Tag Archives: contestant

బ్రేకింగ్.. హౌస్ నుంచి రూ.25 లక్షలు తీసుకొని బయటకు వచ్చిన కంటెస్టెంట్.. !

మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 5 సీజన్ ముగియబోతోంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమైంది. అయితే టాప్ 5 కంటెస్టెంట్ల మధ్య పోటీ రసతవత్తరంగా ఉంది. ముఖ్యంగా సన్నీ, షణ్ముఖ్ మధ్యే పోటీ ఉంటుందని అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే .. బిగ్ బాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

గెలుపు సంగతి అటుంచితే.. అందర్ని షాకింగ్ కు గురిచేస్తూ ఓ కంటెస్టెంట్ రూ. 25 లక్షలు తీసుకుని టైటిల్ రేస్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. గత సీజన్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. గత సీజన్ లో అభిజిత్, అఖిత్, సోహైల్, అరియానా, హారికలు టాప్ 5 కంటెస్టెంట్లుగా పోటీలో ఉన్నారు. అయితే ఈ సీజన్ లో హరిక 5వస్థానంలో, 4వస్థానంలో అరియానా నిలిచారు. అభిజిత్, సోహైల్, అఖిల్ మధ్య పోటీ నెలకొంది. ఈ సమయంలోనే నాగార్జున ఎవరిపైనా నమ్మకం లేదో వారు రూ. 25 లక్షలు తీసుకుని బయటకు వచ్చేయచ్చు అని చెప్పారు.

దీంతో సోహైల్ ఈ డీల్ కు ఒప్పుకుని బయటకు వచ్చాడు. ఈ సీజన్ లో అభిజిత్ విన్నర్ గా నిలువగా… అఖిల్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఈసారి కూడా ఇలాగే డీల్ కుదుర్చుకుని పోటీనుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి నాగర్జున ఆఫర్ ను సింగర్ శ్రీరామ్ చంద్ర తీసుకున్నట్లు వినికిడి. సిరి, మానస్ 4,5 స్థానాలతో ఎలిమినేట్ కాగా… టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ పోటీపడ్డారట. కాగా ఇంకొన్ని గంటల్లో విన్నర్ ఎవరో తెలియబోతోంది. అయితే ఈసారి సన్నీ విన్నర్ గా నిలుస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

షణ్ముఖ్ రెండో స్థానంలో నిలిచారని తెలుస్తోంది. అయితే సిరి వ్యవహారంతో షన్నూ వెనకపడినట్లు ఆడియన్స్ అభిప్రాయం. ఇదిలా ఉంటే గ్రాండ్ ఫినాలేను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈకార్యక్రమానికి గెస్ట్ లుగా ట్రిపుల్ ఆర్ టీం రామ్ చరన్, అలియాభట్ రానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్యాం సింగరాయ్ టీం నాని, సాయిపల్లవి కూడా వస్తున్నారని తెలుస్తోంది.

చనిపోడానికి రైల్వే ట్రాక్ వరకు వెళ్లిన జబర్దస్త్ కంటెస్టెంట్స్..!

మనస్సుకు ప్రశాంతంగా ఉండాలంటే దాదాపు చాలామంది చూసే ప్రోగ్రాం జబర్దస్త్. అంతగా అందులో కామెడీ ఉంటుంది. నవ్వుల జంక్షన్, కమెడియన్ల ఫన్ ప్లేస్ ఎక్కడ అంటే వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్ వేదిక మాత్రమే. గత ఏడేళ్లకు పైగా ఈ వేదికపై ఎన్నో రకాలుగా నవ్వుల హంగామా చేశారు జబర్దస్త్ వీరులు. కమెడియన్స్ పంచ్ డైలాగ్స్‌కి తోడు కాస్త గ్లామర్ టచ్ ఇస్తూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటున్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

ఈ ప్రోగ్రాం ఎంత టాప్ లో ఉంటుందో.. నిర్వాహకులు రిలీజ్ చేసే ప్రోమోలు కూడా అంతే ఉంటాయి. ప్రోమోలతో రాబోయే ఎపిసోడ్‌పై ఆసక్తి రేకెత్తించడం ఈ జబర్దస్త్ నిర్వాహకుల స్పెషాలిటీ. తాజాగా ఒక ప్రోమోని విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో ఎముందంటే.. ఆటో రామ్ ప్రసాద్, ఆది ప్రోమో ఎంట్రీలోనే కనిపిస్తారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో వచ్చే ఆటో రామ్ ప్రసాద్ హైపర్ ఆది స్కిట్ లో కూడా నవ్వులు పూయించాడు.

ఆదితో కలిసి పంచులు విసురుతూ, కామెడీను పండించాడు. వాటమ్మ వాట్ ఈజ్ దిసమ్మా అంటూ వచ్చే సాంగ్ లో మొదట డ్యాన్స్ వేస్తూ కనిపిస్తారు. సచ్చిపోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చావేంటి అన్నా అంటూ రామ్ ప్రసాద్ ను ఆది అడుగుతాడు. దానికి అతడు తనకు బస్సు పడదురా.. అందుకే ఇలా వచ్చాను అంటూ పంచ్ వేస్తాడు.

చనిపోవడానికి రామ్ ప్రసాద్, ఆది ట్రాక్ పై కూర్చోవడంతో.. ఇక్కడ వద్దురా.. ట్రాక్ తుప్పుపట్టింది.. ఇన్ ఫెక్షన్ అవుతుంది అంటూ పంచ్ వేస్తాడు ప్రసాద్. తర్వాత రైజింగ్ రాజు ఎంటర్ అవుతూ.. సూసైడ్ చేసుకోవడానికి మీరు కూడా వచ్చారా సార్ అంటూ అడుగుతాడు రాజు. అవును అంటూ రామ్ ప్రసాద్ సమాధానం ఇస్తాడు. మీరు ఎందుకు వచ్చారు సార్.. కొన్ని రోజులు ఆగితే మీరే పోయేవారు కదా అంటూ పంచ్ వేస్తాడు రామ్ ప్రసాద్.

బిగ్ బాస్ లో అసమంజసమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి..నిజాయితీగా ఆడే వారే ఎలిమినేట్ అవుతున్నారు: ప్రియ

తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బుల్లితెర సీరియల్స్ లో నటిగా నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటి ప్రియా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రియ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఏదో ఒక వివాదం ద్వారా హైలెట్ అవుతూనే ఉంది. గత కొన్ని వారాల క్రితం కంటెస్టెంట్ లహరి రవికి మధ్య ఎఫైర్ ఉందంటూ నానా హంగామా సృష్టించింది.

తను పెళ్లైన వారితోనే ఎక్కువగా ఉంటుందని ఏకంగా రవికి ముద్దులు పెడుతుందని ప్రియా చేసిన ఆరోపణలపై రవి లహరి తీవ్రస్థాయిలో ఖండించారు. ఇక పోతే బంగారు కోడిపెట్ట టాస్క్ లో భాగంగా ప్రియా సన్నీ విషయంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మాటిమాటికి తనని చెంప పగులుతుంది అంటూ హెచ్చరించడంతో ప్రియాకు పిచ్చి పట్టినట్టు ఉందని నెటిజన్లు ఈమెను దారుణంగా ట్రోల్ చేశారు.

ఇదిలా ఉండగా గతవారం నామినేషన్ లో ఉన్న ప్రియా చివరికి ఎలిమినేట్ అయింది. ఇలా హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రియా మరో వివాదానికి కారణం అయ్యింది. ఈ క్రమంలోనే ప్రియా మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో అసమంజసమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, హౌస్ లో ఉన్న కొందరు కంటెస్టెంట్ లు బయట వ్యక్తుల సపోర్టుతో ఎంతో సరదాగా ఆటను ఆడుతున్నారని కేవలం నిజాయితీగా ఆటాడే వారు మాత్రమే ఎలిమినేట్ అవుతున్నారు అని పేర్కొన్నారు.

ఇలా ఈమె బిగ్ బాస్ నిర్వాహకులకు పై చేసిన ఆరోపణలు ఎక్కడ అధికారకంగా లేకపోయినప్పటికీ ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాల పాటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన ఈమెకు సుమారు పది లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.