలను ఈయన చాలా బోల్డ్ గా చెప్పేస్తారు.

అమితాబ్ బచ్చన్ అమ్మ చనిపోయినపుడు నేను వెళ్లి జోక్స్ చెప్తే ఆయన రియాక్షన్…..

నాకు చావంటే అసలు నచ్చదని, రోగాలు రావడం, చనిపోవడం వంటి విషయాలు నాకస్సలు నచ్చని విషయాలు అని చెప్పారు. మా నాన్న మరణించినపుడు కూడా నేను అంత్యక్రియ్యలకు ఎవరినీ రానివ్వలేదు అందరు వచ్చి ఏడ్చటం నాకు నచ్చదు. మ నాన్న ఫోటో కూడా నేను ఇంట్లో పెట్టనివ్వలేదు. ఎందుకంటే పోయిన వారిని తలచుకోవడం బాధపడటం నాకు నచ్చదని చెప్పారు. అలానే అమితాబ్ బచ్చన్ వాళ్ళ అమ్మ చనిపోయినపుడు అందరూ పరామర్శకు వెళ్లారు నేను వెళ్ళలేదు. ఆ సంఘటన తరువాత కొన్నిరోజులకు నేను అమితాబ్ బచ్చన్ గారి ఇంటికి వెళ్లి అక్కడున్న వాళ్ళకి జోక్స్ చెప్పాను కానీ ఆయనకు నా గురించి తెలుసు కాబట్టి మామూలుగా తీసుకున్నారు.

నేను ఎవరికీ ఇది చేయమని చెప్పను. వారికి నచ్చితే వాళ్లు చేయొచ్చు. డైరెక్టర్ తేజ నా గురించి ఒక మాట అంటాడు, గుర్రం మొహం చూడని వాడికి గుర్రపు స్వారీ నీకు వచ్చు గుర్రం ఎక్కు అని చెప్పగల టాలెంట్ ఉందని అంటాడు. దేవుళ్ళపై నమ్మకం లేదని, దయ్యాలంటే ఇష్టమని చెప్పారు. జీవితంలో ఒక సారి ఒక 20 సెకన్లు మాత్రం చాలా భయపడ్డానని చెప్పారు. ఇక ఎప్పుడు జీవితంలో భయపడలేదని చెప్పారు. తనని తాను ఒక రొమాంటిక్ యోగి అంటూ చెప్పుకున్నారు రామ్ గోపాల్ వర్మ.

అతనితో అనుభవాలు మరిచిపోలేను.. రష్మిక!

టాలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న రష్మిక మందన్న ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఛలో సినిమాతో తెలగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు గీతాగోవిందంతో ఆ మార్క్ ను సెట్ చేసుకుంది. అంతే కాకుండా అగ్రహీరోల సరసన నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. మహేశ్ బాబు సరసన ఈమె సరిలేరునీకెవ్వరులో నటించింది. తర్వాత ఇప్పుడు విడుదల రాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్పలో కూడా నటించింది.

దీనిలో గిరిజన మహిళగా నిటించింది. అయితే రష్మికకు టాలీవుడ్ లోనే కాక బాలివుడ్ లో కూడా అవకాశాలు వచ్చేస్తున్నాయి. ‘గుడ్ బై’ చిత్రంతో బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తోంది కన్నడ బ్యూటీ. తొలి చిత్రంలోనే బిగ్ బి లాంటి లెజెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది రష్మిక మందన్న. అయితే ఈ మధ్య ‘గుడ్ బై’ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. “అమితాబ్ తో నటించటం ఆనందంగా ఉంది. చాలా రోజుల పాటూ షూటింగ్ చేయటం వల్ల యాక్టర్స్ ఒకర్ని ఒకరు బాగా తెలుసుకోగలుగుతారు. మేమంతా అదే చేశాం.

అందువల్లే చక్కటి పర్ఫామెన్సెస్ వచ్చాయి. డైరెక్టర్, మిగతా వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ‘గుడ్ బై’ సినిమా ఒక క్రేజీ ఎక్స్ పీరియన్స్” అని చెప్పుకొచ్చింది. మొదటి రోజు అమితాబ్‌‌తో కలిసి పనిచేసిన అనుభవాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అమితాబ్‌‌‌తో కలిసి నటించడం జీవితంలో మరిచిపోలేనిది అంటుంది ఈ బ్యూటీ. ‘ముందు రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత దర్శకుడు వికాస్‌‌తో నెక్స్ట్ డే చేయాల్సిన సన్నివేశాల గురించి ఎక్స్‌‌‌ప్లైన్ చేయించుకుని వాటిని అమితాబచ్చన్‌‌‌తో ఎలా చేయాలా అనేది చర్చించి మరీ ప్రాక్టీస్ చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.

ఆయనతో నటించేటప్పుడు పాత్రలో లీనమైపోవడంతో పెద్దగా ఆందోళన పడలేదని అంటుంది. ఆయనతో కలిసి నటించడం పెద్ద కష్టమే కాదు అని చెప్పుకొచ్చింది ఈ లక్కీ బ్యూటీ. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గుడ్ బై’ మాత్రమే కాక సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్నూ’సినిమా కూడా చేస్తోంది ఈ భీష్మ బ్యూటీ.