Featured

నిరుద్యోగులకు శుభవార్త.. ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 2020 – 21 డిప్లొమా పాసైన విద్యార్థుల కోసం ఇన్ఫోసిస్ ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. apssdc వెబ్ సైట్ https://www.apssdc.in/ లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

ఇన్ఫోసిస్ సంస్థ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అభ్యర్థులను భర్తీ చేస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ నెల 21వ తేదీ లోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేసి షార్ట్ లిస్టింగ్ లో ఎంపికైన అభ్యర్థులకు వచ్చే నెల 9 నుంచి 13 వరకు ఆన్ లైన్ పరీక్షను నిర్వహిస్తారు.

apssdc ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ తీసుకున్నవాళ్లు సులభంగా ఆన్ లైన్ పరీక్షలో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్ లలో డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, డిప్లొమాలో 60 శాతం మార్కులతో పాసై, బ్యాక్ లాగ్స్ లేని వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 2.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో న్యూమరికల్ పజిల్ ఎబిలిటీ, రీజనింగ్, టెక్నికల్, ఇతర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. భవిష్యత్తులో వేతనం పెరిగే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే డిప్లొమా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago