Tag Archives: crime

నమ్మించి.. స్నేహితుడి భార్యతో ప్రేమాయాణం సాగించాడు.. చివరకు ఇలా జరిగింది..

వివాహేతర సంబంధాలు ఎంత దూరం అయినా తీసుకెళ్తాయి. వాటి వల్ల ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇలాంటి ఘటన ఒకటి మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను నిలదీసిన భర్త.. ఆ భార్య మాత్రం పట్టించుకోలేదు.

దీంతో మనస్తాపానికి గురైన సదరు వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ టీటీ నగర్ కు చెందిన గొల్లు బలన్(25), సుధా(22)లు భార్యాభర్తలు. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

అయితే గొల్లు బాలన్ కు తన స్నేహితుడు సాగర్ ఉండేవాడు. అతడు తరచూ తన ఇంటికి వచ్చి సుధాతో మాట్లాడుతుండేవాడు. ఫ్రేండే కదా అని అతడు అంతగా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు జరగరాని ఘటన జరిగిపోయింది. సాగర్, సుధాతో ప్రేమయాణం నడిపించాడు. ఇది గమనించిన గొల్లు బాలన్ భార్యను నిలదీశాడు. కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు.

దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత రోజు భర్త సూసైడ్ చేసుకున్నాడని తెలిసి భార్య కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారికి పుట్టిన నాలుగేళ్ల బిడ్డ అనాథగా మారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తల చావుకు కారణమైన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనాథ అయిన నాలుగేళ్ల కొడుకు, గొల్లు తల్లి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రేమించాడు.. శారీరకంగా దగ్గర అయ్యాడు.. పెళ్లి చేసుకోమంటే ఇలా చేశాడు..

ఇటీవల కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో యువతులు మోస పోతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకొని తిరిగి .. చివరకు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటేసే మోసగాళ్లు ఈ మధ్య ఎక్కువయ్యారు.

అలాంటి వారికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ.. పెజ్జోనిపేటకు చెందిన ఓ యువతి ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్‌ చదువుతోంది.

మొదట్లో తన తోటి మహిళలతో స్నేహం చేసిన సదరు యువతి.. తర్వాత తన క్లాస్ కు చెందిన యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయాన్ని అతడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు తోటి విద్యార్థి సుహృద్‌. ప్రేమిస్తున్నట్లు వెంట పడ్డాడు. ఆమె మొదట నిరాకరించింది. పెళ్లి చేసకుంటానని నమ్మించాడు.

తర్వాత ఆమెను తీసుకొని బయట తిరగడం ప్రారంభించాడు. ఇలా పలుమార్లు ఆమెపై లైగికంగా దగ్గరయ్యాడు. తర్వాత ఓ రోజు సదరు యువతి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయగా అతడి నిజ స్వరూపం బయటపడింది. ఒత్తిడి ఎక్కువగా రావడంతో ఆమెకు దూరంగా ఉంటూ.. తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. దీంతో యువతి తనను మోసం చేశాడని తెలుసుకొని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే?

ప్రస్తుత కాలంలో ఒకరి భార్య మరొకరికి భర్తతో మరొకరి భార్య వేరొకరి భర్తతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అధికమయ్యాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వివాహేతర సంబంధాలు ఉండటం వల్ల రోజుకు ఎంతో మంది హత్యలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాజమహేంద్రవరంలోని బొమ్మూరు బత్తిన నగర్ కు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నగరంలోనీ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా వీరి పక్క వాడలో నివసిస్తున్న అటువంటి రమేష్ అనే వ్యక్తితో దుర్గాప్రసాద్ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి దుర్గాప్రసాద్ కు తెలిసింది.

ఈ క్రమంలోనే తన భార్య గురించి తెలుసుకున్న దుర్గాప్రసాద్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెతో తీవ్రంగా గొడవ పడ్డాడు.ఈ క్రమంలోనే తన భార్య పిల్లలను తన పుట్టింటికి పంపించిన దుర్గాప్రసాద్ ఎలాగైనా రమేష్ ను హత్య చేయాలని భావించాడు. దుర్గా ప్రసాద్ పథకం ప్రకారమే మరొక ఇద్దరి సహాయంతో రమేష్ హత్యకు ప్లాన్ వేశారు.

ఆదివారం దేవి చౌక్ ప్రాంతానికి వచ్చిన దుర్గాప్రసాద్ ను వెంబడించి లింగంపేట వాంబే కాలనీ వద్దకు రాగానే కత్తితో అతనిపై దాడి చేసి అక్కడ నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా అప్పటికే రమేష్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇక హంతకులు ఎవరు అనే విషయం గురించి పోలీసులు ఆరా తీస్తూ ఆ రోజు సాయంత్రానికి హంతకుడు దుర్గా ప్రసాద్ ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ఆరువేల కోసం గొడవ పడిన భార్య భర్త.. చివరికి ఏం చేశారంటే?

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు మనస్పర్థలు రావడం సర్వసాధారణం.అయితే ఇలాంటి గొడవలు వచ్చిన సమయంలో ఎవరో ఒకరు సర్దుకుని ముందుకు వెళితే వారి సంసారం పదికాలాలపాటు పచ్చగా ఉంటుంది.కానీ ప్రస్తుత కాలంలో ఏ చిన్నపాటి గొడవ జరిగినా క్షణికావేశంలో ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకొని బంగారంలాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసాంగికాలనీకి చెందిన కోదండం సాయిలు, పోచవ్వ దంపతులకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు. ఈ క్రమంలోనే ఈ దంపతుల మద్య అక్టోబర్ 27వ తేదీ రాత్రి ఆరువేల డబ్బుల విషయంలో గొడవ చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే 28వ తేదీ ఉదయం మరోసారి డబ్బు గురించి గొడవ పడిన భార్య భర్తలు ఆ రోజు సాయంత్రానికి కనిపించకుండా వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే దంపతుల కోసం అన్ని చోట్ల గాలించిన బంధువులు చివరికి మిస్సింగ్ కేసు కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం సాయంత్రం రాజనగర్ ప్రాంతంలోని చర్చి కాలనీలో వీరి మృతదేహాలు బయటపడ్డాయి.

సాయిలు ఒంటికి పట్టించుకోని ఆత్మహత్యకు పాల్పడగా పోచవ్వ పక్కనే ఉన్న కొలనులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే అక్కడ వదిలేసినటువంటి వీరి చెప్పులు, దుస్తులు ఆధారంగా పోలీసులు వీరిని గుర్తించారు. ఇలా చిన్న విషయానికి గొడవపడి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య పెద్దఎత్తున విషాదఛాయలు అలుముకున్నాయి.

ఢిల్లీలో దారుణం.. పట్టపగలు మహిళ గొంతు కోసిన దుర్మార్గుడు..

దేశ రాజధాని ఢిల్లీలో ఏం చేయడానికైనా వెనకాడం లేదు దుండగులు. పట్టపగలు ఓ మహిళను నడిరోడ్డుపై దారుణంగా గొంతకోసి చంపేశాడు. సదరు మహళ కూరగాయల బండి పెట్టుకొని జీవిస్తుంది. రాజపురిలోని సోమ్ బజార్ ప్రాంతంలో ఈ ఘోరం వెలుగు చూసింది. దీనికి సబంధించి వీడియో అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది.

ఢిల్లీలోని డాబ్రి ప్రాంతంలో రద్దీగా ఉండే రాజపురిలోని సోమ్ బజార్ మార్కెట్లో ఈ ఘటన జరిగింది. రాజపురిలోని సోమ్ బజార్ రోడ్డులో విభ (30) అనే మహిళ ఇద్దరు పిల్లలతో చిన్న కూరగాయల షాప్‌ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమె దగ్గరకు దిలీప్ అనే వ్యక్తి కూరగాయలు తీసుకొని డబ్బులు చెల్లించలేదు. వాటిని తాను అప్పుగా తీసుకున్నాని పేర్కొన్నాడు.

అప్పు చెల్లించాలని ఆ మహిళ ప్రశ్నించడంతో ఆ వ్యక్తి కత్తితో ఆమె గొంతుకోసినట్లు పోలీసులు వెల్లడించారు. గొడవ అనంతరం తొలుత సదరు మహిళ వద్దకు రావడానికి నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చీపురు చూపించి ఆ మహిళ అతన్ని బెదిరించింది. దీంతో తన చేతిలోని సంచిని కింద పెట్టిన నిందితుడు దీపక్.. సంచిలో నుంచి కత్తి తీసి మహిళపై దాడి చేశాడు.

