Tag Archives: Crazy Uncles

Raja Ravindra : సెట్స్ లో శ్రీముఖి అలా ఉంటుంది, మా మధ్య అంత రాపో లేదు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినా రాజా రవీంద్ర…!

Raja Ravindra : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన రాజా రవీంద్ర చాలా మంది హీరోలకు డేట్స్ కూడా చూస్తారు. వెంకటేష్, రాజ్ తరుణ్, జయసుధ వంటి వారికి సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేస్తుంటారు రాజా రవీంద్ర. తాజాగా క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటిస్తున్న రాజా ఆ సినిమాతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు. శ్రీముఖి, రాజా రవీంద్ర, భరణి, మనో కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం క్రేజీ అంకుల్స్. ఈ సత్తిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో తనతో పాటు నటించిన శ్రీముఖి గురించి రాజా రవీంద్ర చాలా బబ్లీగా ఉండే అమ్మాయి కానీ సినిమాలో తన పాత్ర చాలా సీరియస్ గా ఉంటుందని, తనను సెట్స్ లో ఆటపట్టించేంత చనువు లేదని మనో తో తాను ఎక్కువ షో లు చేయడం వల్ల తనతో చనువుగా ఉంటుందని నాతో చాలా తక్కువగా మాట్లాడుతుందంటూ వివరించారు.

హీరో అవ్వాలని ఇండస్ట్రీ కి రాలేదని హీరో అయితే చాలా టెన్షన్ పడాలని ఒక సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా హీరో మీద భాద్యత ఎక్కువ ఉంటుందని 5 కోట్లు తీసుకున్నా, 500 కోట్లు తీసుకున్నా ఒక సినిమా విడుదల అప్పుడు హీరో చాలా ఒత్తిడి ఎదుర్కొంటాడంటూ శోభన్ బాబు గారు తనతో అన్న మాటలను చెప్పారు. అందరు హీరోలు తమ వారసులను హీరోలుగా పరిచయం చేస్తున్నారు. మీరేందుకు మీ కొడుకుని సినిమాల్లోకి రానివ్వలేదు అని అడుగగా నేను శోభన్ బాబుగా ప్రతి సినిమాకు ఎంతో టెన్షన్ పడతాను. ఆ టెన్షన్, ఒత్తిడి నా కొడుకు ఎందుకు భరించాలి.

కొన్ని వేల కోట్లు సంపాదించినా ఒక సినిమా విడుదల అప్పుడు ఒక హీరో పడే టెన్షన్ మామూలుగా ఉండదు. అలాంటి టెన్షన్ నా కొడుకుకి ఇవ్వాలనుకోవడం లేదని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఇక హీరోయిన్ల డేట్స్ ఎందుకు చూడడం లేదని అడుగగా ఒక హీరో ఒక సమయంలో ఒక సినిమానే తీస్తాడు. కానీ హీరోయిన్స్ అలా కాదు వివిధ భాషలలో ఏక కాలంలో సినిమాలు తీస్తుంటారు. ఒక్కోసారి అలా డేట్స్ క్లాష్ అవుతుంటాయి. అపుడు వాళ్ళ మేనేజర్స్ పడే టెన్షన్ చాలా సార్లు చూసాను అందుకే హీరోయిన్స్ జోలికి వెళ్లనని చెప్పారు.

రవితేజ కాళ్లు కడిగిన సీనియర్ నటుడు.. ఎందుకో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరని చెప్పవచ్చు. రవితేజ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత హీరోగా సినీ అవకాశాలను అంది పుచ్చుకుంటూ ప్రస్తుతం మాస్ మహారాజ్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.

రవితేజతో పాటు ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చి అతనితో పాటు ప్రయాణం చేశారు. ఈ విధంగా రవితేజతో కలిసి రఘు కుంచే, బ్రహ్మాజీ, పూరి జగన్నాథ్, రాజా రవీంద్ర వంటి నటులు కూడా ఉన్నారు. రవితేజ ప్రతి కష్టంలోనూ వీరు కూడా తన వెంటే ఉండి తన కష్టాలను పంచుకున్నారు.తాజాగా నటుడు రాజా రవీంద్ర క్రేజీ అంకుల్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ రవితేజ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రవితేజతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని, రవితేజ తనని ఎప్పుడు మామ అని పిలుస్తుంటారు అని చెప్పారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ ఒక సందర్భంలో రవితేజ కాళ్లు కూడా కడిగానని రాజారవీంద్ర పేర్కొన్నారు. అసలు రవితేజ కాళ్లు కడగడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

