General News

ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం జగన్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. దసరా పండుగ సమయంలో ఉద్యోగులకు తీపికబురు అందించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో లాక్ డౌన్ అమలు వల్ల ఏపీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. కొన్ని రోజుల క్రితమే లాక్ డౌన్ సమయంలో కోత విధించిన జీతాలను తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది.

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి నిన్న సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకోగా అడిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు వచ్చే నెలలో ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి జగన్ కరోనా సోకిన ఉద్యోగులకు నెల రోజుల పాటు స్పెషల్ లీవ్ ఇవ్వాలని.. ఉద్యోగులకు రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలం ఇవ్వాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ఈ నిర్ణయాల పట్ల జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం అందుతోంది. పీఆర్సీ, సీపీఎస్ అమలు విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం. సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మహిళా ఉద్యోగులకు 5 రోజుల సెలవులు ఇవ్వాలని, నాలుగో తరగతి ఉద్యోగుల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని.. ఉద్యోగులకు సౌకర్యాలు, రాయితీలు పెంచాలని కోరామని తెలిపారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. సీఎం ఎన్జీవో సంఘం అధ్యక్షుడి వినతులకు అనుకూలంగా స్పందించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

5 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

6 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

14 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

14 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

15 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago