సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు మనస్పర్థలు రావడం సర్వసాధారణం.అయితే ఇలాంటి గొడవలు వచ్చిన సమయంలో ఎవరో ఒకరు సర్దుకుని ముందుకు వెళితే వారి సంసారం పదికాలాలపాటు పచ్చగా ఉంటుంది.కానీ ప్రస్తుత కాలంలో ఏ చిన్నపాటి గొడవ జరిగినా క్షణికావేశంలో ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకొని బంగారంలాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసాంగికాలనీకి చెందిన కోదండం సాయిలు, పోచవ్వ దంపతులకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు. ఈ క్రమంలోనే ఈ దంపతుల మద్య అక్టోబర్ 27వ తేదీ రాత్రి ఆరువేల డబ్బుల విషయంలో గొడవ చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే 28వ తేదీ ఉదయం మరోసారి డబ్బు గురించి గొడవ పడిన భార్య భర్తలు ఆ రోజు సాయంత్రానికి కనిపించకుండా వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే దంపతుల కోసం అన్ని చోట్ల గాలించిన బంధువులు చివరికి మిస్సింగ్ కేసు కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం సాయంత్రం రాజనగర్ ప్రాంతంలోని చర్చి కాలనీలో వీరి మృతదేహాలు బయటపడ్డాయి.
సాయిలు ఒంటికి పట్టించుకోని ఆత్మహత్యకు పాల్పడగా పోచవ్వ పక్కనే ఉన్న కొలనులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే అక్కడ వదిలేసినటువంటి వీరి చెప్పులు, దుస్తులు ఆధారంగా పోలీసులు వీరిని గుర్తించారు. ఇలా చిన్న విషయానికి గొడవపడి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య పెద్దఎత్తున విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…