ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్ లలో అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. గతేడాది ఈ స్కీమ్ ద్వారా 15,000 రూపాయలు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసిన జగన్ సర్కార్ ఈ ఏడాది 14,000 రూపాయలు జమ చేసింది. ఈ నెల 11వ తేదీన అర్హులైన విద్యార్థులు తల్లుల ఖాతాలలో నగదు జమైంది. జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్కీమ్ అమలు కోసం ఏకంగా 6,673 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
44 లక్షల 48 వేల మంది విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందారు. అయితే అన్ని అర్హతలు ఉన్నా కొంతమంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఈ స్కీమ్ నగదు జమ కాలేదు. నగదు జమ కాకపోవడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. అయితే జగన్ సర్కార్ స్కీమ్ కు అర్హులై నగదు జమ కాని వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్పందన హెల్ప్ లైన్ ద్వారా అమ్మఒడి స్కీమ్ కు అర్హత పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
1902 నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా అమ్మ ఒడి స్కీమ్ కు అర్హులైన వారు పొందుపరిచిన వివరాల్లో ఏ వివరాలైనా తప్పుగా నమోదై ఉంటే ఆ వివరాలను సరి చేసుకునే అవకాశం ఉంటుంది. హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయడం గురించి అవగాహన లేని వారు గ్రామ వాలంటీర్ లేదా గ్రామ సచివాలయం ద్వారా అమ్మఒడి స్కీమ్ వివరాలను సరి పోల్చుకుని ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.
విద్యార్థి ఐడీ నంబర్, విద్యార్థి ఆధార్ నంబర్, పాఠశాల డిస్ట్రిక్ట్ కోడ్ నంబర్, తల్లి లేదా సంరక్షకుని ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఫోన్ నంబర్ వివరాలను ఇవ్వడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…