Featured

2021లో తగ్గనున్న ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు.. నిజమేంటంటే..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ అవుతున్న వార్తల్లో కొన్ని వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేసేలా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో 2021 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా తగ్గనున్నాయంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ వార్త నిజమేనని భావిస్తున్నారు. 2020లో కరోనా విజృంభణ కేంద్రానికి దాదాపు మూడు నెలల పాటు భారీగా ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే.

పలు రాష్ట్రాల్లోని కంటైన్మెంట్ జోన్లలో నేటికీ లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయం తగ్గడంతో వేతనాలు తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వల్ల దేశంలో ప్రభుత్వ రంగ ఉద్యోగుల పరిస్థితే అంతోఇంతో మెరుగ్గా ఉండగా ప్రైవేట్ ఉద్యోగులలో చాలామంది ఉద్యోగాలను కొల్పోయి ఇబ్బందులు పడ్డారు.

వైరల్ అవుతున్న వార్తలో ప్రధాని నరేంద్ర మోదీ కార్మిక చట్టాల సవరణలో భాగంగా వేతనాలను తగ్గిస్తున్నారని… గ్రేడుల వారీగా ప్రభుత్వ ఉద్యోగులను విభజించి వేతనాలను తగ్గించనుందని వార్త వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్త గురించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించి స్పష్టతనిచ్చింది. వేతన కోడ్‌ బిల్లు-2019 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తించదని తెలిపింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించి స్పష్టతనివ్వడంతో వైరల్ అవుతున్న వార్తల గురించి ప్రభుత్వ ఉద్యోగులు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పనీర్ తయారీలో సీక్రెట్ ఏమిటో తెలుసా? మృదువైన పనీర్ కోసం ఈ 5 టిప్స్ తప్పనిసరి!

ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…

20 minutes ago

వాటర్ ఫాస్టింగ్ లాభాలా? ప్రమాదాలా? నిపుణుల వివరణ!

ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…

50 minutes ago

ముంబై ఓటములకు హార్దిక్ కారణమా? కెప్టెన్సీపై భారీ విమర్శలు

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…

1 hour ago

చిన్నారుల్లో పెరుగుతున్న SMA… రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఎందుకు అవసరం?

ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్‌ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…

1 hour ago

యోగా గురించి మీరు నమ్ముతున్నవి నిజమేనా? నిపుణుల హెచ్చరిక!

ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…

2 hours ago

15 ఏళ్లుగా సమోసాలకు దూరం.. అక్షయ్ సీక్రెట్ ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…

2 hours ago