వివాహేతర సంబంధాలు ఎంత దూరం అయినా తీసుకెళ్తాయి. వాటి వల్ల ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇలాంటి ఘటన ఒకటి మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను నిలదీసిన భర్త.. ఆ భార్య మాత్రం పట్టించుకోలేదు.
దీంతో మనస్తాపానికి గురైన సదరు వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ టీటీ నగర్ కు చెందిన గొల్లు బలన్(25), సుధా(22)లు భార్యాభర్తలు. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు.
అయితే గొల్లు బాలన్ కు తన స్నేహితుడు సాగర్ ఉండేవాడు. అతడు తరచూ తన ఇంటికి వచ్చి సుధాతో మాట్లాడుతుండేవాడు. ఫ్రేండే కదా అని అతడు అంతగా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు జరగరాని ఘటన జరిగిపోయింది. సాగర్, సుధాతో ప్రేమయాణం నడిపించాడు. ఇది గమనించిన గొల్లు బాలన్ భార్యను నిలదీశాడు. కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు.
దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత రోజు భర్త సూసైడ్ చేసుకున్నాడని తెలిసి భార్య కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారికి పుట్టిన నాలుగేళ్ల బిడ్డ అనాథగా మారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తల చావుకు కారణమైన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనాథ అయిన నాలుగేళ్ల కొడుకు, గొల్లు తల్లి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…