Tag Archives: black fungus

క్రీమ్ ఫంగస్ అంటే ఏమిటి.. ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది.. ఎలా నివారించాలి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి దాడి చేస్తున్న నేపథ్యంలోనే కొందరు కరోనా నుంచి సురక్షితంగా బయట పడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ వివిధ రకాల ఫంగస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈ విధమైనటువంటి ఫంగస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా క్రీమ్ ఫంగస్ అనే కొత్త రకం వైరస్ బయటపడటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

క్రీమ్ ఫంగస్ అంటే ఐస్ క్రీమ్ తినడం వల్ల వస్తుందని భావించడం పొరపాటు. తాజాగా ఈ క్రీమ్ ఫంగస్ మధ్యప్రదేశ్,జబల్పూర్‌ జిల్లాలో… ఓ పేషెంట్‌లో గుర్తించారు. అదే పేషెంట్‌కి ఆల్రెడీ కరోనా సోకింది. బ్లాక్ ఫంగస్ కూడా సోకింది. ప్రస్తుతం అతనిలో క్రీమ్ ఫంగస్ బయటపడటంతో అతను సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీలోని ENT డిపార్ట్‌మెంట్‌లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో కొన్ని వందల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి.

బ్లాక్ ఫంగస్ కరోనా సోకిన వారికి చికిత్సలో భాగంగా అధిక మొత్తంలో యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల వారి శరీరంలో కరోనా వైరస్ తగ్గటంతో పాటు మన శరీరంలో మనకు రక్షణ కలిగించే బ్యాక్టీరియాలు సైతం నశించి పోతున్నాయి. ఈ క్రమంలోనే మనం వివిధ రకాల రోగాల బారిన పడుతున్నాము. మన శరీరంలోని ప్రేగులలో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అన్ని కణాలకు శక్తిని అందిస్తుంది.వ్యాధికారక బ్యాక్టీరియాలు మన శరీరం పై దాడి చేసినప్పుడు ఆ బ్యాక్టీరియాతో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియాలు వాటిని నాశనం చేస్తాయి.

ప్రస్తుతం కరోనా చికిత్సలో భాగంగా అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఈ ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా నశించిపోయి మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ప్రో బ్యాక్టీరియా అధికంగా పెరుగు మజ్జిగలో ఉంటుంది. మన శరీరంలో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియాను అభివృద్ధి చేసుకోవాలంటే తప్పనిసరిగా రోజుకు రెండుసార్లు పెరుగు లేదా మజ్జిగతో భోజనం చేయాలని, దీని ద్వారా ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియాను అభివృద్ధి చేసుకొని రోగనిరోధక శక్తిని మెరుగు పరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం వ్యాపిస్తున్న క్రీమ్ ఫంగస్ అంటే ఏమిటి అనే దాని పై డాక్టర్లు పూర్తి అవగాహనకు రాలేదు. అయితే ఇది ఇతర ఫంగస్ ల కంటే ప్రమాదకరమైనదని కనుక ప్రతి ఒక్కరు వీలైనంతవరకు వారి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం ప్రయత్నించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

హర్యానాలో బ్లాక్ ఫంగస్ విలయ తాండవం.. ఒక్కరోజులోనే 18 మంది మృతి!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి కేసులు పెరుగుదల కొంతమేర తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకునే లోపే బ్లాక్ ఫంగస్ విలయతాండవం చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న మని ఆనందం కూడా లేకుండా బాధితులను బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది.ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

దేశంలోనే అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా తరువాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటలలో హర్యానాలో అత్యధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, ఏకంగా ఈ ఫంగస్ బారిన పడి 18 మంది మృతి చెందారు. హర్యానాలో కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఇంజక్షన్ లతోపాటు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్లు కూడా కొరత ఏర్పడటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రానికి 66 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లు ఆర్డర్ చేయగా కేవలం ఐదు శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలిపారు.బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్సలో వాడే యాంటీ-ఫంగల్ ఔషధం ‘అంపోటెరిసిన్‌ బి లిపోజమ్‌’ హరియాణాలో తగినంత అందుబాటులో లేకపోవడంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్ ఫంగస్ గుర్తించిన వెంటనే యాంటీ ఫంగల్ ఔషధం
‘అంపోటెరిసిన్‌ బి లిపోజమ్‌’రోజుకు నాలుగు సార్లు ఇవ్వడం ద్వారా ఈ ఫంగస్ నుంచి తొందరగా కోలుకో వచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే తీవ్రమైన మందుల కొరత ఏర్పడటంతో ఔషధాన్ని కేవలం రోజుకు రెండుసార్లు మాత్రమే బాధితులకు అందివ్వాలని హర్యానా నిపుణుల కమిటీ గత రెండు రోజుల క్రితం సూచించింది. అయితే ఈ నిర్ణయం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 25వ తేదీ వరకు హర్యానా రాష్ట్రానికి 1,110 అంపోటెరిసిన్-బి అందజేశామని కేంద్రం తెలిపింది.

