Featured

భారత్ లో కరోనా కొత్తరకం కేసులు నమోదు.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?

2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలు ఆరోగ్య పరంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండటంతో వైరస్ ను అంతం చేయవచ్చని శాస్త్రవేత్తలు, ప్రజలు భావిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో భారత్ లో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో ప్రజల గుండెల్లో గుబులు పుడుతోంది.

బ్రిటన్ నుంచి వచ్చిన ఆరుగురికి కొత్తరకం కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. కరోనాతో పోలిస్తే కొత్తరకం కరోనా మరింత ప్రమాదం కాబట్టి ప్రజలు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నమోదైన ఆరు కేసులలో బెంగళూరులో మూడు కేసులు, హైదరాబాద్ లో రెండు కేసులు, పుణెలో ఒక కేసు నిర్ధారణ అయింది. కొత్తరకం కరోనా నిర్ధారణ అయిన వారిని అధికారులు ఐసోలేషన్ గదుల్లో ఉంచి వైద్య చికిత్స అందిస్తున్నారు.

ఆరు కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు ఆ ఆరుగురితో కలిసి ప్రయాణించిన వారి వివరాలను, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. కరోనా వైరస్ తో పోలిస్తే కొత్తరకం కరోనా 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే అధికారులు బ్రిటన్ కు విమానాల రాకపోకలను నిలిపివేయడంతో పాటు పలు రాష్ట్రాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

భారీగా కొత్తరకం కరోనా కేసులు నమోదైతే మళ్లీ లాక్ డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వినియోగించడం, ప్రయాణాలకు వ్యక్తిగత వాహనాలను వినియోగించడం, వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావడం ద్వారా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago