Tag Archives: CM Jagan

గ్రామాలను యూనిట్గా తీసుకుని వ్యాక్సిన్ వేయాలి_ సీఎం జగన్

ఏపీలో కోవిడ్ పరిస్థితుల పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని జగన్‌ అధికారులను సూచించారు. ఉపాధ్యాయులు సహా ప్రభుత్వ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ త్వరగా చేయాలన్నారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకొని వ్యాక్సిన్​ వేయాలని ఆదేశించారు.

కాగా ఆధార్‌కార్డు నంబర్‌తో ఆరోగ్యశ్రీ కార్డులను లింక్‌చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. గ్రామాల నుంచి ఆసుపత్రుల వరకు సిబ్బంది నియామకం జరగాలని సూచించారు.

సీఎం జగన్ పై టిడిపి నేత అనురాధ ఫైర్!

ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ. గతంలో నేతన్నలకు రూ.50వేలకు పైబడి పథకాలు, సబ్సిడీలు అందేవన్నారు. సీఎం జగన్ వాటిని రద్దు చేసి.. నేతన్న నేస్తం పేరుతో రూ. 24వేలు అందిస్తూ చేనేత కార్మికులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు ఉంటే.. కేవలం 80 వేల మందికి సహాయం అందుతుందని పేర్కొన్నారు.

జగన్ ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో హడావుడి చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తుందని అనురాధ ఆరోపించారు. చేనేత రంగానికి ఊతమివ్వాలంటే.. పని చేసే వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సాయాన్ని పునరుద్ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. పింఛన్ పెరిగేది ఎప్పుడంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పింఛన్ ఎప్పటినుంచి పెరుగుతుందనే అంశం గురించి స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,250 రూపాయలు పింఛన్ ఇస్తున్నామని ఆ పింఛన్ ను 2,500 రూపాయలకు పెంచుతున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధాప్య పింఛన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించామని సీఎం చెప్పారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో పింఛన్ పెంపు జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల ముందు వైసీపీ మేనిఫెస్టోలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పింఛన్ పెంచుకుంటూ పోతామని పేర్కొందని ఆ హామీ ప్రకారం పింఛన్ ను పెంచుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంచామని మళ్లీ జులై 8 2021న పింఛన్ పెంపు ఉంటుందని తెలిపారు.

గత ప్రభుత్వం 44 లక్షల మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేసిందని తమ ప్రభుత్వం 61 లక్షల మందికి పింఛన్ ఇస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. సీఎంగా పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశానని అప్పటినుంచి రాష్ట్రంలో 2,250 రూపాయల పింఛన్ పంపిణీ జరుగుతోందని జగన్ పేర్కొన్నారు.

మళ్లీ 2021 సంవత్సరం జులై 8వ తేదీ తరువాత నుంచి 2,500 రూపాయల పింఛన్ ఇస్తామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై జగన్ అసెంబ్లీలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదే పదే అబద్దాలు చెబుతూ సభను నిమ్మల రామానాయుడు తప్పుదారి పట్టిస్తున్నాడని పేర్కొన్నారు.

సీఎం జగన్ కీలక నిర్ణయం.. రూ. 10 వేలు రానివాళ్లు ఏం చేయాలంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని జగనన్న తోడు స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా వీధివ్యాపారులకు 10,000 రూపాయలు అందించింది.

అయితే కొందరు జగనన్న తోడు పథకానికి అర్హులైనా 10,000 రూపాయలు పొందలేదని సీఎం జగన్ దృష్టికి వచ్చింది. దీంతో సీఎం జగన్ 10,000 రూపాయలు అందని వాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులై లబ్ధి పొందలేని చిరు వ్యాపారులు మరోసారి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ స్కీమ్ లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డ్ సచివాలయాలలో పొందుపరిచింది.

సహాయం, ఫిర్యాదుల కొరకు 1902 నంబర్ కు కాల్ చేయమని అధికారులు సూచించారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది. ఎవరైతే అర్హత ఉండి దరఖాస్తు చేస్తారో వాళ్లకు నెలరోజుల్లో ఖాతాల్లో నగదు జమ చేయడానికి సిద్ధమవుతోంది. అర్హులైన చిరువ్యాపారులు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు.

చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తూ ఉండటం గమనార్హం. జగన్ సర్కార్ ఈ పథకం అమలు చేయడంపై చిరువ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం అమలు ద్వారా తమకు ప్రయోజనం చేకూరుతోందని చెబుతున్నారు.

పేదలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఇళ్ల పట్టాల పంపిణీ ఎప్పుడంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఇళ్లు లేని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. పేద ప్రజలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. డిసెంబర్ నెల 25వ తేదీన రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అనేకసార్లు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడగా ఈసారి ఖచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

కోర్టులో ఇళ్ల పట్టాల పంపిణీ గురించి పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం కోర్టు స్టే ఉన్న ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. జగన్ ఈ సమావేశంలో లబ్ధిదారులకు డి ఫామ్ పట్టా ఇచ్చి ఇళ్లస్థలాలను కేటాయించాలని చెప్పారు. రాష్ట్రంలో పట్టాలు ఇచ్చిన రోజే ఇళ్ల నిర్మాణం కూడా మొదలు కానుంది.

