Actress Rambha: నటి కిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు నటి రంభ. ఈమె స్వస్థలం విజయవాడ ఈమె అసలు పేరు విజయలక్ష్మి.ఇలా తెలుగమ్మాయిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రంభ మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇకపోతే రంభ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఆగ్ర హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి తదితర హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా దాదాపు 7, 8 సంవత్సరాలు ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన రంభ కెనడాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో పడి అతనిని పెళ్లి చేసుకుంది.
ఈ విధంగా ఈ దంపతులు చాలా సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం.భార్య భర్తలన్న తర్వాత వారి మధ్య గొడవలు రావడం సర్వసాధారణం అయితే ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటే వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంతో గడిచిపోతుంది. కానీ తన భర్తతో వచ్చిన విభేదాల వల్ల రంభ ఏకంగా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన ఈమె ప్రతినెల భరణం కింద తనకు ఐదు లక్షల కావాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ఇలా ముగ్గురు పిల్లల పోషణ భారం అవుతుందని ఈమె మరికొంత డబ్బును కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ విధంగా రంభ విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమైందని తెలుసుకున్న ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు రంభతో మాట్లాడి తనకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరించారట. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లల పోషణ వారి భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా మారుతుందని చెప్పడమే కాకుండా భార్య భర్తల మధ్య ఈ చిన్నపాటి మనస్పర్ధలు సర్వసాధారణమే అని ఆయన నచ్చ చెప్పడం వల్ల రంభ విడాకులు వెనక్కి తీసుకుందని సమాచారం. ఇలా రాఘవేంద్రరావు రంభ వైవాహిక జీవితాన్ని నిలబెట్టారని తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…