రవితేజ పెళ్లి సమయంలో తనకు కాళ్లు కడిగి కన్యాదానం చేయాల్సిన అత్తమామలు అనారోగ్య సమస్య కారణంగా పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే రాజారవీంద్రని రవితేజ మామ అని పిలుస్తున్న కారణం చేత పెళ్లి సమయంలో రవితేజ కాళ్ళు కూడా కడిగానని ఈ సందర్భంగా రాజా రవీంద్ర రవితేజకు తనకి మధ్య ఉన్న బంధం గురించి వెల్లడించారు. ఇక స్టార్ హీరోగా రవితేజ గుర్తింపు పొందిన సమయంలో తనని మేనేజర్ గా చేసి తన డేట్స్ అన్ని చూసుకునే వ్యవహారాలను తనకు అప్పగించారని ఈ సందర్భంగా రాజ రవీంద్ర రవితేజ గురించి తెలియజేశారు.

అదే సమయంలో రవితేజ తో వచ్చిన క్లాష్ గురించి మాట్లాడుతూ.. ఆయనకి ఎవరో నా గురించి ఏవేవో చెప్పడం మొదలు పెట్టారు. కొద్దిరోజులు భరించిన రవితేజ ఆ తరువాత “మనిద్దరం హీరో, మేనేజర్ కంటే ఫ్రెండ్స్ గా ఉండిపోవడమే బెటర్ ఏమోరా” అని అన్నాడు.. అయన అలా అనే సరికి నేను ఇంకేం మాట్లాడలేదు.. “ఓకే రా ఆల్ ది బెస్ట్” అని చెప్పేసి వచ్చేసా.. ఇప్పటికీ ఫ్రెండ్ గా కలుస్తూనే ఉంటాం. అని చెప్పారు రాజ రవీంద్ర.

ఈ వారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. తెలుసుకోండి..

జెండా వందనం సందర్భంగా అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో పలు సినిమాలు సందడి చేశాయి. దీంతో పాటే మరికొన్ని చిత్రాలు కూడా అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్ధాం.. కనపడుటలేదు.. సునీల్ నటించిన ఈ చిత్ర ట్రైలర్ అందరికీ నచ్చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు దర్శకుడు బాలరాజు. మరో చిత్రం రాజ రాజ చోర. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెప్పుకునే ఓ దొంగ కథని దర్శకుడు హసిత్‌ గోలి అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక యాంకర్ గా.. ఎంతో బిజీగా బుల్లితెర తార శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం క్రేజీ అంకుల్స్ కూడా ఆగస్టు 19 న మన థియోటర్లో చక్కెర్లు కొట్టనుంది. తాము కుర్రతనంలో చేయలేకపోయిన చిలిపి పనులు ఇప్పుడు చేద్దామని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఒక అందమైన అమ్మాయి స్వీటీ (శ్రీముఖి) వెంట పడతారు. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేదే మిగతా కథ. దీనిని ఇ సత్తిబాబు తెరకెక్కించారు.

ఆగస్టు 19 నే మరో అంతర్జాతీయ చిత్రం కూడా విడుదల కానుంది. అదే ఎఫ్‌9 చిత్రం. ఇప్పటికే అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. విన్‌ డీజిల్‌, మిచెల్లీ రోడ్రిగోజ్‌, టైర్సీ గిబ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 19న ఇంగ్లీష్‌, హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. జస్టిన్‌ లిన్‌ దర్శకత్వం వహించారు.

బర్నింగ్ స్టార్ గా పిలవడబుతున్న సంపూర్ణష్ బాబు సినిమా ‘బజార్‌ రౌడీ’. ఇది ఆగస్టు 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాస్‌ తరహా సన్నివేశాలతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కె.ఎస్‌. క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. థియేటరల్లో కాకుండా ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఏంటంటే.. ఆహాలో ఆగస్టు 20 న ‘తరగతి గది దాటి’ విడుదల కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ లో ఆగస్టు 16 న ఇవాన్ అల్మైటీ , ద స్కెలిటన్‌ ట్విన్స్‌ (ఆగస్టు 17), నైన్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (ఆగస్టు 18), అన్నెట్టే (ఆగస్టు 20), కిల్లర్‌ ఎమాంగ్‌ అజ్‌ (ఆగస్టు 20), హోమ్‌ (ఆగస్టు 19) విడుదల కానున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్‌ లో కామెడీ ప్రీమియం లీగ్‌ కామెడీ షో (ఆగస్టు 20), స్వీట్‌గర్ల్‌ (ఆగస్టు 21) విడుదల కానున్నాయి.