ప్రభుత్వం దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుండగా తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. జగన్ సర్కార్ మొదట మార్చి 25వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ అమలు చేయాలని భావించింది. అయితే అప్పుడు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వల్ల ఎన్నికల కోడ్ అమలు కావడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఆ తరువాత అంబేద్కర్ జయంతి, వైఎస్సార్ జయంతి, స్వాతంత్ర దినోత్సం, గాంధీ జయంతి సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది.

ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. జగన్ సర్కార్ సొంతింటి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో కోర్టు తుది తీర్పుకు అనుగుణంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. 2021 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు విడుదల చేశారు. న్యాయశాఖ, సాంస్కృతిక పర్యాటక శాఖ, యువజన సర్వీసులు, కుటుంబ సంక్షేమం, వైద్యం, ఆరోగ్యం, పాఠశాల, ఉన్నత విద్యాశాఖల్లోని కాంట్రాక్ట్ సర్వీసులను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గడువును పొడిగించటంతో పాటు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగా వేతనాలను చెల్లిస్తారో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అదే విధంగా చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను జీతాల విషయంలో ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు.

పర్మినెంట్ ఉద్యోగులకు ఏ విధంగా సామాజిక, ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అదే విధంగా సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించడం కోసం అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అధ్యయనం అనంతరం తనకు పూర్తి వివరాలను అందజేయాలని జగన్ అధికారులకు చెప్పారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా సీఎం జగన్ మాత్రం అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.

సీఎం జగన్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు లాయర్… ఏం జరిగిందంటే..?

సుప్రీంకోర్టు లాయర్ అశ్వినికుమార్ ఉపాధ్యాయ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. సీఎం జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్ ను దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో అశ్వినికుమార్ జగన్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జగన్ 31 కేసులలో నిందితునిగా ఉన్నారని.. జగన్ కోర్టులు, న్యాయమూర్తులను బెదిరించే విధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.

చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను బహిరంగ లేఖను బహిరంగపరచడం కోర్టు ధిక్కార చర్యగా పేర్కొన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని అశ్వినీ కుమార్ చీఫ్ జస్టిస్ ను కోరారు. ప్రస్తుతం అశ్వినికుమార్ రాసిన లేఖ గురించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు కొన్ని రోజుల క్రితం అశ్వినీకుమార్ ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను వేగంగా పరిష్కరించాలని కోరుతూ ఒక పిల్ ను దాఖలు చేశారు.

జస్టిస్ ఎన్వీ రమణ ఎవరైతే రాజకీయ నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని.. సీఎం జగన్ ప్రజా ప్రతినిధులపై కేసులపై కేసులను వేగంగా పరిష్కరించాలన్న తీర్పు వల్ల ఆగ్రహం ఉండవచ్చని తెలిపారు. జగన్, ఆయన సహచరులు తీవ్ర నేరారోపాలను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఏడీఆర్ నివేదిక ద్వారా ఈ విషయాలు తెలిశాయని పేర్కొన్నారు.

జగన్ పై నమోదైన కేసులు ప్రూవ్ అయితే ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుందని.. ప్రస్తుత లేఖ ప్రభావం జగన్ పై దాఖలైన కేసుల్లో తీర్పు చెప్పే న్యాయమూర్తులపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. సీఎం జగన్ న్యాయవ్యవస్థకు బెదిరింపులకు పాల్పడినప్పట్టుగానే జరిగిన ఘటనలను పరిగణించాలని తెలిపారు. అయితే అటార్నీ జనరల్ ఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం జగన్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. దసరా పండుగ సమయంలో ఉద్యోగులకు తీపికబురు అందించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో లాక్ డౌన్ అమలు వల్ల ఏపీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. కొన్ని రోజుల క్రితమే లాక్ డౌన్ సమయంలో కోత విధించిన జీతాలను తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది.

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి నిన్న సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకోగా అడిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు వచ్చే నెలలో ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి జగన్ కరోనా సోకిన ఉద్యోగులకు నెల రోజుల పాటు స్పెషల్ లీవ్ ఇవ్వాలని.. ఉద్యోగులకు రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలం ఇవ్వాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ఈ నిర్ణయాల పట్ల జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం అందుతోంది. పీఆర్సీ, సీపీఎస్ అమలు విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం. సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మహిళా ఉద్యోగులకు 5 రోజుల సెలవులు ఇవ్వాలని, నాలుగో తరగతి ఉద్యోగుల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని.. ఉద్యోగులకు సౌకర్యాలు, రాయితీలు పెంచాలని కోరామని తెలిపారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. సీఎం ఎన్జీవో సంఘం అధ్యక్షుడి వినతులకు అనుకూలంగా స్పందించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.