యెల్లో ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ లకు తేడా ఏమిటో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వ్యాప్తి చెందడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు బ్లాక్ వైట్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కొన్ని వందల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా యెల్లో వైరస్ ప్రజలను మరింత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫంగస్‌తో చికిత్స పొందుతున్నాడు.యెల్లో ఫంగస్ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ తరహాలోనే ఇతరులకు వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు హెచ్చరిస్తున్నారు.

యెల్లో ఫంగస్ ను మ్యూకర్ సెప్టిక్ అని అంటారు. అంటే శ్లేష్మం వల్ల ఏర్పడే చీము. వాస్తవానికి ఇది బల్లుల్లో ఏర్పడే సమస్య. బ్లాక్ ఫంగస్ తరహాలోనే యెల్లో ఫంగస్ కూడా కరోనా చికిత్సలో భాగంగానే ఏర్పడుతుంది. కరోనా చికిత్సలో ఎక్కువభాగం స్టెరాయిడ్స్ వాడటం, సురక్షితమైన నీటితో ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్లే వ్యాప్తి చెందుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఈ ఫంగస్ మన శరీరంలో ఏర్పడినప్పుడు ఆకలి లేకపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, కళ్లు ఉబ్బినట్లు కనిపించడం వంటి లక్షణాలు తలెత్తుతాయి. అదేవిధంగా కొందరిలో గాయాలు ఏర్పడి అవి ఎన్ని రోజులకు నయం కాకపోవడం, గాయాల నుంచి చీము ఏర్పడటం అవయవాల పనితీరు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనబడగానే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలి.

యెల్లో ఫంగస్, బ్లాక్, వైట్ ఫంగస్‌లు పరిశుభ్రత మీదే ఆధారపడి ఉంటుంది. వైరస్ సోకిన రోగులు లేదా, వైరస్ లక్షణాలతో బాధపడే వ్యక్తులు పరిశుభ్రత పాటించకపోవటం వల్ల మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా కరోనా వైరస్ బారిన పడినప్పుడు అందించే ఆక్సిజన్ సిలిండర్ లను పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేయకపోవడం వల్ల కూడా ఈ విధమైనటువంటి ఫంగస్ వ్యాప్తి చెందుతుందని,తక్కువ నిరోధక శక్తి కలిగి, బలహీనంగా ఉన్నవారిలో ఈ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

బ్లాక్ ఫంగస్ రోగులకు బెడ్స్ లేవు.. వైద్యం చెయ్యం!

దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా ప్రళయం సృష్టించగా, మరొకవైపు బ్లాక్ ఫంగస్ విలయతాండవం చేస్తుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరగడంతో నోడల్ కేంద్రమైన కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో 200 పడకలు కేటాయించారు. మరికొన్ని అదనపు పడకలు వేయడంతో ఇప్పటికే 218 మంది ఇందులో చేరారు. సోమవారం ఒక్కరోజు మాత్రమే అత్యవసర చికిత్సా విభాగంలో 31 మందిని ఆస్పత్రిలో చేర్చుకున్నట్లు వైద్య అధికారులు తెలియజేశారు.

బ్లాక్ ఫంగస్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఆస్పత్రిలో పడకలు లేక ఎంతో మంది వెను తిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరడంతో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

బ్లాక్ ఫంగస్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగించే లైపోసోమల్‌ యాంఫోటెరిసిన్‌-బి, ఫొసకానజోల్‌, డీఆక్సీ కొలైట్‌ తదితర ఇంజక్షన్లకు కొరత నెలకొంటోంది. అదేవిధంగా ఆస్పత్రిలో పడగల సౌకర్యం లేకపోవడంతో ఎంతో మందికి మందులు రాసిచ్చి ఇంటికి పంపుతున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాపించడంతో నగర శివారు ప్రాంతాల్లోని ప్రజలు చికిత్సకోసం నగరానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో పడకలకు ఇబ్బంది తప్పడం లేదు. 

ఈ విధంగా బ్లాక్ ఫంగస్ కేసులు అధికమవుతున్న తరుణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర వైద్య కళాశాల్లోని అనుబంధ ఈఎన్‌టీ విభాగాల్లో బాధితులకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంపై అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు మొదట్లోనే గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తలెత్తదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుందో తెలుసా? ఆ తప్పులు చెయ్యడం వల్లే తలనొప్పులు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ కూడా వెంటాడుతోంది.కరోనా నుంచి కోలుకొని బయటపడిన వారిలో బ్లాక్ ఫంగస్ తీవ్రరూపం దాలుస్తోంది.బ్లాక్ ఫంగస్ కారణంగా ఎంతో మంది కంటిచూపును కోల్పోతున్నారు. మరి కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఉన్నఫలంగా కరోనా బాధితులలో బ్లాక్ ఫంగస్ ఏర్పడడానికి గల కారణాలు ఏమిటని పరిశోధకులు అధ్యయనాలు ప్రారంభించారు.

ఈ అధ్యయనంలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహాత్మాగాంధీ స్మారక వైద్య కళాశాలలో మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వీపీ పాండే బ్లాక్ ఫంగస్ రోగులపై అధ్యయనాలు నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా 100% బాధితులు యాంటీబయాటిక్స్‌ తీసుకున్నట్లు అధ్యయనంలో తేలిందనే విషయాన్ని రాజీవ్‌ జయదేవన్‌ అనే వైద్యుడు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

కరోనా సోకిన సమయంలో కరోనా నుంచి విముక్తి పొందడం కోసం అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్లే కరోనా నుంచి కోలుకున్న తరువాత వారిలో బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని ప్రొఫెసర్ పాండే తెలిపారు. మధుమేహ సమస్యలతో బాధపడేవారిలో ఎక్కువ భాగం స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ కి దారితీస్తుందని తెలియజేశారు.

కరోనా మహమ్మారి బారిన పడిన వారికి చికిత్సలో భాగంగా అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, కార్బాపెనెమ్స్‌ వంటి యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అధికస్థాయిలో పెరిగిందని, ఈ విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరగడానికి గల కారణం యాంటీబయాటిక్స్ కారణమని జయదేవన్‌ అభిప్రాయపడ్డారు.

‘బ్లాక్ ఫంగస్’కు ఆయుర్వేద మందు.. అది వస్తే అసలు మనిషి బతుకుతాడా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ఎంతటి తీవ్ర రూపం దాలుస్తుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనాతో జయించి బయట పడినప్పటికీ, బ్లాక్ ఫంగస్ బారినపడి, కంటి చూపు కోల్పోవడం, మరికొందరు ఈ ఫంగస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే దేశమంతటా రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

కరోనా నుంచి కోలుకున్న వారిలో తీవ్ర ముప్పుగా పరిగణించిన ఈ బ్లాక్ ఫంగస్ ను ఆయుర్వేద చికిత్సా విధానంతో పూర్తిగా నయం చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులు సరైన చికిత్స తీసుకోవటం వల్ల ఈ ఫంగస్ నుంచి బయట పడవచ్చు అని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు ఎం.శ్రీనివాస్‌నాయక్‌ తెలియజేశారు.

బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో లక్షణాలు కనిపించిన వెంటనే ఆయుర్వేద నిపుణులను సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలో రెండు పద్ధతులలో మందులు వాడితే ఈ వ్యాధి నుంచి బయట పడవచ్చు. మొదటి ఈ చికిత్సా విధానంలో భాగంగా గంధక రసాయనం మాత్రలు భోజనం తర్వాత రెండు రోజులు వాడాలి.ఖదిరాదివతి మాత్రలు భోజనానికి ముందు రెండు రోజులు వాడాలి.పంచతిక్త గుగ్గులువృతము 10 గ్రాములు గోరువెచ్చని పాలలో భోజనానికి ముందు తాగాలి. అదేవిధంగా మృత్యుంజయ రసం రెండు మాత్రలు రోజుకు మూడు సార్లు వేసుకోవాలి.

రెండో చికిత్స విధానంలో భాగంగా ఆరోగ్యవర్ధనీవతి  మాత్రలు 2 భోజనం తర్వాత వేసుకోవాలి. విషతుందుకవతి రెండు మాత్రలు మూడు సార్లు భోజనం తర్వాత వాడాలి.టంకణభస్మం ఒక గ్రాము గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి.   ఈ విధమైన చికిత్సా విధానాల ద్వారా బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడవచ్చని డాక్టర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. అయితే ఈ మందులు కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని ఆయన తెలిపారు.

బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వారికే వస్తుందట.. జాగ్రత్త వహించండి..!!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ గురించి తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, బ్లాక్ ఫంగస్ అంటూ మరొక వ్యాధి ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ బ్లాక్ ఫంగస్ వివిధ రాష్ట్రాలలో నమోదయ్యి తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి మహారాష్ట్రలో 90 మంది మరణించారు. బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కరోనా బారినపడి కరోనా నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా కరోనా బారినపడి కోలుకున్న మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రత అధికంగా ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. మ్యుకర్‌మైకోసెస్ అనే బ్లాక్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ లేదా ఊపిరితిత్తులని ఎఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్టర్, స్కిన్ మరియు ఇతర ఆర్గాన్ సిస్టమ్ కూడా ఈ ఫంగస్ బారిన పడే అవకాశం ఉంది.

బ్లాక్ ఫంగస్ వ్యాపించిన వారిలో ఎక్కువగా ముక్కు నుంచి రక్తం, నల్లటి ద్రావణం కారుతుంది. అదే విధంగా కన్ను, బుగ్గలపై వాపును కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నోరు తెరవడానికి కష్టంగా ఉండటం, కన్ను సరిగా కనిపించక పోవడం వంటివి జరుగుతాయి.ఈ బ్లాక్ ఫంగస్ మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వ్యాపిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మధుమేహంతో బాధపడే వారు కరోనా బారిన పడి కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారి శరీరంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయిలో లేకుండా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి బ్లాక్ వ్యాపిస్తుందని, అందుకోసమే కరోనా నుంచి కోలుకున్న తర్వాత పదే పదే మన బ్లడ్ షుగర్ లెవల్స్ ను పరీక్షించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా బారిన పడిన వారిలో ఎక్కువగా స్టెరాయిడ్, యాంటీ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల ఈ విధమైనటువంటి బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని, మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదిస్తూ వారి సూచనల మేరకే మందులు ప్రయోగించాలని అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఆర్గాన్ ట్రాన్ ప్లాంట్ చేసి ఉంటారో అలాంటి వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని, వారిలో కూడా బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

వామ్మో.. వైట్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఎంతటి ప్రళయం సృష్టిస్తుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవించగా, లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.ఈ విధంగా కరోనా బారిన పడిన వారు ఏదో విధంగా బతికి బయట పడుతుంటే వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో కొత్త వ్యాధి వెంటాడుతుంది. ఈ బ్లాక్ ఫంగస్ వల్ల కొందరు కళ్ళు కోల్పోవడంతో పాటు మరణిస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలలో ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వ్యాధి వల్ల ఇప్పటికే ప్రజల్లో తీవ్ర భయాందోళన చెబుతున్న నేపథ్యంలో తాజాగా మరో వ్యాధి ప్రజలలో తీవ్ర కలకలం రేపుతోంది.

తాజాగా బీహార్ లో వైట్ ఫంగస్ కేసు నమోదు కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదివరకే నమోదైన బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సోకిన వారిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే వైద్యులు మరికొన్ని పరీక్షలు నిర్వహించగా వారిలో వైట్ ఫంగస్ గుర్తించినట్లు పట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రి, మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఎస్‌ఎస్ సింగ్ తెలిపారు. ఈ క్రమంలోనే నలుగురికి వైట్ ఫంగస్ సోకినట్లు ఆయన తెలిపారు.

సాధారణంగా వైట్ ఫంగస్ కరోనా బారిన పడి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనూ, షుగర్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో ఈ విధమైనటువంటి వైట్ ఫంగస్ తొందరగా సోకే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. వైట్ ఫంగస్ సిటి స్కాన్, ఎక్స్రే వంటి పరీక్షలు చేయడం ద్వారా గుర్తించవచ్చని వైద్యులు తెలిపారు.

కరోనా బారిన పడిన వారికి అందించే చికిత్సలో ఎక్కువ భాగం స్టెరాయిడ్లు ఉపయోగించడంతో పాటు అధిక నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ విధమైనటువంటి వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం కోసం ఎక్కువగా కులాయి నీళ్లు ఉపయోగిస్తున్నారు. కులాయి నీళ్లలో వైట్ ఫంగస్ ఉంటే అది ఊపిరితిత్తులకు చేరి ఇన్ఫెక్షన్ కి కారణమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.