Tag Archives: bandi sanjay

Bandla Ganesh: జీవిత రాజశేఖర్ పొలిటికల్ ఎంట్రీ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న ట్వీట్!

Bandla Ganesh: బండ్ల గణేష్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. ఈయన సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్క పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంది. ఇకపోతే ఈయన చేసే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ నటి జీవిత రాజశేఖర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జీవిత రాజశేఖర్ సినీ ప్రస్థానం ఎలాంటిదో మనకు తెలిసిందే.ఇక ఏ విషయం గురించే అయినా జీవిత స్పందిస్తూ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపిన జీవిత తాజాగా బిజెపి తీర్థం పుచ్చుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం బండి సంజయ్ చేసిన పాదయాత్రలో భాగంగా జీవిత పాల్గొని అధిష్టానం తనకు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అదేవిధంగా కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైనటువంటి మంచి చేయలేదని కెసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా తెలంగాణలోని ప్రముఖ పబ్బులు క్లబ్ లలో కేటీఆర్ కు వాటా ఉందంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandla Ganesh: ఆదర్శ దంపతులు…

ఈ క్రమంలోనే జీవితం చేసిన ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా జీవిత రాజశేఖర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ… లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీని మర్చిపోయినట్టున్నారు… మన రాష్ట్రంలో ఎన్ని పార్టీ జెండాలు ఉన్నాయో అన్ని జెండాలు మెడలోనే వేసుకున్నారు ఆదర్శ దంపతులు అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ జీవిత రాజశేఖర్ గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ విషయంపై జీవిత స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Jeevitha Rajasekhar: తెలంగాణ ఎన్నికల పోటీపై షాకింగ్ కామెంట్స్ చేసిన జీవిత రాజశేఖర్..!

Jeevitha Rajasekhar: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా,దర్శకురాలిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జీవిత రాజశేఖర్ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల పోటీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సారధ్యంలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న జీవిత తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఈమె మాట్లాడుతూ తాను ఇద్దరు బిడ్డల తల్లిగా ఒక మహిళకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుందో మనందరికీ తెలిసిందే.అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశాన్ని కాపాడగలిగే వ్యక్తి అని తాను బిజెపి పార్టీలోకి చేరానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

ఈ క్రమంలోనే అధిష్టానం ఆదేశిస్తే తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని జీవిత వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో ఏ ప్రాంతం నుంచి అయినా తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని,పార్టీ తరఫున క్రియాశీలకంగా మారి పార్టీ కార్యక్రమాలకు తాను విధిగా హాజరవుతానని ఈ సందర్భంగా వెల్లడించారు.

Jeevitha Rajasekhar: బండి సంజయ్ కు మద్దతుగా జీవిత…

బీజెపీ పార్టీలోకి జీవిత రాజశేఖర్ బండి సంజయ్ కు మద్దతుగా తాను ఈ పాదయాత్రలో పాల్గొన్నానని ఈమె వెల్లడించారు. ఈ విధంగా తెలంగాణ రాజకీయాల గురించి నటి జీవిత రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఈమె కోరిక మేరకు వచ్చే ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున పోటీ చేయడానికి అధిష్టానం అనుమతి తెలుపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

బీజేపీ కార్పొరేటర్ పై దాడిని ఖండించిన బండి సంజయ్..

మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడిని ఖండించారు బీజేపీ అధ్యక్షుడు సంజయ్. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రవణ్ ను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన టిఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్రమాలను వెలికి తీసి రౌడీయిజాన్ని తొక్కి పడేస్తామని సంజయ్ హెచ్చరించారు.

కాగా పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొందరు టిఆర్ఎస్ నేతలు బిజెపి నేతలపై దాడులు చేశారు. ఈ దాడిలో కార్పొరేటర్ శ్రవణ్ తో పాటు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వీరిని ఆస్పత్రికి తరలించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పై సంజయ్ ఫైర్..

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారం కోసం.. విభజన చట్టంలోని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు నోటిఫై చేశారని వివరించారు. బోర్డుల సమావేశానికి కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులు హాజరయ్యారని.. కానీ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారని విమర్శించారు.

కాగా హైదరాబాదు జలసౌధాలో ఈఎన్సీ సమావేశానికి సీఎం కేసీఆర్ ఎందుకు కొట్టారు చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ అధికారులు సమావేశానికి కేసీఆర్ హాజరైతే ఏపీ ప్రాజెక్టుల పై నిలదీసే అవకాశం ఉండేదని.. ప్రాజెక్టుల ప్రయోజనాన్ని కాపాడుకుని వీలుండదని సంజయ్ స్పష్టం చేశారు.

