ప్రస్తుతం డబ్బులు తీసుకోవాలన్నా.. డబ్బు డిపాజిట్ చేయాలన్నా.. బ్యాంక్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా అయింది. ఎందుకంటే.. అంతా డిజిటల్ మయం కాబట్టి. ఆన్ లైన్ లోనే అన్ని జరిగిపోతున్నాయి. అయితే ఆన్లైన్ లో అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులు భారీ నష్టాన్ని తీసుకురావచ్చు. అందులో ముఖ్యమైనది అమౌంట్ ట్రాన్సఫర్.
ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసేప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఒకటికి రెండు సార్లు… అకౌంట్ నంబర్ లేదా.. ఫోన్ నంబర్ ను సరిచూసుకోవాలి. లేదంటే, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో మనం చేసే చిన్న తప్పు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. కానీ, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుకు సంబంధించి బ్యాంక్ ను సంప్రదించి సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
మొదట నేరుగా మీ బ్యాంక్ కు వెళ్లి.. మీ వివరాలను బ్రాంచ్ మేనేజర్ కు అందించాలి. ఆ తర్వాత బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మీకు జరిగిన నష్టాన్ని గురించి అడిగి తెలుసుకుంటారు. ఏం జరిగిందో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. అతడు దానిని ఎలా రికవరీ చేయాలనే వివరాలను వివరంగా చెబుతారు. తర్వాత ప్రతీ దినం కస్టమర్ కేర్ సెంటర్ కి కాల్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది.
ఇలా రెండు మూడు రోజుల సమయం తర్వాత మనం తప్పుగా ఎంటర్ చేసిన అకౌంట్ నుంచి డబ్బులను మన అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేస్తారు. పొరపాటున వేరే అకౌంట్కు పంపిన మీ డబ్బును తిరిగి పొందేందుకు పై మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్ రాకుండా ఉండాలంటే.. ఐఎఫ్ఎస్సీ కోడ్ ను కూడా జాగ్రత్తగా సరి చూసుకోవాలి.
దేశంలోని సైబర్ మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ మోసాల వల్ల అమాయకుల బ్యాంక్ ఖాతాలలోని నగదు మాయమవుతోంది. చాలా సందర్భాల్లో మనం చేసే చిన్నచిన్న తప్పులే సైబర్ మోసాల బారిన పడటానికి కారణమవుతాయి. స్మార్ట్ ఫోన్లలో అనవరసమైన యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్నా సైబర్ మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కొన్ని మొబైల్ యాప్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోకూడదు. కొన్ని యాప్స్ మొబైల్స్ లో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. టీమ్ వ్యూయర్ , మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్ టాప్, అనీ డెస్క్ ఎయిర్ డ్రాయిడ్, ఎయిర్ మిర్రర్, క్రోమ్ రిమోట్ డెస్క్ టాప్, స్లాష్ టాప్ పర్సనల్ – రిమోట్ డెస్క్ టాప్ యాప్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్స్ లో ఇన్ స్టాల్ చేసుకోకూడదు.
పైన పేర్కొన్న యాప్స్ లో కొన్ని యాప్స్ వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ సైబర్ మోసగాళ్లు ఈ యాప్స్ సహాయంతో మన మొబైల్ లో డేటాను, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను తస్కరించే అవకాశం ఉంది. ఈ ఏడు యాప్స్ ద్వారా సైబర్ మోసగాళ్లు మనం స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లలో ఏం చేస్తున్నామో కూడా సులభంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి.
ఈ యాప్స్ వల్ల వన్ టైమ్ పాస్ వర్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలను పంచుకుని బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులను తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీ మొబైల్ ఫోన్లలో ఇప్పటికే ఈ యాప్స్ ఇన్ స్టాల్ అయి ఉంటే వీలైతే డిలేట్ చేయడం మంచిది. యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేయకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఎవరైతే ఓటుహక్కును వినియోగించుకోరో వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కట్ అవుతాయని ఆ వార్త సారాంశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, మీడియా ప్రతినిధులు ప్రజలను ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరుతున్న సంగతి తెలిసిందే.
