Tag Archives: apssdc

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగాలు..?

ఏపీఎస్‌ఎస్‌డీసీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. efftronics private ltd అనే సంస్థలోని 100 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గరిష్టంగా 5 లక్షల రూపాయల 20 వేల వరకు ఈ ఉద్యోగాలకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 18వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది.

ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఉద్యోగాన్ని బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్, ఎంబెడ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. https://www.apssdc.in/home/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.apssdc.in/home/ ఈ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు బీటెక్ తో పాటు ఎంసీఏ, ఎంఎస్సీ చదివిన వాళ్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఎంపికైన వాళ్లకు 5.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఎంబెడ్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి 3.8 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.

సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీఎస్సీ, బీటెక్, డిప్లొమా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరానికి 2.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్ , ఎంఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు 3.8 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.

పదో తరగతి పాసైన వాళ్లకు శుభవార్త.. రూ.20వేల వేతనంతో ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ కోసం జగన్ సర్కార్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో జగన్ సర్కార్ జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది. తాజాగా ఏపీ.ఎస్.ఎస్.డీ.సీ నుంచి తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.

పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10 వేల నుంచి 20 వేల రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ లో డెలివరీ బాయ్స్ గా పని చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ అనుభవం లేనివాళ్లు, ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న పురుష అభ్యర్థులు https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఒంగోలు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. స్థానికులకు ఈ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తారు.

బైక్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, అనుభవం ఆధారంగా వేతనాలకు సంబంధించి మార్పులు ఉంటాయి. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

నిరుద్యోగులకు శుభవార్త.. 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 200 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హెటిరో డ్రగ్స్ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కాగా 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2016 నుంచి 2020 లోపు బీఎస్సీ కెమిస్ట్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

https://www.apssdc.in/ ద్వారా ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆధ్యర్యంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలరోజుల పాటు శిక్షణా తరగతులు ఉంటాయి. విజయవంతంగా శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. బీఎస్సీ కెమిస్ట్రీ కాకుండా ఇతర కోర్సులు చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోకూడదు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 11,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ప్రొడక్షన్ అలవెన్స్, ప్రొడక్షన్‌ ఎక్స్‌పెన్స్, నైట్ ఫిఫ్ట్ అలవెన్స్ కింద మొత్తం 16,800 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఏపీకి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తివివరాలు ఉంటాయి. వేతనం తక్కువ అయినప్పటికీ ఉద్యోగులకు అనుభవాన్ని బట్టి వేతనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. అరబిందో ఫార్మాలో ఉద్యోగాలు..?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 150 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

బీ.ఫార్మసీ, డిప్లొమా చదివిన అభ్యర్థులతో పాటు మెకానికల్, ఫిట్టర్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ చదివిన ఐటీఐ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాళ్లు సైతం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. గడిచిన నాలుగేళ్లలో ఉత్తీర్ణులైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 150 ఉద్యోగాలలో బీ ఫార్మసీ చదివిన వాళ్లకు 30 ఖాళీలు, డిప్లొమా చదివిన వాళ్లకు 50 ఖాళీలు ఉన్నాయి.

ఐటీఐ ఉద్యోగాలకు 50 ఖాళీలు ఉండగా బీఎస్సీ కెమిస్ట్రీ 20 ఖాళీలు ఉన్నాయి. అర్హత, అనుభవం ఆధారంగా వేతన చెల్లింపులు ఉంటాయి. టెక్నికల్ రౌండ్, హెచ్. ఆర్ రౌండ్ ద్వారా ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే https://www.apssdc.in/home/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట మండలంలోని కంపెనీ కార్యాలయంలో ఎంపికైన అభ్యర్థులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

నిరుద్యోగులకు శుభవార్త.. ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 2020 – 21 డిప్లొమా పాసైన విద్యార్థుల కోసం ఇన్ఫోసిస్ ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. apssdc వెబ్ సైట్ https://www.apssdc.in/ లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

ఇన్ఫోసిస్ సంస్థ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అభ్యర్థులను భర్తీ చేస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ నెల 21వ తేదీ లోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేసి షార్ట్ లిస్టింగ్ లో ఎంపికైన అభ్యర్థులకు వచ్చే నెల 9 నుంచి 13 వరకు ఆన్ లైన్ పరీక్షను నిర్వహిస్తారు.

apssdc ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ తీసుకున్నవాళ్లు సులభంగా ఆన్ లైన్ పరీక్షలో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్ లలో డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, డిప్లొమాలో 60 శాతం మార్కులతో పాసై, బ్యాక్ లాగ్స్ లేని వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 2.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో న్యూమరికల్ పజిల్ ఎబిలిటీ, రీజనింగ్, టెక్నికల్, ఇతర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. భవిష్యత్తులో వేతనం పెరిగే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే డిప్లొమా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.