Featured

సీఎం జగన్ కీలక నిర్ణయం.. రూ. 10 వేలు రానివాళ్లు ఏం చేయాలంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని జగనన్న తోడు స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా వీధివ్యాపారులకు 10,000 రూపాయలు అందించింది.

అయితే కొందరు జగనన్న తోడు పథకానికి అర్హులైనా 10,000 రూపాయలు పొందలేదని సీఎం జగన్ దృష్టికి వచ్చింది. దీంతో సీఎం జగన్ 10,000 రూపాయలు అందని వాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులై లబ్ధి పొందలేని చిరు వ్యాపారులు మరోసారి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ స్కీమ్ లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డ్ సచివాలయాలలో పొందుపరిచింది.

సహాయం, ఫిర్యాదుల కొరకు 1902 నంబర్ కు కాల్ చేయమని అధికారులు సూచించారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది. ఎవరైతే అర్హత ఉండి దరఖాస్తు చేస్తారో వాళ్లకు నెలరోజుల్లో ఖాతాల్లో నగదు జమ చేయడానికి సిద్ధమవుతోంది. అర్హులైన చిరువ్యాపారులు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు.

చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తూ ఉండటం గమనార్హం. జగన్ సర్కార్ ఈ పథకం అమలు చేయడంపై చిరువ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం అమలు ద్వారా తమకు ప్రయోజనం చేకూరుతోందని చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago