జెండా వందనం సందర్భంగా అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో పలు సినిమాలు సందడి చేశాయి. దీంతో పాటే మరికొన్ని చిత్రాలు కూడా అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్ధాం.. కనపడుటలేదు.. సునీల్ నటించిన ఈ చిత్ర ట్రైలర్ అందరికీ నచ్చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు దర్శకుడు బాలరాజు. మరో చిత్రం రాజ రాజ చోర. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చెప్పుకునే ఓ దొంగ కథని దర్శకుడు హసిత్ గోలి అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక యాంకర్ గా.. ఎంతో బిజీగా బుల్లితెర తార శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం క్రేజీ అంకుల్స్ కూడా ఆగస్టు 19 న మన థియోటర్లో చక్కెర్లు కొట్టనుంది. తాము కుర్రతనంలో చేయలేకపోయిన చిలిపి పనులు ఇప్పుడు చేద్దామని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఒక అందమైన అమ్మాయి స్వీటీ (శ్రీముఖి) వెంట పడతారు. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేదే మిగతా కథ. దీనిని ఇ సత్తిబాబు తెరకెక్కించారు.
ఆగస్టు 19 నే మరో అంతర్జాతీయ చిత్రం కూడా విడుదల కానుంది. అదే ఎఫ్9 చిత్రం. ఇప్పటికే అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. విన్ డీజిల్, మిచెల్లీ రోడ్రిగోజ్, టైర్సీ గిబ్సన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 19న ఇంగ్లీష్, హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. జస్టిన్ లిన్ దర్శకత్వం వహించారు.
బర్నింగ్ స్టార్ గా పిలవడబుతున్న సంపూర్ణష్ బాబు సినిమా ‘బజార్ రౌడీ’. ఇది ఆగస్టు 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాస్ తరహా సన్నివేశాలతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కె.ఎస్. క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. థియేటరల్లో కాకుండా ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఏంటంటే.. ఆహాలో ఆగస్టు 20 న ‘తరగతి గది దాటి’ విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 16 న ఇవాన్ అల్మైటీ , ద స్కెలిటన్ ట్విన్స్ (ఆగస్టు 17), నైన్ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ (ఆగస్టు 18), అన్నెట్టే (ఆగస్టు 20), కిల్లర్ ఎమాంగ్ అజ్ (ఆగస్టు 20), హోమ్ (ఆగస్టు 19) విడుదల కానున్నాయి. ఇక నెట్ఫ్లిక్స్ లో కామెడీ ప్రీమియం లీగ్ కామెడీ షో (ఆగస్టు 20), స్వీట్గర్ల్ (ఆగస్టు 21) విడుదల కానున్నాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…