దేశంలోని సైబర్ మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ మోసాల వల్ల అమాయకుల బ్యాంక్ ఖాతాలలోని నగదు మాయమవుతోంది. చాలా సందర్భాల్లో మనం చేసే చిన్నచిన్న తప్పులే సైబర్ మోసాల బారిన పడటానికి కారణమవుతాయి. స్మార్ట్ ఫోన్లలో అనవరసమైన యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్నా సైబర్ మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కొన్ని మొబైల్ యాప్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోకూడదు. కొన్ని యాప్స్ మొబైల్స్ లో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. టీమ్ వ్యూయర్ , మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్ టాప్, అనీ డెస్క్ ఎయిర్ డ్రాయిడ్, ఎయిర్ మిర్రర్, క్రోమ్ రిమోట్ డెస్క్ టాప్, స్లాష్ టాప్ పర్సనల్ – రిమోట్ డెస్క్ టాప్ యాప్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్స్ లో ఇన్ స్టాల్ చేసుకోకూడదు.
పైన పేర్కొన్న యాప్స్ లో కొన్ని యాప్స్ వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ సైబర్ మోసగాళ్లు ఈ యాప్స్ సహాయంతో మన మొబైల్ లో డేటాను, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను తస్కరించే అవకాశం ఉంది. ఈ ఏడు యాప్స్ ద్వారా సైబర్ మోసగాళ్లు మనం స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లలో ఏం చేస్తున్నామో కూడా సులభంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి.
ఈ యాప్స్ వల్ల వన్ టైమ్ పాస్ వర్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలను పంచుకుని బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులను తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీ మొబైల్ ఫోన్లలో ఇప్పటికే ఈ యాప్స్ ఇన్ స్టాల్ అయి ఉంటే వీలైతే డిలేట్ చేయడం మంచిది. యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేయకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…