వివాహేతర సంబంధాలు ఎంత దూరం అయినా తీసుకెళ్తాయి. వాటి వల్ల ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇలాంటి ఘటన ఒకటి మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను నిలదీసిన భర్త.. ఆ భార్య మాత్రం పట్టించుకోలేదు.
దీంతో మనస్తాపానికి గురైన సదరు వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ టీటీ నగర్ కు చెందిన గొల్లు బలన్(25), సుధా(22)లు భార్యాభర్తలు. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు.
అయితే గొల్లు బాలన్ కు తన స్నేహితుడు సాగర్ ఉండేవాడు. అతడు తరచూ తన ఇంటికి వచ్చి సుధాతో మాట్లాడుతుండేవాడు. ఫ్రేండే కదా అని అతడు అంతగా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు జరగరాని ఘటన జరిగిపోయింది. సాగర్, సుధాతో ప్రేమయాణం నడిపించాడు. ఇది గమనించిన గొల్లు బాలన్ భార్యను నిలదీశాడు. కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు.
దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత రోజు భర్త సూసైడ్ చేసుకున్నాడని తెలిసి భార్య కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారికి పుట్టిన నాలుగేళ్ల బిడ్డ అనాథగా మారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తల చావుకు కారణమైన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనాథ అయిన నాలుగేళ్ల కొడుకు, గొల్లు తల్లి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…