ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 2020 – 21 డిప్లొమా పాసైన విద్యార్థుల కోసం ఇన్ఫోసిస్ ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. apssdc వెబ్ సైట్ https://www.apssdc.in/ లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
ఇన్ఫోసిస్ సంస్థ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అభ్యర్థులను భర్తీ చేస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ నెల 21వ తేదీ లోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేసి షార్ట్ లిస్టింగ్ లో ఎంపికైన అభ్యర్థులకు వచ్చే నెల 9 నుంచి 13 వరకు ఆన్ లైన్ పరీక్షను నిర్వహిస్తారు.
apssdc ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ తీసుకున్నవాళ్లు సులభంగా ఆన్ లైన్ పరీక్షలో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్ లలో డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, డిప్లొమాలో 60 శాతం మార్కులతో పాసై, బ్యాక్ లాగ్స్ లేని వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 2.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో న్యూమరికల్ పజిల్ ఎబిలిటీ, రీజనింగ్, టెక్నికల్, ఇతర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. భవిష్యత్తులో వేతనం పెరిగే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే డిప్లొమా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…