ఈసీ సైతం ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగింకుకునేలా చర్యలు చేపడుతోంది. అయితే అధికారులు ఎంత ప్రయత్నించినా 100 శాతం పోలింగ్ మాత్రం ఎక్కడా నమోదు కావడం లేదు. ఇలాంటి తరుణంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని.. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోని పక్షంలో అకౌంట్ నుంచి 350 రూపాయలు కట్ అవుతాయని ఆ వార్త సారాంశం.
ఎన్నికల కమిషన్ ఈ విధంగా చేయబోతుందని ఒక న్యూస్ వెబ్ సైట్ ప్రచురించించింది. అయితే పీఐబీ వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని చెబుతోంది. ఓటు హక్కు వినియోగించుకోని వారి బ్యాంక్ అకౌంట్ నుంచి 350 రూపాయల కట్ చేస్తారని వైరల్ అవుతున్న వార్త ఫేక్ న్యూస్ అని ఇలాంటి వార్తలను నమ్మవద్దని పీఐబీ సూచించింది. వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మవద్దని కోరింది.
కొందరు కావాలనే ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు అమాయకులు సర్క్యులేట్ చేసే వార్తల వల్ల ఇతరులు సైతం ఆ వార్తలను నిజమని నమ్ముతున్నారు.
ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోవడంతో పాటు చాలామంది తమ బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమవుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ లో తమకు తెలియకుండానే నగదు కట్ అయిందని ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిజిటివ్ లావాదేవీలు ఏ విధంగా పెరిగాయో మోసపూరిత లావాదేవీలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
చాలామంది బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్టు సందేశాలు వచ్చిన వెంటనే ఏం చేయాలో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మోసపూరిత లావాదేవీల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే వెంటనే అకౌంట్ లావాదేవీలను క్యాన్సిల్ చేసుకోవాలి.
డబ్బులు కట్ అయిన లావాదేవీ గురించి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఖాతా నుంచి డబ్బులు కట్ అయిన విషయాన్ని తెలియజేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి. అనంతరం బ్యాంక్ బ్రాంచ్ లో సంప్రదించి డబ్బులు కట్ అయిన విషయం చెబితే వాళ్లు డబ్బులు కట్ కావడానికి గల కారణాన్ని తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరిస్తారు. బ్యాంక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వీలైనంత తక్కువ సమయంలో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది.
నగదు ఏ విధంగా డెబిట్ అయిందో తెలుసుకుని బ్యాంక్ అధికారులు వీలైనంత తక్కువ సమయంలో ఆ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తారు. ఖాతాలో నగదు కట్ అయిన వెంటనే ఏ మాత్రం టెన్షన్ పడకుండా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తే మంచిది.
దేశంలో ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమాయకులను టార్గెట్ చేసి సైబర్ మోసగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలో ఒక యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం వల్ల బ్యాంక్ ఖాతాలో 9 లక్షల రూపాయలు మాయమయ్యాయి. చేసిన చిన్న తప్పు వల్ల ఒక కుటుంబం బ్యాంక్ ఖాతాలోని నగదునంతా కోల్పోయి బాధ పడుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో అశోక్ మన్వతే నివశించేవారు. వృత్తిరిత్యా చిన్న వ్యాపారం చేసేవారు. అతని కొడుకు తరచూ అశోక్ ఫోన్ ను వినియోగించేవారు. అలా వినియోగిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి అతనికి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నానని పరిచయం చేసుకుని తన తండ్రి బ్యాంక్ ఖాతాలు ఫోన్ కు లింక్ అయినట్టు చెప్పాడు.
తాము క్రెడిట్ పరిమితిని పెంచుతామని అందుకోసం ఒక యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని కస్టమర్ కేర్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న వ్యక్తి చెప్పాడు. అతని మాటలను నిజమేనని నమ్మిన బాలుడు చెప్పిన ప్రకారం యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాడు. అనంతరం సాఫ్ట్ వేర్ సహాయంతో బాలుడి మొబైల్ ఫోన్ ను యాక్సెస్ చేసి ఖాతాలోని నగదు మాయం చేశాడు.
బాలుడు డౌన్ లోడ్ చేసుకున్న యాప్ రిమోట్ డెస్క్ టాప్ యాప్ అని సమాచారం. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రిమోట్ డెస్క్ టాప్ యాప్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net