Tag Archives: apply

పేద పిల్లలకు ఉచితంగా విద్య.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

మారుతున్న కాలంతో పాటే పిల్లలకు చదువు చెప్పించాలంటే ఖర్చు రోజురోజుకు పెరుగుతోంది. స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలే అయినా పేద కుటుంబాల పిల్లలు వేర్వేరు కారణాల వల్ల చదువుకు దూరమవుతున్నారు. చిన్న వయస్సులోనే కూలి పనులు చేస్తూ విద్యకు దూరమవుతున్నారు. అలాంటి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రయోజనం చేకూర్చడానికి నెక్ట్స్‌వేవ్ అనే సంస్థ ముందుకొచ్చింది.

ఈ సంస్థ పేదరికం వల్ల చదువుకు దూరమైన పిల్లలకు చదువుతో పాటు నైపుణ్యాలను నేర్పిస్తోంది. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెక్స్ట్ వేవ్ ఆన్ లైన్ ద్వారా క్లాసులను నిర్వహిస్తోంది. ఆన్ లైన్ లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని నెక్స్ట్ వేవ్ సహాయంతో ఈ కార్యక్రమంలో చేరవచ్చు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరిన రోజు నుంచి 21 సంవత్సరాల వరకు ఈ సంస్థ అండగా ఉంటుంది.

నెక్స్ట్ వేవ్ పేద పిల్లలకు చదువు నేర్పించడంతో వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షాలాది మంది విద్యార్థులకు చేయూత అందించాలని నెక్స్ట్ వేవ్ సంస్థ భావిస్తోంది. నెక్ట్స్‌వేవ్ ప్రతినిధులు ఈ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులు ఉద్యోగం సంపాదించడానికి, సరికొత్త ఆవిష్కరణలను రూపొందించడానికి కావాల్సిన నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలుపుతున్నారు.

ఐబీ హబ్స్ సీఈవో దొమ్మేటి కావ్య ప్రతి చిన్నారికి సమానమైన అవకాశాలు కల్పించేలా చేస్తున్నామని చెబుతున్నారు. ఈ కోర్సు పూర్తిగా ఉచితం. https://www.onthegomodel.com/free-education-for-children వెబ్ సైట్ ద్వారా ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు శుభవార్త..!

భారతదేశంలో నివశించే వాళ్లకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎవరి దగ్గరైతే ఆధార్ కార్డ్ లేదో వాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేసే ఏ స్కీమ్ కు అర్హులు కారు. దేశంలో రోజురోజుకు ఆధార్ కార్డ్ కు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఏ పథకానికైనా ప్రస్తుతం ఆధార్ కార్డ్ నే ముఖ్యమైన ధ్రువపత్రంగా అధికారులు భావిస్తున్నారు ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న ప్రతి పథకానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి.

నవరవత్నాల హామీలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ లకు కూడా ఆధార్ తప్పనిసరి. ఆధార్ ప్రామాణికంగా తీసుకుని పథకాలను అమలు చేయడం ద్వారా పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ కార్యాకలాపాలకు కూడా ప్రస్తుతం ఆధార్ కార్డ్ ప్రామాణికం అవుతోంది. దీంతో యుఐడీఏఐ వేగంగా ఆధార్ కార్డులు అందించే దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత ఆధార్ కార్డ్ పొందడానికి నెల నుంచి రెండు నెలల సమయం పడుతోంది. ప్రతి రాష్ట్రంలో నెలకు వేల సంఖ్యలో కొత్త కార్డులు జారీ అవుతున్నాయి. కొందరు ఆధార్ కార్డ్ లేక కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మరి కొందరు ఆధార్ కార్డ్ లో తప్పొప్పులను సరిదిద్దుకోవడం కోసందరఖాస్తు చేసుకుంటున్నారు.

ఏపీలో దాదాపుగా 5 కోట్ల 30 లక్షల ఆధార్ కార్డులు ఉండగా తెలంగాణలో దాదాపు 4 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు ఆధార్ కార్డులను వేగంగా జారీ చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు.