Tag Archives: ANR

Jayamalini : ఆ హీరో నన్ను చెడ్డది అన్నారు.. నా నడుముకు రెండు వైపులా చేయి వేసి ఏంటి నీది ఇంత పెద్దగా ఉందన్నారు : జయమాలిని

ఆ రోజుల్లో కుర్రాళ్ల మనసులో ఆమె ఒక కళల రాణి. దివినుండి భువికి దిగివచ్చిన అప్సరస,అతిలోక సుందరి.కుర్రాళ్ళ కాలేజీ పుస్తకాలు, పర్స్ లు తెరిచి చూస్తే ఆమె ముగ్ధ మనోహర రూపం దర్శనమిచ్చేది. నిద్రలో వచ్చే కళలు సైతం మరిపించి ఇది నిజమా అన్న భ్రమలోకి తీసుకెళ్ళిన అరుదైన సుందర రూపం ఆమె సొంతం.

దాదాపు ఆమె నటించి, నర్తించిన అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఓ సందర్భంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు రానటువంటి జనం జయమాలిని షూటింగ్ చేస్తున్నప్పుడు తండోపతండాలుగా రావడం ఎన్టీ రామారావు గారిని ఆశ్చర్యానికి గురి చేసింది. తలుపులకు తాళం వేసి షూటింగ్ జరుగుతుంటే కుర్రకారు ఎగబడి చూసేవారు.

ఓ సుబ్బారావు..ఓ అప్పారావు.. నీ ఇల్లు బంగారం గాను.. గుడివాడ వెళ్లాను.. గుంటూరు వెళ్లాను.. సన్నజాజులోయ్.. లాంటి కైపెక్కించే వందలాది పాటలకు నర్తించి కుర్రకారు మతులు పోగొట్టి వారి గుండెల్లో జెండా పాతిన ఆనాటి క్లబ్ డాన్సర్ జయమాలిని. అయితే ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయమాలిని మాట్లాడుతూ.. అలనాటి స్టార్ హీరో అయినా అక్కినేని నాగేశ్వరావుతో ఆలుమగలు, రాముడు కాదు కృష్ణుడు, బహుదూరపు బాటసారి, సంగీత సామ్రాట్ వంటి చిత్రాలలో ఆయన సరసన నర్తించడం జరిగిందని ఆమె చెప్పారు. అలా ఒక రోజు షూటింగ్ చేస్తున్న క్రమంలో అక్కినేని తన భార్యతో షూటింగ్ కి హాజరయ్యారు…ఆయనను చూడగానే నమస్కారం పెట్టాను.. అటు వెళ్తున్న నన్ను చూసి జయమాలిని ఆగు అని పిలిచారు. మా ఆవిడ నిన్ను చెడ్డ అమ్మాయి అని అంటుందన్నారు.

నేను కాదు ఆవిడ అలా అంటున్నారన్నారు. అప్పుడు నేను చిన్నగా చిరునవ్వు నవ్వాను. ఆయన ఎప్పుడూ లొకేషన్లో అల్లరి చేస్తుండేవారని అలాగే అక్కినేని, నేను ఓ పాటలో డాన్స్ చేస్తున్నప్పుడు ఆయన నా నడుమును రెండు చేతులతో పట్టుకున్నారు. ఏమిటి మీ నడుము ఇంత పెద్దగా ఉంది, నా రెండు చేతులకు కూడా అందడం లేదన్నారు. అక్కడే ఉన్న మరో నటుడు గిరిబాబు కలిపించుకొని జయమాలిని అలా అడుగుతారేంటి ఆ విషయం వాళ్ళ అమ్మానాన్నని అడగాలన్నారు. అలా అనేసరికి నేను అవాక్కయ్యాను. అప్పుడు షూటింగ్స్ అన్నీ కూడా సరదాగా సాగిపోయేవన్నారు. అక్కినేని మంచి డాన్సర్ అని “ఆలుమగలు” చిత్రంలో “రా రా రంకె వేసిందమ్మో రంగ అయినా పోట్ల గిత్త “… అనే పాటలో ఆయన అద్భుతంగా డాన్స్ చేశారని. అప్పుడున్న నటుల్లో అక్కినేని, ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన చిరంజీవి మంచి డాన్సర్స్ అని ఆ ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలను జయమాలిని గుర్తు చేసుకున్నారు.

