దేశంలోని సైబర్ మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ మోసాల వల్ల అమాయకుల బ్యాంక్ ఖాతాలలోని నగదు మాయమవుతోంది. చాలా సందర్భాల్లో మనం చేసే చిన్నచిన్న తప్పులే సైబర్ మోసాల బారిన పడటానికి కారణమవుతాయి. స్మార్ట్ ఫోన్లలో అనవరసమైన యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్నా సైబర్ మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కొన్ని మొబైల్ యాప్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోకూడదు. కొన్ని యాప్స్ మొబైల్స్ లో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. టీమ్ వ్యూయర్ , మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్ టాప్, అనీ డెస్క్ ఎయిర్ డ్రాయిడ్, ఎయిర్ మిర్రర్, క్రోమ్ రిమోట్ డెస్క్ టాప్, స్లాష్ టాప్ పర్సనల్ – రిమోట్ డెస్క్ టాప్ యాప్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్స్ లో ఇన్ స్టాల్ చేసుకోకూడదు.
పైన పేర్కొన్న యాప్స్ లో కొన్ని యాప్స్ వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ సైబర్ మోసగాళ్లు ఈ యాప్స్ సహాయంతో మన మొబైల్ లో డేటాను, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను తస్కరించే అవకాశం ఉంది. ఈ ఏడు యాప్స్ ద్వారా సైబర్ మోసగాళ్లు మనం స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లలో ఏం చేస్తున్నామో కూడా సులభంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి.
ఈ యాప్స్ వల్ల వన్ టైమ్ పాస్ వర్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలను పంచుకుని బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులను తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీ మొబైల్ ఫోన్లలో ఇప్పటికే ఈ యాప్స్ ఇన్ స్టాల్ అయి ఉంటే వీలైతే డిలేట్ చేయడం మంచిది. యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేయకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…