Tag Archives: CoviShield

16 వారాల తర్వాతే కరోనా రెండో డోసు..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకాను కూడా మనదేశంలో ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మొదటి డోసు కొవిషీల్డ్‌ వేసుకున్న తర్వాత 28 రోజులకు రెండవ డోస్ వేసుకోవాలని తెలిపింది.

కానీ తాజాగా రెండో డోస్ వ్యవధిని 12-16 వారాలకు పెంచొచ్చన్న నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించింది. అయితే కేవలం ఈ 12 నుంచి 16 వారాల వ్యవధి ఒక కొవిషీల్డ్‌ టీకాకి మాత్రమే కానీ,కొవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య అంతరంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

ఈ విధంగా రెండు డోస్ ల వ్యవధి పెంచడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చునని నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ నిపుణుల బృందం తెలిపింది. రెండవ డోసు 28 రోజుల తర్వాత తీసుకోవడం వల్ల కేవలం 55.1 శాతం మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుందని, ఈ డోస్ వ్యవధిని 12-16 వారాలకు పెంచడం వల్ల ఇది 81.3 సమర్థవంతంగా పనిచేస్తుందని అంతర్జాతీయ ది లాన్సెట్‌ పత్రిక ప్రచురించింది.

కొవిషీల్డ్‌ టీకా డోస్ ల మధ్య వ్యవధి పెంచడం ఇది రెండో సారి కావడం గమనార్హం.ఈ విధంగా విభజించడం వల్ల ఇది సమర్థవంతంగా పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించగా…మరి కొందరు మాత్రం వ్యాక్సిన్ కొరత కారణం వల్లనే ఈ విధంగా వ్యాక్సిన్ మధ్య వ్యవధి పెంచుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భయంకరమైన నిజాలు.. కరోనా రోగులకు నీళ్లతో ఇంజెక్షన్లు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారినపడి సరైన సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే వైద్య సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మరి కొందరు ప్రాణాలు తీస్తున్నారు. రోగులకు అందాల్సిన మందులను పక్కదారి పట్టిస్తూ డబ్బు పోగు చేసుకుంటున్నారు. రోగులకు అందించాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముకుంటూ, రోగులకు నీళ్లతో ఇంజెక్షన్ లు వేస్తున్న ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ మీరట్ లో చోటు చేసుకుంది.

నగరంలోని సుబర్తి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో కరోనా రోగులకు చేరాల్సిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఇద్దరు వార్డ్ బాయ్ లు కలసి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్ బయట మార్కెట్లో దాదాపు రూ.25 వేలకు అమ్మకుంటున్నట్లు పోలీసులకు తెలియడంతో ఆ వార్డ్ బాయ్ ల పై పోలీసులు మఫ్టీలో వచ్చి నిఘా వేశారు.

మఫ్టీలో వచ్చిన పోలీసులు వార్డు బాయిలను గమనించగా కరోనా రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను మార్కెట్ లో అమ్ముకుంటూ వారికి డిస్టిలరీ వాటర్ ఇంజెక్షన్లు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటమాడారు.ఇది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో ఆస్పత్రి బౌన్సర్లు పోలీసులపై దాడి చేశారు.

ఈ సంఘటనకు సంబంధించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి సుమారు 81 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంజక్షన్ లను బయట మార్కెట్లో 25 నుంచి 40 వేల వరకు అమ్ముతున్నారని డీసీసీ మోనికా భరద్వాజ్ వెల్లడించారు.

మొదటి డోసు కోవీషీల్డ్ వేసుకున్నాక.. రెండవ డోస్ కొవాగ్జిన్‌ వేయించుకుంటున్నారా..?

గత ఏడాది నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధకులు వ్యాక్సిన్ కనుక్కొని ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ “కోవీషీల్డ్”, “కొవాగ్జిన్‌” వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ మనం రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ వేయించుకున్న నాలుగు వారాల నుంచి 12 వారాల లోపు రెండో డోస్ వేయించుకోవాలి. ఈ క్రమంలోనే వైరస్ ని ఎదుర్కొనే యాంటీబాడీలు మన శరీరంలో ఉత్పత్తి అయి వైరస్ నుంచి మనల్ని రక్షిస్తాయి.

అయితే చాలా మందిలో వ్యాక్సిన్ పట్ల ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని? కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తోందని భావిస్తుంటారు. అదేవిధంగా మరికొందరు మొదటి డోస్ “కోవీషీల్డ్”వేయించుకున్న తరువాత రెండవ డోస్ “కొవాగ్జిన్‌” వేయించుకోకూడదని అలా వేయించుకోవడం వల్ల ప్రమాదాలు మరింత అధికం అవుతాయని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారంటే..

కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు కోవీషీల్డ్ తీసుకున్నవారు రెండవ డోసు కొవాగ్జిన్‌ తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు సంభవించవని, ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మొదటి డోసుకోవీషీల్డ్ తీసుకొని రెండవ డోసు కొవాగ్జిన్‌ తీసుకుంటే వ్యాక్సిన్ ప్రభావం మన శరీరంలో ఏ మాత్రం పని చేయదు. ఈ విధంగా మొదటి డోసు కోవీషీల్డ్ తీసుకొని, రెండవ డోసు కొవాగ్జిన్‌ తీసుకున్న వారు తిరిగి మరో నాలుగు వారాల తర్వాత రెండవ డోసు కొవాగ్జిన్‌ తీసుకోవటం వల్ల ఈ వ్యాక్సిన్ మన శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకానీ ఎలాంటి ప్రమాదాలకు దారి తీయదని నిపుణులు తెలియజేస్తున్నారు.