పెరుగును ప్రతీ ఒక్కరు ఇష్టపడుతుంటారు. అన్నం తిన్న తర్వాత చివరలో ఎవరైనా పెరుగు వేసుకొని అన్నం తింటారు. దీనికి కారణం ఏంటంటే.. కడుపులో అది చల్లదనాన్ని ఇస్తుంటుంది. అందుకే పెరుగు అన్నం తినకుండా కూడా చాలామంది ఉండలేరు. అంతటి స్థానాన్ని సంపాదించుకుంది పెరుగు.
అయితే ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం మానవ శరీరంలో ఎముకలు గట్టిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అది కొలెస్ట్రాల్ మరియు అధిక బీపీ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మ సంబధిత వ్యాధులను కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలేవారికి కూడా ఈ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ కొన్ని వ్యాధులు ఉన్న వారు పెరుగు తీసుకోవడం చాలా ప్రమాదకరం.
అలాగే పెరుగును ప్రతిరోజూ అవసరానికి మించి తీసుకుంటే అనేక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న వారు పెరుగు తీసుకోవడం మంచిది కారు. అర్థరైటిస్ రోగులు పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలి.
ఎందుకంటే అది నొప్పిని ఇంకా తీవ్ర తరం చేస్తుంది. అంతేకాకుండా శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడేవారు కూడా పెరుగును తీసుకోకుండా ఉండటమే మంచిది. పెరుగు తినాల్సి వస్తే కేవలం పగటి పూట మాత్రమే పెరుగు తీసుకోవాలి. అసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవారు కూడా పెరుగును అస్సలు తినకపోవడం మంచిది. ముఖ్యంగా రాత్రి పూట పెరుగు అస్సలు ముట్టుకోవద్దు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…