ఆమె గొంతు కోసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు అతడి పట్టుకొని చితక్కొట్టారు. ఆమెను అక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిదంటూ వైద్యులు వెల్లడించారు. అక్కడ జరిగిన ఈ ఉదంతం మొత్తం సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. గాయపడిని ఆ నిందితుడిని పోలీసులు మొదట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదంతో నిండిపోయింది. బాధిత మమిళ చిన్న పిల్లలు అనాథలుగా మారారు.

60 ఏళ్ల మామ పై కన్నేసిన కోడలు… తన సంతోషం కోసం ఇంత దారుణానికి ఒడిగట్టిన కోడలు..!

ఈ మధ్య కాలంలో సమాజంలో మానవతా విలువలు పూర్తిగా మంట కలిసిపోతున్నాయి. తల్లి తండ్రి అన్నా చెల్లెలు, తండ్రి కూతురు, మామ కోడలుఅన్న సంబంధాలు మరచిపోయి కేవలం శారీరక సుఖం కోసం ఎంతటి దారుణానికి అయినా పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే కోడలు కేవలం తన శారీరక సుఖం కోసం మామ పై కన్నేసి మామ ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..

పంజాబ్ లోని లాహోర్ పట్టణం. బిలాల్‌ హసన్, నహీద్‌ ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వీరికి బాయ్ బాయ్ ఇక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో తన భర్త ఉద్యోగం నిమిత్తం ఎక్కువగా బయటకు వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే కోడలు తన 60 సంవత్సరాల మామ పై కన్నేసింది. ఈ క్రమంలోనే అతనికి వయాగ్రా టాబ్లెట్స్ అతనికి తనపై కోరిక కలిగేలా చేసింది.

ఈ క్రమంలోనే కోడలు తన మామతో శారీరక సంబంధం పెట్టుకునేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఎక్కువసార్లు తన కోడలితో మామ గడపటం వల్ల వయసు పైబడటం చేత గుండెపోటు వచ్చి మరణించాడు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు తన శవాన్ని పోస్టుమార్టానికి పంపించగా దిమ్మతిరిగిపోయే నిజం బయటపడింది.

సదరు పేషెంట్ ఎక్కువసార్లు శారీరక సంబంధాలు పెట్టుకోవడం వల్ల గుండెపోటు వచ్చే మరణించిందని తెలియడంతో కోడలిపై అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కొడుకు తన భార్య పై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులకు విస్తుపోయే నిజాలను ఆ కోడలు బయటపెట్టింది.

భర్తను కట్టుకున్న భార్యే హతమార్చింది.. ప్రైవేట్ పార్ట్ పై మరి దారుణంగా కొట్టి..

మద్యం తాగి వచ్చి భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త మర్మాంగాలను కోసేసింది ఓ వివాహిత. ఈ ఘటన చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు గ్రామంలో చోటు చేసుకుంది. కేశవ, రేఖకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వారి సంసార జీవితం కొన్ని రోజుల వారకు బాగానే సాగింది. కానీ ఆర్ధిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా కేశవ మద్యానికి బానిసయ్యాడు.

పలమనేరు టమాటా మార్కెట్లో హమాలిగా పనిచేసే కేశవ వచ్చిన డబ్బంతా మద్యానికి ఖర్చు పెడుతూ ఉండేవాడు. తర్వాత ఇంటికి వచ్చి భార్యను ఇబ్బందుకు గురి చేసేవాడు. దీంతో ఆమె అతడి వేధింపులకు తట్టుకోలేకపోయింది. దీంతో మద్యం మత్తులో ఉన్న భర్త ను హతమార్చింది. తర్వాత ప్రమాదవశాత్తూ చనిపోయాడని అందర్నీ నమ్మించింది. మద్యం మత్తులో ఇంటి మేడపై నుంచి జారిపడినట్లు ఇంటి పక్క వారికి, పోలీసులను ఆమె నమ్మించింది.

ఐతే కేశవ తల్లి మాత్రం తన కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోలేదని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
తాజాగా పోస్ట్ మార్టం రిపోర్టులో మర్మాంగాలపై బలమైన గాయాలున్నట్లు వెల్లడైంది.

పోలీసులు కేశ‌వ భార్య‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు నిజం భ‌య‌ట‌పెట్టేసింది. త‌న భర్త ప్ర‌తి రోజూ మ‌ద్యం సేవించి వ‌చ్చి వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని అందుకే మ‌ర్మాంగంపై కొట్టి చంపాన‌ని నిజం ఒప్పుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.