ముందు విడాకులు..తర్వాత ప్రేమించుకోవడాలు అంటూ వైయస్ షర్మిల పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్వేత!

వైయస్సార్ తనయ వైఎస్ షర్మిల తాజాగా తెలంగాణలో కొత్త పార్టీని ఆవిష్కరించిన సంగతి మనకు తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వైయస్ రాజశేఖర్రెడ్డి పాలనను తిరిగి తీసుకురావడం కోసమే తాను పార్టీని ఆవిష్కరించాలని ఇదివరకే తెలియజేశారు. ఈ క్రమంలోనే”వైయస్సార్ తెలంగాణ పార్టీ”ని ఏర్పాటు చేస్తున్నట్లు, షర్మిల వెల్లడిస్తూ జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ మాట మాట్లాడితే కెసిఆర్ అవినీతికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని మాట్లాడుతారు. అయితే ఆ ఆధారాలను బయటపెట్టి కెసిఆర్ గారి పై చర్యలు తీసుకోవచ్చు కదా.కేంద్రంలో ఉన్నది బిజెపి ప్రభుత్వమే అయినప్పటికీ కేసీఆర్ అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు అంటూ ఆమె బండి సంజయ్ అని ప్రశ్నించారు.

కెసిఆర్ చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించిన ఆధారాలు బండి సంజయ్ దగ్గర ఉన్నప్పటికీ అవి బయట పెట్టకపోవడానికి గల కారణం వీరిద్దరి మధ్య ఒప్పందం ఉందని షర్మిల ఆరోపించారు.ఈ క్రమంలోనే వైయస్సార్ గురించి ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే కోట్ల మంది ఆయన అభిమానులు అసలు సహించరని వారిని పరిగెత్తించి కొడతారంటూ షర్మిల వార్నింగ్ ఇచ్చారు.

బిజెపి నాయకుడు బండి సంజయ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిలపై బిజెపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ ..బిజెపి మహిళా నాయకురాలు శ్వేతారెడ్డి షర్మిలకు భారీ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే షర్మిల వ్యక్తిగత విషయాలను తెరపైకి తీసుకువస్తూ ఆమెపై పలు ఆరోపణలు చేశారు. తెలంగాణలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశ్నించడానికి మీరు ఎక్కడికి వెళ్లారు…? పార్టీ పెట్టగానే తెలంగాణలో సమస్యలు గుర్తుకు వచ్చాయా? అంటూ షర్మిలను ప్రశ్నించారు.

అసలు కెసిఆర్ గారు, బండి సంజయ్ గారికి మధ్య ఎలాంటి డీల్స్ లేవు ఉన్నది మీకు కేసీఆర్ కంటూ ఆమె ఆరోపించారు.మీ మధ్య ఉన్న ఒప్పందం ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశంతోనే ముందుగానే మా నాయకుడిపై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాంటి అవసరం మా నాయకుడికి లేదు ఆయనకు ముందుగా విడాకులు తీసుకొని లోలోపలే ప్రేమించుకోవడం …కాపురాలు చేయడం తెలియని కెసిఆర్ మెడలు వంచడానికి బండి సంజయ్ అసలు సిసలైన వ్యక్తి అంటూ ఇంకోసారి మా నాయకుడు గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి అంటూ యాంకర్ శ్వేతారెడ్డి షర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజమౌళికి బండి సంజయ్ వార్నింగ్.. బరిగలతో కొట్టి చంపుతామంటూ..?

దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ నెల 22వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి రామరాజు ఫర్ భీమ్ టీజర్ విడుదల కాగా ఆ టీజర్ లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో కనిపించడంపై వివాదం తలెత్తింది. రాజమౌళి తెరకెక్కించిన గత సినిమాల్లోని కొన్ని సీన్లు సైతం వివాదాల పాలవగా అప్పట్లో ఆ వివాదాలను రాజమౌళి పరిష్కరించుకున్నారు. అయితే ఎన్టీఆర్ టోపీ పెట్టుకున్న వివాదం గురించి మాత్రం ఇప్పటివరకు రాజమౌళి స్పందించలేదు.

సినిమా కథలో భాగంగా కొంతకాలం ఎన్టీఆర్ అజ్ఞాతవాసం ఉంటారని అందువల్లే ఆ సమయంలో టోపీ ధరిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ భీమ్ కు టోపీ పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమౌళికి గుణపాఠం తప్పదని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైతే బరిగలతో కొట్టి చంపుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళికి దమ్ముంటే ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింకు కాషాయ కండువా వేసి సినిమా తీయాలని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.