General News

గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలు ఎప్పుడంటే..?

ఏపీలో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నెల రోజుల క్రితం పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 16,208 ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వెలువడగా పరీక్షలు జరిగాయి. పది లక్షలకు పైగా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయగా 7 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరున పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అధికారులు ఇప్పటికే ఆన్సర్ షీట్ల స్కానింగ్ అభ్యర్థుల వారీగా మార్కుల ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఔస్ట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలలో 15 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మొదట ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్నట్టు కొందరు పేర్కొనకపోవడంతో వాళ్ల వివరాలను సేకరించడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.

మరోవైపు ఈసారి గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలకు ఫలితాలతో పాటు ర్యాంకులను కూడా ప్రకటించనున్నారు. మొత్తం 14 రకాల రాత పరీక్షలు జరగగా ప్రతి ఒక్కరికీ ర్యాంకులను ప్రకటించునున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకులను అధికారులు ప్రకటించనున్నారు. గత నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గ్రామ, వార్డ్ సచివాలయాల రాత పరీక్షలు జరిగాయి.

19 కేటగిరీలలోని ఉద్యోగాల కోసం ఏడు రోజుల పాటు పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు ఉండగా ఆ ఉద్యోగాలలో 1,10,520 పోస్టులు ఇప్పటికే భర్తీ కాగా 16,208 ఉద్యోగాలను ప్రభుత్వం భరీ చేయనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago