Jeevitha Rajasekhar: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా,దర్శకురాలిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జీవిత రాజశేఖర్ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల పోటీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సారధ్యంలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న జీవిత తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఈమె మాట్లాడుతూ తాను ఇద్దరు బిడ్డల తల్లిగా ఒక మహిళకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుందో మనందరికీ తెలిసిందే.అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశాన్ని కాపాడగలిగే వ్యక్తి అని తాను బిజెపి పార్టీలోకి చేరానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
ఈ క్రమంలోనే అధిష్టానం ఆదేశిస్తే తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని జీవిత వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో ఏ ప్రాంతం నుంచి అయినా తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని,పార్టీ తరఫున క్రియాశీలకంగా మారి పార్టీ కార్యక్రమాలకు తాను విధిగా హాజరవుతానని ఈ సందర్భంగా వెల్లడించారు.
బీజెపీ పార్టీలోకి జీవిత రాజశేఖర్ బండి సంజయ్ కు మద్దతుగా తాను ఈ పాదయాత్రలో పాల్గొన్నానని ఈమె వెల్లడించారు. ఈ విధంగా తెలంగాణ రాజకీయాల గురించి నటి జీవిత రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఈమె కోరిక మేరకు వచ్చే ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున పోటీ చేయడానికి అధిష్టానం అనుమతి తెలుపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…