బిగ్బాస్ 5 తెలుగు రియాలిటీ షో ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. బుధవారం 102వ ఎపిసోడ్ పూర్తయింది. బిగ్బాస్ ఫినాలేకు ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్లో కేవలం ఐదురుగు మాత్రమే ఉన్నారు. సిరి, షణ్ముఖ్, మానస్, సన్నీ, శ్రీరాచంద్రలో ఒకరు ఈసారి టైటిల్ను కొట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇక ఈ షో ముగింపు దశకు చేరకున్నా కొద్ది.. బయటకు వచ్చిన కంటెస్టెంట్లతో పాటు.. హౌజ్ లో ఉన్న వాళ్లను కూడ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. నెట్టింట్లో వీళ్లకు సంబంధించిన మీమ్స్, ట్రోలింగ్ తో ఆడేసుకుంటున్నారు. అందులో కొంతమంది డబ్బులు తీసుకొని మరీ.. పని కట్టుకొని చేస్తున్నారు. కావాలనే నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారు. కంటెస్టెంట్లను మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు.
అలా మొత్తానికి ఈ బిగ్ బాస్ ఐదో సీజన్లో జరిగిన ట్రోలింగ్, చేసిన నెగెటివ్ ప్రచారాలపై యాంకర్ రవి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అటువంటి ట్రోలింగ్ లకు, నెగెటివ్ కామెంట్ల ముగింపుకు ఇదే మొదలు అని సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశాడు రవి. తనమీద.. తన ఫ్యామిలీ మీద ట్రోలింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు రవి. ఎవరినైనా సరే ఇలా పరుష పదజాలంతో సోషల్ మీడియాతో దూషిస్తే సహించేది లేదని ఇకపై ఇలాంటివి రిపీట్ అవ్వొద్దనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని యాంకర్ తెలిపాడు.
రవి తీసుకున్న నిర్ణయంపై చాలామంది ప్రశంసిస్తున్నారు. యానీ మాస్టార్ అయితే.. యాంకర్ రవిని మంచి పని చేశావ్ తమ్ముడు అంటూ ప్రశంసించింది. తాను ఎంత జెన్యూన్ గా ఉన్నానో నీకు తెలుసు స్టార్ మా.. ఇక చేసిందంతా చాలు.. ఆపేయండి అంటూ ఫైర్ అయ్యారు మాస్టార్. ఇలాంటి బ్యాడ్ కామెంట్లు.. నెగెటివ్ ట్రోలింగ్ లు చేసేవారిపై తాను కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. హౌస్ లో 24 గంటలు సమయం ఉంటుంది.. అన్ని గంటలు ఏం జరుగుతుందో మీకు తెలియదు.. కేవలం ఒక గంట మాత్రమే చూసి.. తుది నిర్ణయానికి రావొద్దు.. ఇకనైనా ఇవన్నీ ఆపండి అంటూ హెచ్చరించింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…