ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ కోసం జగన్ సర్కార్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో జగన్ సర్కార్ జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది. తాజాగా ఏపీ.ఎస్.ఎస్.డీ.సీ నుంచి తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.
పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10 వేల నుంచి 20 వేల రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ లో డెలివరీ బాయ్స్ గా పని చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ అనుభవం లేనివాళ్లు, ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న పురుష అభ్యర్థులు https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఒంగోలు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. స్థానికులకు ఈ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తారు.
బైక్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, అనుభవం ఆధారంగా వేతనాలకు సంబంధించి మార్పులు ఉంటాయి. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…