దివంగత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఏదో ఒక విభిన్నమైన కథాంశం ఉంటుంది. అతడి దర్శకత్వంలోనే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఎంతో మంది సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అతడు ఒక సినీ శిఖరం. ప్రతీ ఒక్కరు దాసరి నారాయణరావును గురువుగా పేర్కొంటారు. అంతలా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
దాసరి నారాయణరావు పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో అతి సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు. సినిమాలపై ఎంతో ఆసక్తితో మద్రాసు చేరుకొని అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు. అయితే అతడు ఇంతలా సినీ రంగంలో పేరు తెచ్చుకోవడానికి గల కారణం అక్కినేని నాగేశ్వరావు మరియు సావిత్రి గారు అని అతడు ఎన్నో సందర్బాల్లో చెప్పుకొచ్చారు కూడా.
అంతలా ఏఎన్నార్ ను ఆదిరించిన దాసరి అతడితోనే విభేదాలు వచ్చాయట. రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు కాస్త తారా స్థాయికి చేరుకొని.. ఇద్దరు ఒకరంటే ఒకరు.. మాట్లాడుకోకుండా ఉండేవారట. ఇదంతా దాసరి నారాయణరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విషయంలో ఇలా మేము దూరం అవుతామని ఎన్నడూ అనుకోలేదని అన్నారు.
ఏఎన్నార్ తో సమానంగా దాసరికి కూడా రెమ్యూనరేషన్ ఇస్తుండటంతో నాగేశ్వరావు అన్నఒక మాటకు అతడు బాగా బాధపడ్డట్లు చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత వాళ్ల కుటుంబంతో దాసరి కుటుంబానికి ఎలాంటి మనస్సర్థలు రాలేదన్నారు. తర్వాత దాసరి నారాయణ రావు అక్కినేని నాగార్జునతో ఎన్నో సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…