Tag Archives: anee master

వారిపై నేను కూడా చర్యలు తీసుకుంటాను.. స్టార్ మా ఇవన్నీ ఆపేయండి ఇక.. యానీ మాస్టర్‌!

బిగ్‌బాస్‌ 5 తెలుగు రియాలిటీ షో ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. బుధవారం 102వ ఎపిసోడ్‌ పూర్తయింది. బిగ్‌బాస్‌ ఫినాలేకు ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్‌లో కేవలం ఐదురుగు మాత్రమే ఉన్నారు. సిరి, షణ్ముఖ్‌, మానస్‌, సన్నీ, శ్రీరాచంద్రలో ఒకరు ఈసారి టైటిల్‌ను కొట్టేందుకు సిద్ధమయ్యారు.

ఇక ఈ షో ముగింపు దశకు చేరకున్నా కొద్ది.. బయటకు వచ్చిన కంటెస్టెంట్లతో పాటు.. హౌజ్ లో ఉన్న వాళ్లను కూడ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. నెట్టింట్లో వీళ్లకు సంబంధించిన మీమ్స్, ట్రోలింగ్ తో ఆడేసుకుంటున్నారు. అందులో కొంతమంది డబ్బులు తీసుకొని మరీ.. పని కట్టుకొని చేస్తున్నారు. కావాలనే నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారు. కంటెస్టెంట్లను మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు.

అలా మొత్తానికి ఈ బిగ్ బాస్ ఐదో సీజన్‌లో జరిగిన ట్రోలింగ్, చేసిన నెగెటివ్ ప్రచారాలపై యాంకర్ రవి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అటువంటి ట్రోలింగ్ లకు, నెగెటివ్ కామెంట్ల ముగింపుకు ఇదే మొదలు అని సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశాడు రవి. తనమీద.. తన ఫ్యామిలీ మీద ట్రోలింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు రవి. ఎవరినైనా సరే ఇలా పరుష పదజాలంతో సోషల్ మీడియాతో దూషిస్తే సహించేది లేదని ఇకపై ఇలాంటివి రిపీట్ అవ్వొద్దనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని యాంకర్ తెలిపాడు.

రవి తీసుకున్న నిర్ణయంపై చాలామంది ప్రశంసిస్తున్నారు. యానీ మాస్టార్ అయితే.. యాంకర్ రవిని మంచి పని చేశావ్ తమ్ముడు అంటూ ప్రశంసించింది. తాను ఎంత జెన్యూన్ గా ఉన్నానో నీకు తెలుసు స్టార్ మా.. ఇక చేసిందంతా చాలు.. ఆపేయండి అంటూ ఫైర్ అయ్యారు మాస్టార్. ఇలాంటి బ్యాడ్ కామెంట్లు.. నెగెటివ్ ట్రోలింగ్ లు చేసేవారిపై తాను కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. హౌస్ లో 24 గంటలు సమయం ఉంటుంది.. అన్ని గంటలు ఏం జరుగుతుందో మీకు తెలియదు.. కేవలం ఒక గంట మాత్రమే చూసి.. తుది నిర్ణయానికి రావొద్దు.. ఇకనైనా ఇవన్నీ ఆపండి అంటూ హెచ్చరించింది.

అనీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఇదే..!

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సండే,ఫండే ఎపిసోడ్ అయిపోయింది. నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడడానికి అంటే ముందుగా టీ తాగి తమతో ఒకరోజు ఎలా గడుపుతారు అన్నది చెప్పాలి అన్న టాస్క్ ను ఇచ్చాడు నాగ్. ఇంటి సభ్యులు సండే పండే అని ఆనందపడేలోగా ఎలిమినేషన్ డే కూడా అంటూ నాగార్జున గుర్తు చేశారు. ఈ క్రమంలోనే పలు రకాల గేమ్ లను కూడా ఆడించారు.

ఇందులో ఇంటి సభ్యులు మిగతా వారిని అడగాలి అనుకున్న ప్రశ్నలను రాసి నాగార్జునకు ఇవ్వగా నాగార్జున ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మానస్ ప్రియాంకతో ఇకపై తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. పింకీ కూడా మానస్ తో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఎక్కువగా థంబ్ డౌన్ ఉంటే కాకరకాయ జ్యూస్ ను తాగాలి. ఇలా ఒకరి గురించి మరొకరు ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఒక హౌస్ మేట్ ను సేవ్ చేసాడు నాగ్.ఇందులో ఎవరూ ఊహించని విధంగా కాజల్ ముందుగా సేవ్ అయింది.

ఆ తర్వాత అనుభవించు రాజా టీమ్ బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చి సందడి సందడి చేశారు. ఆ తరువాత మైక్ పెట్టి అందులో మాట్లాడండి, క్లాప్స్ వస్తే సేవ్ అయినట్లు అని చెప్పగా ఇందులో మానస్, షణ్ముఖ్ సేవ్ అయ్యారు. ఆ తర్వాత మరో ప్రాపర్టీతో సిరి సేవ్ అయినట్లు ప్రకటించారు. కొంత సేపు సస్పెన్స్ తర్వాత ప్రియాంక, అనీ మాస్టర్ లలో అనీ మాస్టర్ ను ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు నాగ్.

ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకు వచ్చిన యాని మాస్టర్ నిరుత్సాహంగా కనిపించింది. వెళ్లే ముందు కాజల్ కి తప్ప అందరికీ అడ్వైజ్ లు ఇచ్చింది. నిజానికి అనీ మాస్టర్ ఎలిమినేట్ కావడానికి కారణం మాత్రం ఆమె ప్రవర్తన అని చెప్పవచ్చు. ఎందుకంటే టాస్క్ లలో ప్రతీసారి గ్రూప్ గేమ్ అంటూ మధ్యలోనే వదిలేయడం, నచ్చకపోతే గట్టిగట్టిగా అరిచేయడం, అవతలవాళ్లను ఎక్కిరించడం, కించపరచడం, కాజల్ ను వెక్కిరిస్తూ డ్యాన్స్ చేయడం లాంటివి చేయడంతో కానీ మాస్టర్ కు ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో అని మాస్టర్ 11వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

11వ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్న అనీ మాస్టర్..!

సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనీ మాస్టర్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. తక్కువ ఓట్లు పడటంతో, అలాగే ఓటింగ్లో కూడా లీస్ట్ లో ఉండటం వల్ల అని మాస్టర్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి ఎపిసోడ్ నుంచి తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. అలా 11వ వారం వరకూ వచ్చింది అనీ మాస్టర్.

తనకు ఇచ్చిన టాస్క్ ను సవ్యంగా పూర్తి చేస్తూ, కొన్ని టాస్క్ లలో సోలోగా కూడా గెలిచి కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ను కూడా సాధించింది. అలాగే ఇమ్యూనిటీ టాస్క్ లో కూడా సోలో గెలిచి, ఇమ్యూనిటీని పొంది మానస్ ను కూడా సేఫ్ చేసింది. ఇదే కాకుండా మేల్ కంటెస్టెంట్ ఆయన జెస్సితో కూడా కుస్తీకి సైతం దిగింది.అన్ని టాస్క్ లలో కూడా 100 శాతం పర్ఫార్మెన్స్ ఇచ్చింది.

కానీ బయట సోషల్ మీడియాలో అనీ మాస్టర్ కు పెద్దగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేకపోయింది. అలాగే కొన్ని సందర్భాలలో హౌస్మేట్స్ ను ఇమిటేట్ చేస్తూ ప్రెసిడెంట్ అవ్వడం, కాజల్ ను పదే పదే ఎక్కిరిస్తూ డాన్స్ చేయడం అనేది అనీ మాస్టర్ కు మైనస్ గా మారాయి. ఈ క్రమంలోనే లాస్ట్ వీక్ అనీ మాస్టర్ నామినేషన్స్ లో టాస్క్ ఆడేటప్పుడు శ్రుతిమించి మరీ కాజల్ పైకి వెళ్ళింది. కాజల్ విషయంలో అలాగే ప్రియాంక విషయంలో డీప్ గా హర్ట్ అయింది అనీ మాస్టర్.

అలాగే టాస్క్ లో గేమ్ ఆడుతున్న వారిని గ్రూప్ గానే గేమ్ ఆడుతూ ఎదుటి వారిని గ్రూప్ గేమ్ అనడం, పింకీ తో వాదించడం లాంటివి అని మాస్టర్ గేమ్ ని బాగా దెబ్బతీశాయి. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో అనేకసార్లు ఈమెను మోసం కూడా చేశారు. తనకు ఏది జెన్యూన్ అనిపిస్తే అదే మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే అనీ మాస్టర్ బిగ్ బాస్ టాప్ ఫైవ్ లిస్టులో ఉంటుందని అనుకున్నారు. కానీ ఇలా ఎలిమినేట్ అయిపోయి అభిమానులకు షాక్ ఇచ్చింది.

అలాంటి వారికి ఓట్లు వేయకండి.. తన సపోర్ట్ వాళ్లకే .. యాంకర్ ప్రశాంతి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో మొన్నటి వరకు టీఆర్పీ రేటింగ్ దారుణంగా ఉంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కూడా అయిపోవడంతో బిగ్ బాస్ రియాల్టీ షో టీఆర్పీ రేటు పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎన్నికలు, క్రికెట్ ముగిసిపోవటంతో మళ్ళీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ క్రేజ్ పెరిగింది. దీనిపై బిగ్ బాస్ అప్డేట్స్ పై నెటిజన్లు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు.

దీనికి కారణం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన సన్నీకి, షణ్ముఖ్ మధ్య గొడవనే చెప్పాలి. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ షణ్ముఖ్ పై సన్నీ రెచ్చిపోయాడు. దీనిపై షణ్ముఖ్ గర్ల్‌ఫ్రెండ్‌ దీప్తి సునయన కూడా సన్నీకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దానిపై ఓ పెద్ద పోస్టును దీప్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

ఆ గొడవలో షణ్ముఖ్ ప్రవర్తించిన తీరు తనకు ఎంతగానో నచ్చిందని.. తనను హగ్ చేసుకోవాలని అనిపిస్తుంది అంటూ దీప్తి అందులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆ వ్యవహారంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన శివజ్యోతి షణ్ముఖ్ కు సపోర్టు చేయగా.. కొందరు షణ్ముఖ్ దే తప్పు అంటూ భావిస్తున్నారు.

తాజాగా సీనియర్ టీవీ యాంకర్ ప్రశాంతి షణ్ముఖ్ బిహేవియర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హౌస్ లో గేమ్ చూసి ఓటు వేయండి.. అంతేకాని బయట వారి పాపులారిటీ చూసి ఓట్లు వేయకండి అంటూ షణ్ముఖ్ ని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది యాంకర్ ప్రశాంతి. హౌస్ లో టాప్ 5 లో ఎవరుంటారో తనకు తెలుసని.. వాళ్లందరికీ తన సపోర్టు ఉంటుందని ఆమె పేర్కొంది. హౌస్ లో గేమ్ లు మంచిగా ఆడిన వారికి మాత్రమే ఓట్లు వేయండి అంటూ యాంకర్ ప్రశాంతి షాకింగ్ కామెంట్ చేశారు.

ఒసేయ్ ఉమా.. చిల్లరదానా అంటూ రెచ్చిపోయిన అనీ మాస్టర్

బిగ్ బాస్ రియాల్టీ షో వేరే లెవల్లోకి వెళ్లి పోతోంది. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ.. తిట్ల పురాణాన్ని లంకించుకున్నారు. రెండోవారం నామినేషన్ ప్రక్రియలో నటి ఉమ మాట్లాడిన మాటలకు ఇంట్లో వాళ్లు ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు. కానీ రాను రాను ఆ హౌస్ లో ప్రతీ ఒక్కరి నోటి నుంచి బూతులే వినిపిస్తున్నాయి.

తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో అది స్పష్టంగా అర్థం అవుతోంది. కెప్టెన్సీ టాస్క్ కోసం పిజికల్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. అప్పటి నుంచి హౌస్ లో యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఎవరిపై ఎవరు.. ఏ మాట వదులుతారోనని ఇంటి ముందు టీవీల ముందు కూర్చున్న ఫ్యామిలీలు భయపడి పోతున్నారు. దీనిలోకి అనీ మాస్టర్ కూడా చేరిపోయింది. టాస్క్ లో భాగంగా ఉమాను ‘ఒసేయ్’ అంటూ సంభోదించింది.

‘ఒసేయ్ ఉమా చింపుతావా’ అంటూ అనీ అనగా.. మీరు మమ్మల్ని కొడితే.. చింపుతా అంటూ ఘాటుగా సమాధానం ఇస్తుంది ఉమ. తర్వాత ఆమె ఉమాను ‘సిగ్గులేదా నీకు తూ’ అంటూ అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఉమ కూడా ఆమెను తిట్టుకుంటూ.. తూ అంటూ చెప్పింది. నీదంతా చిల్లర వేషాలు అంటూ అనీ అంటే.. అవును నేను చిల్లరే.. నువ్వు పెద్ద క్లాస్ మరి అంటూ ఉమ సమాధానం ఇస్తుంది.

తర్వాత నా మీదకు వస్తే.. కాలుతో తంతా అంటూ శ్వేతకు అవతలి టీం సభ్యుల్లో ఒకరు హెచ్చరించగా.. దానికి శ్వేత ఘాటుగానే సమాధానం చెప్పారు. కాలుతో తన్నించుకోవడానికి బిగ్ బాస్ షోకి రాలేదు అంటూ కెమెరాకు చెబుతుంది శ్వేత. దీనికి ఎలా శుభం కార్డు పడుతుంది..? అంటూ ఇన్ స్టా లో ఈ వీడియోను స్టార్ మా పోస్ట్ చేసింది.