గతేడాది నవంబర్ నెలలో చైనా దేశంలోని వుహాన్ లో కరోనా వైరస్ విజృంభించగా నిన్నటితో తొలి కరోనా కేసు నమోదై ఏడాదైంది. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వైరస్ పుట్టుకకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన చైనా తయారు చేస్తున్న వ్యాక్సిన్ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లాన్సెట్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ లో చైనా కరోనా వ్యాక్సిన్ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ కరోనా వ్యాక్సిన్ వైరస్ ను ఎదుర్కొనే సమర్థవంతమైన యాంటీబాడీలను సృష్టించినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లపై ఏప్రిల్ నుంచి మే నెల వరకు జరిపిన పరిశోధనల్లో తక్కువ డోస్ ఇచ్చినా యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అయినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం లేదని కోలుకున్న వారిలో ఉత్పత్తి అయినా యాంటీబాడీలతో పోల్చి చూస్తే వ్యాక్సిన్ ద్వారా వచ్చిన యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. వ్యాక్సిన్ తొలి డోస్ కు, రెండో డోస్ కు మధ్య గ్యాప్ ఉంటే మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను అత్యవసరాల కోసం వినియోగించవచ్చని చెబుతున్నారు.
రెండు వారాల వ్యవధిలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ను ఇవ్వాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ ను ఉపయోగించవచ్చని వెల్లడిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…