Flash Back : ఏఎన్ఆర్ ముందే కాలేజీ కుర్రాడిని చితకొట్టిన డిస్కో శాంతి.. అసలేం జరిగిందంటే?

ANR -Disco Shanti: డిస్కో శాంతి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె శ్రీహరి భార్యగా మరింత గుర్తింపు పొందారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నటువంటి డిస్కో శాంతి ఒకానొక సమయంలో వరుస సినిమాలలో ప్రత్యేక పాటలకు డ్యాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు విపరీతమైన అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే కొందరు వారి అభిమానాన్ని చాటుకోగా మరికొందరు వారి వెకిలి చేష్టలతో ఎంతోమంది సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఇక కొందరైతే సెలబ్రిటీలు జనంలోకి వచ్చినప్పుడు అదే అదునుగా భావించే వారిని తాకరానీ చోట తాకుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటన డిస్కో శాంతికి కూడా గతంలో జరిగిందని తాజాగా వెల్లడించారు. ఏఎన్ఆర్ హీరోగా నటించిన కాలేజీ బుల్లోడు సినిమాలో డిస్కో శాంతి ఏఎన్ఆర్ తో కలిసి రాగింగ్ ఆట అంటూ సాగిపోయే పాటలో నటించారు. ఈ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ కాలేజీ కుర్రాడు కెమెరా పక్కనే నిలబడి డిస్కో శాంతిని చూస్తూ వెకిలి సైగలు చేశారు.

ANR -Disco Shanti: షాక్ లో ఉన్న ఏఎన్ఆర్..

ఈ విధంగా ఆ కుర్రాడు చేస్తున్న వెకిలి సైగలు తనకు ఎంతో అసహ్యం కలిగించాయి. అయితే ఎంతో ఓపికగా ఉన్నారు. ఇక ఈ పాట చిత్రీకరణలో ఏఎన్ఆర్ కత్తెరతో డిస్కో శాంతి డ్రెస్ కట్ చేసి లాగాల్సి ఉంది. ఆ సమయంలో ఆ కుర్రాడు చేష్టలు శృతిమించడంతో తనని దగ్గరకు పిలిచింది. ఇలా దగ్గరకు వచ్చిన ఆ కుర్రాడిని ఒక్క తన్ను తన్ని చెడమడ తనని చితకొట్టింది. ఇలా ఏఎన్ఆర్ ముందే తనని కొట్టడంతో మిగిలిన చిత్ర బృందంతో పాటు ఏఎన్ఆర్ కూడా షాక్ కి గురయ్యారు. అసలేం జరిగిందో తెలియక షాక్ లో ఉన్న వీళ్ళందరూ తేరుకొని తనని అడ్డుకున్నారు.మరుసటి రోజు డిస్కో శాంతిని పిలిచి ఏం జరిగింది అని ఏఎన్నార్ ప్రశ్నించగా ఆమె జరిగిన విషయం చెబితే ఏది ఏమైనా ఆలా కొట్టడం తప్పు తనకేదైనా జరగరానిది జరిగితే నువ్వు జైలు పాలు కావాల్సి వచ్చేది తల్లి అంటూ ఏఎన్ఆర్ చెప్పినట్లు డిస్కో శాంతి వెల్లడించారు.

Chiranjeevi: ఈ ఫ్లాప్ సినిమా చిరంజీవిని మెగాస్టార్ చేసిందనే విషయం మీకు తెలుసా?

Chiranjeevi: ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ వంటి అగ్ర హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరియర్ మొదట్లో ఈయన విలన్ పాత్రలలో నటిస్తూ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

 

ఇకపోతే ఈయనలో ఉన్న టాలెంట్ గుర్తించిన కొందరు దర్శక నిర్మాతలు ఈయనకు హీరోగా అవకాశం ఇచ్చారు. ఈ విధంగా స్వయంకృషితో చిరంజీవి సినిమాలలో నటిస్తూ నేడు ఈ స్థాయికి ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఈయన బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. తద్వారా ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్నారు.

Chiranjeevi: ఆ విషయంలో విజయశాంతిని చాలా అవమానించారు.. చిరంజీవి గారికి చెబుదామంటే కలవలేక పోయాను: సీవీల్ నరసింహారావు

ఇకపోతే ఈయన పేరు ముందు మెగాస్టార్ అని రావడానికి ఓ నిర్మాత కారణమని అయితే ఈ బిరుదు ఒక ఫ్లాప్ సినిమా వల్ల వచ్చిందని విషయం చాలామందికి తెలియదు. మరి ఈయనకు మెగాస్టార్ అని బిరుదు ఇచ్చినది ఎవరు? ఇతనికి ఆ ఫ్లాప్ సినిమా రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్.రామారావు నిర్మాణంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సుమారు ఐదు సినిమాల వరకు వచ్చాయి.

ఈ సినిమాలన్నీ కూడా యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కినవే వీరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం అభిలాష, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం చాలెంజ్ రాక్షసుడు మరణం మృదంగం వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలలో మరణం మృదంగం మినహా మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

మరణ మృదంగంతో మెగాస్టార్ గా మారిన చిరు…

ఇకపోతే మరణం మృదంగం సినిమా ముందు వరకు సుప్రీం హీరోగా ఉన్నటువంటి చిరంజీవి ఈ సినిమాతో మెగాస్టార్ అయ్యారు. కె ఎస్ రామారావు మరణం మృదంగం సినిమా సమయంలో థియేటర్లో స్క్రీన్ పై తన పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదును ఉండాలని సూచించారట.అప్పటినుంచి ఈయన పేరు ముందు మెగాస్టార్ అని బిరుదు ఉంది అయితే మరణం మృదంగం సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.ఇకపోతే ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాల తర్వాత కె ఎస్ రామారావు మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయకపోవడం గమనార్హం.

NTR -ANR: ఎన్టీఆర్ కారణంగా ఏఎన్ఆర్ ఆ పాత్రకు దూరమయ్యారా.. అందుకే ఆ వేషం వెయ్యలేదా?

NTR -ANR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ నటన గురించి అందరికీ తెలిసిందే.ఒకప్పుడు ఈ ఇద్దరి అగ్ర హీరోలు పోటీలు పడి మరి సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఎలాంటి పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయి ఎంతో అవలీలగా ఆ పాత్రలలో నటించేవారు. ఇకపోతే ఏఎన్ఆర్ చివరి సినిమాగా మనం సినిమాలో నటించారు. ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది.

NTR -ANR: ఎన్టీఆర్ కారణంగా ఏఎన్ఆర్ ఆ పాత్రకు దూరమయ్యారా.. అందుకే ఆ వేషం వెయ్యలేదా?

ఇదిలా ఉండగా ఏఎన్ఆర్ బ్రతికి ఉన్న సమయంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఏఎన్నార్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గతంలో తాను ఎక్కువగా నటించిన కోస్టార్లలో ఎన్టీఆర్ ఒకరని ఎన్టీఆర్ గురించి ఏఎన్ఆర్ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా పని అయిపోతుందని ఎంతో మంది ప్రొడ్యూసర్లు స్వయంగా నాతోనే ఈ మాటలు చెప్పారు.

NTR -ANR: ఎన్టీఆర్ కారణంగా ఏఎన్ఆర్ ఆ పాత్రకు దూరమయ్యారా.. అందుకే ఆ వేషం వెయ్యలేదా?

ఎన్టీఆర్ చూడటానికి ఎంతో గొప్పగా ఉండటమే కాకుండా తన వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉండేది. నటన పరంగా చూస్తే నాకంటే ఎన్టీఆర్ గారికి ఎక్కువ మార్కులు వేయవచ్చు అంటూ ఏఎన్ఆర్ వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక చిత్రాలలో నటించారు. ఇకపోతే ఎన్టీఆర్ తనని కర్ణుడు వేషం వేయమని ఎంతగానో సూచించారు అయితే తాను మాత్రం కర్ణుడి వేషంలో నటించలేదు. అలాగే చాణక్య చంద్రగుప్త సినిమాలో ఎన్టీఆర్ సూచన మేరకే తాను చాణిక్యుడు వేషం వేశానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఏఎన్ఆర్ వెల్లడించారు.

కృష్ణుడి వేషానికి మారుపేరుగా నిలిచిన ఎన్టీఆర్…

ఇకపోతే కృష్ణుడి వేషం వేసి ఎన్టీఆర్ ఎంతో పాపులర్ అయ్యారు. కృష్ణుడు అనగానే అప్పట్లో ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకు వచ్చేవారు. ఇక ఎన్టీఆర్ తనని కృష్ణుడి వేషం వేయమని కృష్ణుడి వేషానికి నువ్వు బాగా సెట్ అవుతావు కృష్ణుడి వేషం వేయమని ఎంతగానో కోరారు. అయితే కృష్ణుడి వేషం అంటేనే ఎన్టీఆర్, ఆ వేషం కేవలం ఆయనకు మాత్రమే బాగా సెట్ అవుతుందని అందుకే తాను ఎప్పుడు కృష్ణుడి వేషం వేయలేకపోయానని ఏఎన్ఆర్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

Rakta Sambandham : ఈ సినిమాలో సావిత్రి మీకు చెల్లి పాత్రలో అనగానే అక్కినేని జారుకున్నారు.. కానీ ఎన్టీఆర్ ఒప్పుకున్నారు.!!

తమిళంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా పాశమలర్. అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే భారీ నాటకీయ చిత్రం ఇది. సినిమా నిర్మాత డూండీ తమిళ చిత్రం హక్కులు కొని, రచయితగా అప్పటికి సినీరంగానికి పూర్తి కొత్తవారైన ముళ్ళపూడి వెంకటరమణను నియమించుకున్నారు. అయితే భారీ నాటకీయత, శోకభరితమైన సన్నివేశాలూ ఉన్న హెవీ డ్రామా సాహిత్యరంగంలో హాస్యరచయితగా పేరొందిన ముళ్ళపూడి వల్ల ఏమవుతుందని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచినా, డుండీ మాత్రం “హాస్యం, విరుపు తెలిసినవాడే హెవీడ్రామా రాయగలడు” అంటూ ప్రోత్సహించారు.

తమిళ స్క్రిప్ట్ అందగానే రమణ తెలుగు స్క్రిప్టును ముఖ్యమైన షాట్ విభజనలు సూచించడంతో సహా సినిమాను దాదాపు రెండు వారాల్లో రాసేశారు. దర్శకుడు వి.మధుసూదనరావు స్క్రిప్ట్ అయినంతవరకూ తీసుకురమ్మని రెండు వారాలకు అడగ్గానే, మొత్తం స్క్రిప్టును చేతిలో పెట్టడంతో ఒకేసారి స్క్రిప్ట్ చూసి ఒకే చేసేశారు. ఆ తర్వాత నిర్మాత డూండీ ఫ్యామిలీ, సెంటిమెంట్ పాత్రలకు పెట్టింది పేరైన అక్కినేనిని వెళ్లి కలిశారు. “పాశమలార్” తమిళ చిత్ర కథను అక్కినేనికి వినిపించడం జరిగింది.

అయితే ఈ చిత్రంలో అన్నా చెల్లెలు సెంటిమెంట్ తో ఉండడం వలన చెల్లి పాత్రలో సావిత్రిని తీసుకుంటున్నామని అక్కినేనితో చెప్పడంతో.. ఆయన ఒక్కసారి అవాక్కయ్యారు. గతంలో తను, సావిత్రి అనేక చిత్రాల్లో హీరో, హీరోయిన్ గా నటించమని.. ఇప్పుడు ఒక్కసారిగా “అన్నా చెల్లెలు” గా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారేమోనని అక్కినేని సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇదే తమిళ చిత్ర కథని మరో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కు చెప్పడంతో.. ముందు సందేహం వ్యక్తం చేసినప్పటికీ.. కథ బాగా నచ్చడంతో సావిత్రిని చెల్లెలి పాత్రకు ఎన్టీఆర్ ఓకే చేశారు. సరిగ్గా 6 నెలల క్రితం ఎన్టీఆర్, అక్కినేని నటించిన మల్టీ స్టారర్ చిత్రం “గుండమ్మ కథ” విడుదలైంది.

ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా సావిత్రి నటించగా.. అక్కినేనికి జోడిగా జమున నటించింది. అయినా ఎన్టీఆర్ ధైర్యంగా ఆయనతో సావిత్రి చెల్లెలిగా నటించడానికి ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ సరసన దేవిక నటించారు. సావిత్రి సరసన కాంతారావు నటించారు. 1962 వి.మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన “రక్త సంబంధం” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లెలుగా నటించి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాల స్వరపరిచిన “బంగారు బొమ్మ రావేమే.. పందిట్లో పెళ్లి జరిగేనే” ఇప్పటికీ కొన్ని సినిమాల్లో పెళ్లికి సంబంధించిన సన్నివేశం రాగానే బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాట రావడం అనేది సహజంగా మారిపోయింది.

Hero Venkat: ఏఎన్ఆర్ నన్ను లాగిపెట్టి చెంపపై ఒకటి కొట్టారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో వెంకట్!

Hero Venkat: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు వెంకట్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరో సోదరుడిగా నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే వెంకట్ ఇండస్ట్రీలో హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు.ఇక ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా పలు సినిమాలలో కీలకపాత్రలో సైడ్ క్యారెక్టర్ గా ఏఎన్ఆర్ నటించారు.

Hero Venkat: ఏఎన్ఆర్ నన్ను లాగిపెట్టి చెంపపై ఒకటి కొట్టారు… షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో వెంకట్!

ఈ విధంగా హీరో వెంకట్ నటించిన శ్రీ సీతారాముల కల్యాణం చూద్దాము రారండి. వెంకట్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా మంచి విజయం అందుకున్న తర్వాత ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఈయనకు ఏ సినిమా పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు అని చెప్పవచ్చు.

Hero Venkat: ఏఎన్ఆర్ నన్ను లాగిపెట్టి చెంపపై ఒకటి కొట్టారు… షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో వెంకట్!

ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ సరైన బ్రేక్ రాకపోవడంతో ఆయన కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇక తాజాగా ఈయన లూసర్ సీజన్ 2వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకట్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.

సరైన రియాక్షన్ రావడం కోసమే…

ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ… శ్రీ సీతారాముల కళ్యాణం సినిమాలో అనుకున్న విధంగా రియాక్షన్ రాకపోతే ఎన్నో టేకులు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో విసిగిపోయిన ఏఎన్ఆర్ లాగిపెట్టి ఒక్కటి చెంపపై కొట్టారు. ఇలా కొట్టడం వల్ల ఆ సన్నివేశానికి తగ్గ రియాక్షన్ బయటపడిందని అందుకోసమే ఆయన తనను కొట్టారని ఈ ఇంటర్వ్యూలో వెంకట్ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి వెల్లడించారు.

నేను చనిపోతే ఈ సినిమా చేసాకే చనిపోతా అని ఏఎన్ఆర్ అన్నారు : నటి శ్రియా..!

శ్రియా సరన్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే చాలా గ్యాప్ తర్వాత శ్రియా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గమనం సినిమాతో డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రియ సరన్ తో పాటుగా శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా శ్రియా సరన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

20 ఏళ్ళు ఇలా మీ ముందు ఉన్నాను. ఇష్టం నా మొదటి సినిమా. ఆ రోజులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎంతో ప్రేమ దొరికింది. నేను ఇంత దూరం వచ్చాను అంటే అందుకు గల కారణం ప్రేక్షకుల ప్రేమ. అదే విధంగా నేను చేసిన కొన్ని సినిమాలు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా కొన్ని వర్కవుట్ అవ్వలేదు. నేను సినిమా ఇండస్ట్రీ లో ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీయా.

అదే విధంగా నేను ఎప్పటి వరకు బ్రతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలి అని సినిమాలు చేస్తూనే ఉండాలి అని అనుకుంటున్నాను. ఏఎన్నార్ గారు చివరి క్షణం వరకు కూడా నటించారు.. మనం సినిమా సమయంలో ఒకవేళ నేను చనిపోతే ఆ సినిమా చేసే చనిపోతాను అని అనేవారు. అలా నేను కూడా చివరిక్షణం వరకూ నటిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చింది శ్రియా సరన్. నా కూతురు, నా కుటుంబం నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. అదేవిధంగా సినిమాలో ఏ పాత్ర చేసినా కూడా నా మనసుకు నచ్చాలని అనుకుంటున్నాను అని తెలిపింది.

గమనం సినిమా కథ వినగానే వెంటనే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో నేను దివ్యాంగురాలు పాత్రలో కనిపిస్తాను.. వినిపించదు కానీ మాట్లాడతాను.. ఇందులో నటించడానికి కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను.. ఈ సినిమాలో నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర అని చెప్పుకొచ్చింది శ్రియా శరన్. మనిషిలో జరిగే అంతర్గత,సంఘర్షణ ప్రయాణం గురించి చెప్పేదే ఈ గమనం సినిమా. నిస్సహాయతతో ఉండే మనిషి ఒక్కసారిగా బలం వస్తే వాటిని ఒక్కసారిగా అధిగమించే చేస్తాం. అదేవిధంగా నా డెలివరీ సమయంలో కూడా నాకు ఒక భయం ఉండేది కానీ ఏం కాదు అన్న ధైర్యం నేను తెచ్చుకున్నాను అందువల్లే అంత సాఫీగా సాగిపోయింది అని తెలిపింది.

శోభన్ బాబు కొడుకు ఎంత అందంగా ఉన్నాడో.. హీరోకు ఏ మాత్రం తగ్గని పోలికలతో?

ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర అయిన హీరో శోభన్ బాబు. ఇతడిని ఆంధ్ర సోగ్గాడని కూడా పిలిచేవారు. అయితే అస్సలు పేరు వచ్చేసి.. ఉప్పు శోభనా చలపతిరావు. కృష్ణాజిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. కాలేజీ రోజుల్లో ‘పునర్జన్మ’ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అతడికి చిన్నతనం నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం ఉండేదట. తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తను బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని చెప్పుకొచ్చాడు. అయితే శోభన్ బాబు మొదట పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 1959న విడుదల అయ్యింది కాని విజయవంతం కాలేదు.

తర్వాత అతడు చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు. 1960 లో విడుదల అయిన ఈ సినమా బంపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాతనే అతడికి మంచి పేరు వచ్చింది. అప్పట్లో ఎన్టీఆర్, ఎన్నాఆర్ వంటి పెద్ద స్టార్ లతో అతడు పోటీ పడే వారు. అయితే శోభన్ బాబుకు 1958 వ సంవత్సరంలో శాంతకుమారి అనే ఆవిడను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు జన్మించారు.

అయితే అతడు ఏ ఫంక్షన్ కి వెళ్లినా తన ఫ్యామిలీని పరిచయం చేసిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు తమ వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సమయంలో శోభన్ బాబు కూడా తన వారసుడిని సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని.. ఆయన అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ శోభన్ బాబు వారసుడికి సినీ ఇండస్ట్రీ అంటే అస్సలు ఇష్టం లేదట. అందుకే సినీ పరిశ్రమలోకి రావడానికి అతడు అయిష్టత చూపించడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేకపోయారు.

ఏఎన్నార్ తో దాసరి నారాయణరావుకు ఆ విషయంలో మనస్పర్థలు వచ్చాయి..!

దివంగత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఏదో ఒక విభిన్నమైన కథాంశం ఉంటుంది. అతడి దర్శకత్వంలోనే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఎంతో మంది సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అతడు ఒక సినీ శిఖరం. ప్రతీ ఒక్కరు దాసరి నారాయణరావును గురువుగా పేర్కొంటారు. అంతలా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

దాసరి నారాయణరావు పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో అతి సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు. సినిమాలపై ఎంతో ఆసక్తితో మద్రాసు చేరుకొని అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు. అయితే అతడు ఇంతలా సినీ రంగంలో పేరు తెచ్చుకోవడానికి గల కారణం అక్కినేని నాగేశ్వరావు మరియు సావిత్రి గారు అని అతడు ఎన్నో సందర్బాల్లో చెప్పుకొచ్చారు కూడా.

అంతలా ఏఎన్నార్ ను ఆదిరించిన దాసరి అతడితోనే విభేదాలు వచ్చాయట. రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు కాస్త తారా స్థాయికి చేరుకొని.. ఇద్దరు ఒకరంటే ఒకరు.. మాట్లాడుకోకుండా ఉండేవారట. ఇదంతా దాసరి నారాయణరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విషయంలో ఇలా మేము దూరం అవుతామని ఎన్నడూ అనుకోలేదని అన్నారు.

ఏఎన్నార్ తో సమానంగా దాసరికి కూడా రెమ్యూనరేషన్ ఇస్తుండటంతో నాగేశ్వరావు అన్నఒక మాటకు అతడు బాగా బాధపడ్డట్లు చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత వాళ్ల కుటుంబంతో దాసరి కుటుంబానికి ఎలాంటి మనస్సర్థలు రాలేదన్నారు. తర్వాత దాసరి నారాయణ రావు అక్కినేని నాగార్జునతో ఎన్నో సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ వద్దంటే.. కృష్ణ చేసి ఇండస్ట్రీలో తిరుగులేని రికార్డును సృష్టించారు..

గతంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందేవి. సంవత్సరానికి పదుల సంఖ్యలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు.ఈ క్రమంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోలు వారి సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలే ఉన్నాయని చెప్పవచ్చు.ఇక హీరో కృష్ణ విషయానికి వస్తే ఎన్నో విభిన్న కథాచిత్రాల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందాడు.

సూపర్ స్టార్ కృష్ణ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక కృష్ణ కెరీర్లో ఎన్నో విజయవంతమైన సినిమాలున్నాయి.అలాంటి విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా ఎంతో పేరు సంపాదించుకున్న సినిమా “అల్లూరి సీతారామరాజు” అని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా రికార్డులు సృష్టించింది.

ఇక ఈ సినిమాలోని పాటల విషయానికి వస్తే అది ఒక అద్భుతం. ఇప్పటికి ఈ సినిమాలోని పాటలు మనకు వినబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా “తెలుగువీర లేవరా..”అనే పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంది. అసాధ్యుడు సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజు వేషం వేశారు. ఈ సినిమాకు రామచంద్ర రావు దర్శకత్వం వహించారు.ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు కథ సిద్ధం కాగా ఈ సినిమాను దర్శకుడు రామచంద్రరావు ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్లారు.

కథ మొత్తం విన్న ఎన్టీ రామారావు కథ అద్భుతంగా ఉందని చెప్పి, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు.ఈ క్రమంలోనే రామచంద్రరావు ఈ కథను కృష్ణ దగ్గరకు తీసుకు వెళ్లడం కృష్ణ అందుకు ఒప్పుకోవడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.ఈ విధంగా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న దర్శకుడు రామచంద్రరావు అనివార్య మృతి వల్ల ఈ సినిమా మిగిలిన భాగాన్ని కెఎస్ఆర్.దాస్ తెరకెక్కించగా కృష్ణ పద్మాలయ సంస్థ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి షో లో అద్భుతమైన టాక్ సంపాదించుకుంది. ఈ విధంగా థియేటర్ల వద్ద మంచి విజయం దక్కించుకున్న ఈ సినిమా కృష్ణ కెరీర్లోనే ఒక అత్యున్నతమైన సినిమాగా నిలిచిపోయింది.